Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉద్యోగాలేవీ? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2022

ఉద్యోగాలేవీ?

- రాష్ట్రంలో నిరుద్యోగం ఏడు శాతం
- నగరంలో 10.2 శాతం
- ఖాళీలున్నా... నోటిఫికేషన్లు సున్నా
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకేతీరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
నిరుద్యోగులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉపాధి అవకాశాల్లేకుండా పంజా విసిరింది. ఉద్యోగాలున్న వారు సైతం ఉపాధి కోల్పోయేలా చేసింది. కరోనా దెబ్బకు పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనపై శీతకన్ను ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్నా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దీంతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తీరు పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు కరోనా, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నిరుద్యోగం రేటు పెరుగుతున్నది. నిరుద్యోగం రేటు ఎక్కువున్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఏడు శాతం నమోదైంది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ (పీఎల్‌ఎఫ్‌) సర్వే వివరాలను ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 3.9 శాతం, పట్టణాల్లో 6.9 శాతం నిరుద్యోగం రేటు ఉన్నది. జాతీయ స్థాయిలో 15 ఏండ్లు పైబడిన వారిలో నిరుద్యోగం మొత్తం 4.8 శాతం నమోదైంది. ఇక తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 5.2 శాతం, నగరంలో 10.2 శాతం నిరుద్యోగం రేటు ఉన్నది. రాష్ట్రంలో 15 ఏండ్లకు పైబడిన వారిలో నిరుద్యోగం ఏడు శాతం నమోదైంది. కేరళలో పది శాతం, ఢిల్లీలో 8.6 శాతం, అస్సాంలో 7.9 శాతం, పంజాబ్‌లో 7.3 శాతం, ఉత్తరాఖండ్‌లో 7.1 శాతం ఉన్నది. తెలంగాణ పక్కనున్న ఏపీలో 4.7 శాతం నిరుద్యోగం రేటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగం ఎక్కువుండడం గమనార్హం.
కేంద్రంలో 8.72 లక్షల ఖాళీలు
   కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో మంజూరైన మొత్తం పోస్టులు 40,04,941 ఉన్నాయి. అందులో ప్రస్తుతం 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్సీ 25,267 పోస్టులు, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2,14,601 పోస్టులు, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2,04,945 పోస్టులు కలిపి మొత్తం 4,44,813 పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో కలిపి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోడీ వాగ్దానం నీటి మూటలుగానే మిగిలాయి. ఉద్యోగాల కల్పన కోసం బీజేపీ సర్కారు ఏమాత్రం చిత్తశుద్ధిని కనబరచకపోవడం గమనార్హం. ఎంప్లారుమెంట్‌ ఎక్స్ఛేంజీల్లో పట్టభద్రులు తమ పేర్లను నమోదు చేసుకోవడం తప్పనిసరి కాదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి రామేశ్వర్‌ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. చదువు పూర్తయిన తర్వాత పేర్లను నమోదు చేసుకోవడం స్వతంత్రంగానే జరుగుతుందని వివరించారు.
కొలువుల్లేవు...
   నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఎన్నికల సమయంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హడావుడిగా ప్రకటనలు ఇస్తుంది. ఆ తర్వాత మరిచిపోవడం షరామామూలుగా జరుగుతున్నది. రాష్ట్రంలో కొలువుల ఊసేలేదు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన పోస్టులు 4,91,304 ఉన్నాయి. అన్ని శాఖల్లోనూ కలిపి 3,00,178 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలో సీఆర్‌ బిశ్వాల్‌ కమిటీ ప్రకటించింది. వాటి భర్తీకి నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.