Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈసారైనా యాంత్రీకరణకు నిధులొచ్చేనా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2022

ఈసారైనా యాంత్రీకరణకు నిధులొచ్చేనా?

- ప్రయివేటు యంత్రాలతో రైతులపై భారం
- అందుబాటులోలేని పనిముట్లు
- సబ్సిడీలు ఎత్తేసి రైతు బంధుసేవలో సర్కారు
- సాగు పద్దతుల్లో మార్పులు
- సూక్ష్మసేద్యానికి నిధులేవు
- బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న రైతాంగం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రానున్న బడ్జెట్‌పై అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. సాగుకు సహకరించే యంత్రాలు, పనిముట్లకు నిధులొస్తాయని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రెండేండ్లు మినహా (2018-19 రూ 63 కోట్లు, 2019-20 రూ 30.43 కోట్లు) మిగతా సంవత్సరాల్లో యంత్రీకరణ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు జీరో. బడ్జెట్‌లో చూపిన నిధులు కూడా ఖర్చు చేయలేదు. కాబట్టి వచ్చే బడ్జెట్‌లో యంత్రీకరణకు నిధులు కేటాయిస్తే, సబ్సిడీ రూపంలో చిన్నచిన్న పనిముట్లు కొనుగోలు చేయొచ్చు అనే భావనలో రైతులు ఉన్నారు. పంటల్లో వస్తున్న మార్పులు, సాగు పద్దతుల్లో నెలకొన్న పరిస్థితులను తట్టుకోవాలంటే, వ్యవసాయంలో తప్పనిసరిగా యంత్రాల వాడకం కీలకంగా మారింది. రైతు శ్రమను తగ్గించడంతోపాటు అధిక దిగుబడి పెంచాల్సి వున్నది. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ కూడా ఇవి ఎంతో ఉపకరిస్తాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యంత్రీకరణపై దృష్టి సారించటంలేదు.వ్యవసాయ శాఖలో ఉన్న మెకనైజేషన్‌ విభాగానికి నిధుల్లేక వారంత ఇతరత్రా పనుల్లో నిమగమవుతున్నారు.
అన్నదాతకు కష్టాలే...
   వ్యవసాయం చేయడానికే రైతు జంకుతున్నారు. ప్రకృతివైపరీత్యాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. ఎరువులు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పండిన పంటకు మద్దతు ధర అందదు. ఒకవైపు కూలీల కొరత వెంటాడుతున్నది. మరోవైపు యంత్రాలతో సాగు చేయాలంటే, వాటి అద్దె తడిసిమోపడవుతున్నది. వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న భారీ యంత్రాలు ప్రయివేటు సంస్థలే రూపొందిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వరకు ఒక యంత్రాన్ని కూడా కనుగోలేదు. యూనిర్సిటీ పరిశోధనలను ప్రోత్సహించడంలోనూ ప్రభుత్వం వైఫల్యమైంది. సాగులో పెద్ద పెద్ద యంత్రాలు ఎంత ముఖ్యమో, చిన్న, చిన్న పని ముట్టు అంతే అవసరం. సన్న, చిన్నకారు రైతులకు పెద్ద యంత్రాలతో పనిలేదు. కానీ చిన్న పనిముట్లు చాలా అవసరమవుతాయి. వాటికి కూడా ప్రభుత్వం సబ్సిడీలో ఇవ్వడం లేదు. ట్రాక్టర్ల కిరాయి కూడా బాగా పెరిగిపోయింది. రైతు బంధు ఇస్తున్నామనే పేరుతో ఇతర సబ్సిడీలను ఎత్తేసింది. దీంతో రైతులు అప్పులు చేసి ప్రయివేటులో కొనుగోలు చేయాల్సి వస్తున్నది.
రైతులే మారుతున్నారు
   యంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో రైతులు విసిగిపోతున్నారు. ప్రభుత్వం మారకపోయినా, రైతులు మారుతున్నారు. వరినాటే యంత్రాల అద్దెలు పెరిగిపోవడంతో వరి విత్తనాలు వెదజల్లే పరిస్థితులు వస్తున్నాయి. నారుమాడులు నుంచి వరి కోసి, తూర్పార పట్టే వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని ప్రభుత్వం సమకూర్చడంలేదు. వరిసాగులో యంత్రాలు రావడంతో ఆ పంట సాగువైెపే రైతులు మొగ్గు చూపుతున్నారు. మిగతా పంటల్లో యంత్రీకరణ రాకపోవడంతో వాటిపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ శ్రమతో కూడిన వేరుశనగ, పెసర్లు, మినుము పంటల్లో యంత్రాలు లేకపోవడంతో అవి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రోత్సహమూ లేదు...పరిశోధóనలు లేవు
   పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంట దిగుబడి సాధించడానికి యంత్రీకరణ ముఖ్యమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం లేదు. పరిశోధనలకు కూడా సరైన నిధులు కేటాయించడం లేదు. అన్ని చోట్ల పెద్ద యంత్రాలే పని చేయవు. కూరగాయలు, పండ్ల తోటలకు చిన్న, చిన్న యంత్రాలు మేలు చేస్తాయి. సన్న, చిన్నకారు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయి. కూరగాయల సాగుకు సూక్ష్మసేద్యం(డ్రిప్‌ఇరిగేషన్‌) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వేలాది మంది రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకూ, పలుకూలేదు.
యంత్రీకరణతోనే దిగుబడి పెరుగుతున్నది
ఎల్‌ జలపతిరావు వ్యవసాయ శాస్త్రవేత్త
   సాగును పూర్తిగా అధునీకరించాలి. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు ఉపయోపడే పనిముట్లను సబ్సిడీకి అందించాలి. అర ఎకరా, ఎకరా, రెండెకరాలు ఉన్న రైతును దృష్టిలో పెట్టుకుని పనిముట్లను అందించాల్సి ఉన్నది. కలుపు తీయడానికి, పత్తి ఏరడానికి కూడా యంత్రాలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించడం లేదు. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత దున్నడం సులువైంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయిల్‌పామ్‌ సాగుకు మాత్రమే డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నది. మిగిలిన పంటలను ప్రోత్సహించాలి. అప్పుడే రైతుకు కొంత ఆదాయం పెరుగుతుంది. దిగుబడిలోనూ మార్పు వస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.