Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నదుల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ కృషి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2022

నదుల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ కృషి

- రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు: మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. మిషన్‌ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌గల విశ్వేశ్వరయ్యభవన్‌లో ఆదివారం నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్‌ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి.. ఆయకట్టు పెంచుకున్నామనీ, అలా రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించుకున్నామన్నారు. దీంతో భారీ వర్షాలు పడినా చెరువు కట్టలు తెగిపోలేదనీ, భూగర్భ జలాలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. నాలుగు వేల చెక్‌డ్యామ్‌లను రూ.ఆరు వేల కోట్లతో నిర్మించుకున్నామని వివరించారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి, సంవత్సరం అంతా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్‌ నిరూపించారని చెప్పారు. 141 టీఎంసీల రిజర్వాయర్లను గోదావరి నదిపై నిర్మించుకున్నామనీ, భవిష్యత్‌ తరాల కోసం నదులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు.
రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు
   2014 నుంచి తలసరి ఆదాయం రూ.1,24,104 ఉంటే.. 2021 తలసరి ఆదాయం రూ.2,78,933కు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం రెండింతల వద్ధి నమోదైందని చెప్పారు. 2014లో జీడీపీ రూ.5,500 ఉండగా.. 2021లో జీడీపీ రూ.11,54,000 పెరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందనీ, ఉత్తరప్రదేశ్‌ చివరి స్థానంలో ఉందన్నారు. మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామనీ, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీలెవల్‌ సాగునీటి ప్రాజెక్టు అని తెలిపారు. మూసీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారనీ, కొద్ది రోజుల్లోనే వాటి పనులు మొదలుపెడతారన్నారు. ఆ పనులు పూర్తయ్యాక మూసీ నదిపై వాటర్‌ మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాక్షించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుతో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదనీ, ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌ తాగునీరు కూడా అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వాటర్‌ మ్యాన్‌ రాజేంద్ర సింగ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం : మంత్రి జగదీశ్‌ రెడ్డి
   నదులను నాశనం చేసేది మన మానవ జాతేనని, మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతున్నదని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ నదుల సంరక్షణకు పాటు పడుతున్నారని గుర్తు చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా నీళ్ల గురించే మాట్లాడుతున్నాం. నీళ్లను వస్తువుగా, నీళ్లను సెంటిమెంట్‌గా చూస్తున్నాం. నీళ్లే ప్రాణం. నీళ్లు లేనిదే ప్రాణి లేదని వ్యాఖ్యానించారు. మూసీ నది ఒడ్డున మనం ఉన్నాం కానీ, మూసీ నది ఆనవాళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మురుగు నీరు తాగిన ఏకైక పట్టణం సూర్యాపేట. సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కార్యక్రమంతో మాకు ఆ బాధలు పోయాయన్నారు. మల్లన్న సాగర్‌ నిర్మాణంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందనీ, నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌తో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందిస్తున్నామన్నారు. సీఎం కషితో వలసలు ఆగిపోయాయనీ, అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్కటే మాట చెప్పారు. వానలు వాపసు రావాలి. కోతులు అడవులకు పోవాలి. ఈ వానలు వాపసు తెచ్చుకోవాలి అంటే చెట్లను పెంచుకోవాలి. రాష్ట్రంలో ఏ రహదారిలో పోయిన పచ్చని చెట్లు ఇరువైపులా కనిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల సంస్థ అధ్యక్షులు వి. ప్రకాశరావు, రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నాయకులు రమణానాయక్‌, రమ , గోపాలరావు, శంకర్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.
హైదరాబాద్‌ డిక్లరేషన్‌
   నదులను ఆక్రమణలు, కాలుష్యం, ఇసుక, నీటి దొంగతనం నుంచి కాపాడాలంటూ నదులపై జాతీయ సదస్సు ముగింపులో ఒక డిక్లరేషన్‌ రూపొందించారు. ఈమేరకు వాటర్‌ మ్యాన్‌ రాజేంద్రసింగ్‌, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి. ప్రకాశరావు, ఇండియన్‌ హిమాలయన్‌ రివర్‌ బేసీన్‌ చైర్మెన్‌ ఇందిరా ఖురానా, వాటర్‌ ఫైటర్స్‌ బొలిశెట్టి సత్యనారాయణ, వినోద్‌ బోదంకర్‌, రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి డిక్లరేషన్‌ విడుదల చేశారు. రాష్ట్ర జలవనరుల సంస్థ ఆద్వర్యంలో పలు స్వచ్చంధ సంస్థలు, వ్యక్తులకు వాటర్‌ అవార్డులను అందజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.