Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీలో జగడం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2022

బీజేపీలో జగడం

- హైదరాబాద్‌లో అసంతృప్త నేతల భేటీ !
- బండి సంజయ్ తీరుపై సీనియర్ల ఆగ్రహం
- వందమందికిపైగా హాజరు?
- పార్టీకి నష్టం చేస్తే వేటు తప్పదు: బండి సంజయ్
- త్వరలో మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తామన్న అసంతృప్తివాదులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో నెలకొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నది. మొన్నటిదాకా కరీంనగర్‌ జిల్లా సీనియర్‌ నేతల్లోనే నెలకొన్న అసంతృప్తి రాష్ట్రమంతటా వ్యాపిస్తున్నది. సీనియర్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌ వ్యవహరిస్తున్న తీరు నచ్చకనే వారంతా ఒక్కటవుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రెండుమూడు సార్లు భేటీ అయిన అసంతృప్త నేతలు తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో ఓ రహస్య ప్రదేశంలో సమావేశమైనట్టు సమాచారం. 'భేటీ అయింది వాస్తవమే. ఎక్కడ జరిగింది? ఏం మాట్లాడాం? ఇతర అంతర్గత విషయాలు మీతో చెప్పలేం. సందర్భం వచ్చినప్పుడు మీడియా ముందుకు మేమే వచ్చి చెబుతాం' అంటూ ఆ మీటింగ్‌లో పాల్గొన్న ఒక అంసతృప్త నేత దాటవేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌ కూడా కూడా స్పందించారు. 'అన్ని పార్టీల్లోనూ నిత్య అసంతృప్తివాదులుంటారు. పార్టీకి నష్టం చేకూర్చే వారు ఎంతటి వారైనా సరే వేటు తప్పదు' అని కరీంనగర్‌ జిల్లా పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ స్పష్టం చేయడం గమనార్హం. బీజేపీ సీనియర్‌ నేతలంతా బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌, ఇతర పార్టీల నుంచి వచ్చి చక్రం తిప్పుతున్న నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. సీనియర్ల అసంతృప్తి పంచాయతీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దాకా చేరింది. ఆ తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకున్నా, సీరియస్‌ అయినా పంచాయతీ మాత్రం తెగలేదు. అది కాస్తా జఠిలమైంది. బండి సంజరు టార్గెట్‌గా కరీంనగర్‌లో గతంలో అసంతప్త నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. వారికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు నేతృత్వం వహించారు. సంజయ్ ఒంటెద్దు పోకడలను వారు నిరసించారు. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌కే సంజయ్ ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవట్లేదనే అక్రోశంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎ.లక్ష్మినారాయణ, ముగ్గురు, నలుగురు కార్పొరేటర్లు కూడా వారితో జతకట్టారు. పార్టీ పదవిని విడిచిపెట్టనప్పటికీ కొంతకాలంగా అంటీముట్టనట్టు ఉంటున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన సోమారపు సత్యనారాయణ కూడా వారికి తోడయ్యారు. ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, సీనియర్‌ నేతలు రాజేశ్వర్‌రావు, చింత సాంబమూర్తి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌ , ఆదిలాబాద్‌ జిల్లాల పలువురు సీనియర్‌ నాయకులు ఈ అసంతృప్తుల గ్రూపుతో జతకట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించిన వీరు పార్టీలో అన్యాయానికి గురవుతున్నవారిని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. దీనిని పసిగట్టిన రాష్ట్ర నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్టీకి నష్టం చేకూరుస్తున్న నేతలపై ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డితో బండి సంజరు గతంలోనే చర్చించారు. కరీంనగర్‌కు చెందిన ఇద్దరు నేతలపై వేటు వేయాలని అభిప్రాయానికి వచ్చినప్పటికీ పార్టీకి నష్టం చేకూరే ప్రమాదం ఉందనే ఆలోచనతో కొంత వెనుకడుగు వేశారు. మళ్లీ మరోమారు అసంతప్త నేతలు హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశం అయ్యారనే విషయం ఆ పార్టీ అగ్రనేతల్ని కలవరపెడుతున్నది. ఓ అసంతృప్త నేతతో నవతెలంగాణ మాట్లాడేందుకు యత్నించగా పూర్తి విషయాలు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ భేటీలను అగ్రనేతలు తేలికగా కొట్టిపారేస్తున్నప్పటికీ..సమావేశమైన వారిలో మొదటి నుంచీ పార్టీనే అంటిపెట్టుకున్నవారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉండటం బీజేపీని కలవరపెడుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.