Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బంగారు భారత్‌ చేద్దాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2022

బంగారు భారత్‌ చేద్దాం

- పోరాటానికి నేను సిద్ధం
- మత విద్వేషాలున్న చోట అభివృద్ధి జరగదు: ఖేడ్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌..
- సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్‌ నిర్మాణానికి భూమిపూజ
- రూ.4 వేల కోట్లతో 4లక్షల ఎకరాలకు సాగునీరు
నవతెలంగాణ-నారాయణఖేడ్‌, మెదక్‌డెస్క్‌
'దేశంలో నేడు దుర్మార్గపాలన సాగుతోంది. కులం, మతం, వర్గాల పేరిట విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా నేటికీ దౌర్భాగ్య స్థితిలోనే దేశం కొట్టుమిట్టాడుతున్నది. దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. భారతదేశాన్ని బాగు చేయాలి. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం. మనం ఇతర దేశాలకు పోవడం కాదు.. ఇతర దేశాల వారు వీసాలు తీసుకుని ఇక్కడికి రావాలి. అందుకోసం పోరాటానికి నేను సిద్ధమయ్యాను. మీరూ కొట్లాడాలి' అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జుజల్‌పూర్‌ శివారులోని ఆంధ్ర డిగ్రీ కాలేజీ సమీపంలో రూ.4,427 కోట్లతో నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
   ఒకప్పుడు ఎంపీ ఎన్నికల సమయంలో అల్లాదుర్గ్‌లో జరిగిన సమావేశానికి హాజరై.. కాళేశ్వరం పూర్తి అయితే అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి తెచ్చిచ్చే బాధ్యత తనదే అని చెప్పాననీ, అదేవిధంగా నేడు సుమారు 4లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు కోసం రూ.4వేల కోట్లతో శంకుస్థాపన చేశామని తెలిపారు. ఏడాదిన్నర లోపు ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని తెప్పించాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలకు వచ్చే నీటికంటే ఎక్కువగా అందోల్‌కు నీరు రానున్నదన్నారు. అందోల్‌ నియోజకవర్గంలో 1.70లక్షల ఎకరాలకు నాలుగు ప్రాజెక్టుల ద్వారా నీరు అందుతుందని చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి సుమారు 300 కి.మీ ప్రయాణించి సింగూరుకు లిఫ్ట్‌ ద్వారా నీళ్లు రానున్నాయన్నారు. సింగూరులో 14 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్‌లోకి వదులుతామని తెలిపారు.
జహీరాబాద్‌, సంగారెడ్డి పట్టణాలకు రూ.50కోట్లు మంజూరు..
   జహీరాబాద్‌, సంగారెడ్డి పట్టణాలకు ఒక్కోదానికి రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఖేడ్‌, జోగిపేట, సదాశివపేట, బొల్లారం, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌ మున్సిపాల్టీలకు రూ.25 కోట్లు, జిల్లాలోని 699 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలను మంజూరు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించి రేపు జీఓ విడుదల చేస్తామన్నారు. త్వరలోనే సమావేశం పెట్టి తాండాలకూ నిధులు మంజూరు చేయించి రోడ్లు వేయిస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్‌ రోడ్లను జూన్‌లోపు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అలాగే నిజాంపేటను మండలంగా ఏర్పాటు చేస్తామన్నారు.
   వారం, పదిరోజుల తర్వాత కేతకి సంగమేశ్వరకు వస్తానని సీఎం కేసీఆర్‌ అన్నారు. అదే సమయంలో సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ప్రారంభిస్తామని తెలిపారు. సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్‌, ఎంపీ బీబీ పటేల్‌, ఎమ్మెల్యేలు మహా రెడ్డి భూపాల్‌ రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, పద్మ దేవేందర్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్‌ దేవేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.