Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లండి.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 26,2022

మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లండి..

- ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల వేడుకోలు
- ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని ఆవేదన
- ఉక్రెయిన్‌లో పరిస్థితులను 'నవతెలంగాణ'కు వివరించిన విద్యార్థులు
నవతెలంగాణ-హుస్నాబాద్‌
'ఉక్రెయిన్‌లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మాకు భయంగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి పంపించే ఏర్పాట్లు చేయండి' అని అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తగరం మనాలి, జనగాని విశాల్‌ కిరణ్‌ 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. మనాలి.. ఉక్రెయిన్‌లోని జఫ్రోజియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. విశాల్‌ కిరణ్‌.. అదే కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌర విమానాశ్రయాలను మూసివేశారు. భారత్‌కు వచ్చేందుకు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పిల్లలు తిరిగి వస్తున్నారని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు విమానాలు రద్దు కావడంతో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
   మనాలితోపాటు సికింద్రాబాద్‌కు చెందిన ఎర్రంశెట్టి నాగస్నిగ్ధ, కాకినాడకు చెందిన కామాడి లక్ష్మీకీర్తన, హైదరాబాద్‌కు చెందిన బంగారి ఐశ్వర్య, అమలాపురానికి చెందిన సలాడి గంగాభవాని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు వారి ఆవేదనను నవతెలంగాణతో పంచుకున్నారు. పరిస్థితి అంతా బాగానే ఉందని అనుకున్నామని, ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనడంతో 24 గంటల్లో పరిస్థితి మారిపోవడంతో ఇప్పుడు మాకు టెన్షన్‌ మొదలైందని చెప్పారు. గురువారం వరకు ఇంటర్నెట్‌ పనిచేసిందని, శుక్రవారం ఉదయం నుంచి నెట్‌ కూడా రావడం లేదన్నారు. తమ స్నేహితులు కొందరు రేపు, ఎల్లుండి ఇండియా వెళ్లిపోదామని టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారనీ, కానీ విమానాశ్రయాలు మూతపడటంతో భయం భయంగా ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండండి అంటూ తాము చదువుతున్న యూనివర్సిటీ నుంచి మేసేజ్‌ వచ్చిందని చెప్పారు. దాంతో తాము ఎక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించడం లేదన్నారు. మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని, అయితే ఇక్కడున్న పరిస్థితిని వాళ్లు టీవీల్లో చూసి కంగారు పడిపోతున్నారని ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌ టీఎస్‌) ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో మాట్లాడేందుకు ఒక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినా, తెలంగాణ నుంచి ఆ ప్రయత్నం జరగలేదని వాపోయారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించడానికి ఏపీ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నియమించింది. నోడల్‌ అధికారిగా రవి శంకర్‌ ఫోన్‌ నంబర్‌ 9871999055 (ఏపీ భవన్‌), అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ గీతేశ్‌ శర్మ (సంప్రదించాల్సిన నంబర్‌ 7531904820)లకు బాధ్యతలు అప్పగించింది.
పరిస్థితి ఎలా ఉంటుందో?
   తాము వచ్చేద్దామని అనుకున్నా కూడా విమాన ఛార్జీలు అధికంగా ఉండటంతో రాలేకపోయామని విద్యార్థులు చెబుతున్నారు. ధరలు తగ్గుతాయని, ఉద్రిక్తతలు కూడా అదుపులోకి వస్తాయని భావించినా, అంతా రివర్స్‌ అయిపోయిందంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఎంతైనా పెట్టి వచ్చేద్దామని అనుకునేవారు కూడా రాలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. సాధారణ సమయంలో ఉక్రెయిన్‌ నుంచి విమాన ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడికి రూ. 30,000 నుంచి రూ. 45,000 వరకు ఉండేవి. ఇప్పడు రూ.లక్షకు చేరిందన్నారు. ఇంటర్నెట్‌ కట్‌ కావడంతో ఆందోళన మొదలైందనీ, ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో రూం వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదని మనాలి తెలిపారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
   ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల యోగక్షేమాలపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అక్కడున్న తమ కూతురును సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హుస్నాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని తగరం మనాలి తల్లిదండ్రులు కవిత, లక్ష్మణ్‌ విన్నవించారు. అలాగే తమ కొడుకు విశాల్‌ కిరణ్‌ శుక్రవారం ఉదయం మాట్లాడారని, తరువాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని అతని తండ్రి తిరుపతి తెలిపారు. అక్కడ కరెంట్‌ లేకపోవడంతో చీకటి గదుల్లో ఉంటున్నామని తమ కొడుకు చెప్పాడన్నారు. మరో నాలుగు నెలల్లో తన కొడుకు ఎంబీబీఎస్‌ చదువు పూర్తవుతుందని, ఇంతలోనే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం బాధగా ఉందన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.