Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళితుల భూముల్లో.. బోర్లు వేసేదెన్నడు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 01,2022

దళితుల భూముల్లో.. బోర్లు వేసేదెన్నడు?

- భూమి కొనుగోలు పథకం లబ్దిదారుల ఎదురుచూపులు
- ఎంపిక చేసిందే అరకొర.. నేటికీ పూర్తికాని అమలు
- 2017 నుంచి స్కీం పూర్తిగా ఎత్తివేత
- మంజూరైన బోర్ల డ్రిల్‌కు ముందుకు రాని బోర్‌ యజమానులు
- ప్రభుత్వం రేటు పెంచాలని డిమాండ్‌
- నిజామాబాద్‌ నుంచి వస్తే గతంలో అడ్డగింత?
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
భూమి కొనుగోలు పథకం కింద సాగుభూమిలో బోర్లు వేసుకుని పంటలు పండించుకుందామనుకుంటున్న పేదల ఆశ కలగానే మిగులుతోంది. బోర్లు వేసేందుకు గతంలో నిర్ణయించిన ధర అనుకూలంగా లేదని కామారెడ్డి జిల్లాలోని బోరు యజమానులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ధర పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఒకరిద్దరు బోర్లు వేసేందుకు ముందుకొచ్చినా.. 'నిజామాబాద్‌ జిల్లా వారితో ఇక్కడ ఎలా వేయనిస్తారు' అంటూ అడ్డుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర సర్కారు రేటు పెంచడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఈ పథకాన్ని అటకెక్కించడంతో గతంలో మంజూరయిన వాటికీ మోక్షం కలగడం లేదు. దాంతో ముందు గొయ్యి వెనక నుయ్యిలా తయారయింది కామారెడ్డి జిల్లాలోని ఎస్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమితో పాటు పంట భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఈ స్కీం కింద కామారెడ్డి జిల్లాలో 2014-2021 మధ్య కాలంలో 528 మందికి 1206 ఎకరాలు పంపిణీ చేసింది. జిల్లాలో ఎస్సీల జనాభాతో పోల్చితే నామమాత్రంగానే ఈ పథకం అమలయ్యింది. అయితే కొనుగోలు చేసిన భూములకు నీటి సౌకర్యం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో మొత్తం 367 మందికి భూమి దక్కగా.. 287 మందికి చెందిన 657.10 ఎకరాల భూమికి నీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం 136 బోరువెల్స్‌ మంజూరు చేసింది. ఇందులోనూ కేవలం 83 బోర్‌వెల్స్‌ మాత్రమే వేశారు. ఓ 20 బోర్‌వెల్స్‌ వేయటానికి భూగర్భ జల శాఖకు సర్కారు అప్పగించింది. అయితే 42 చోట్ల బోరు వాహనాలు వెళ్లేందుకు అనువుగా లేవని నిర్ణయించారు. 2017 నుంచి ఈ స్కీంను సర్కారు ఎత్తేసింది. 2017-18 నుంచి 2020-21 వరకు 161 మందికి 335 ఎకరాల భూమి పంపిణీ చేసింది. కానీ నీటి పారుదల సౌకర్యం కల్పించే స్కీం అమలు చేయడం లేదు.
నాలుగేండ్లుగా పెండింగ్‌...
   కామారెడ్డి జిల్లా భూగర్భ శాఖ వద్ద ప్రస్తుతం సుమారు 20 బోర్లు వేయించే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ బోర్లు వేయించేందుకు ఇప్పటికే పలుమార్లు బోరు యజమానులు భూగర్భశాఖ ఏడీ సతీష్‌యాదవ్‌ పలుమార్లు చర్చలు జరిపారు. కానీ బోరు యజమానులు ముందుకు రావడం లేదు. 2018లో సర్కారు నిర్ణయించిన ధర వల్ల తమకు గిట్టుబాటు కాదని అంటున్నారు. నాటితో పొల్చితే డీజిల్‌ ధరలు పెరిగాయని చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు బోర్లు వేసినందుకు రూ.350 ఫీట్‌ చొప్పున ధర ఖరారు చేసింది. 2018 నుంచి ఇదే ధరకు నిజామాబాద్‌కు చెందిన కొంతమంది బోరు యజమానులు ఎస్సీల భూముల్లో బోర్లు వేశారు. ఆ ధరకు ఆరు నెలల కిందట వరకు బోర్లు వేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ కామారెడ్డికి చెందిన బోరు యజమానులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కామారెడ్డి జిల్లాకు చెందిన భూముల్లో ఆ జిల్లా వారు ఎలా వేస్తారని అడ్డుకున్నట్టు సమాచారం. దాంతో ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లావారు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ధరలు పెంచేందుకు సిద్ధంగా లేదు. ఫలితంగా అర్హత పొందిన లబ్దిదారులు తమ భూముల్లో ఎప్పుడు బోర్లు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు. పైగా 2017 వరకు మొత్తం 1183.12 ఎకరాల భూమికి గాను కేవలం 657.10 ఎకరాలను మాత్రమే ఎంపిక చేశారు. మిగిలిన 526 ఎకరాల సాగు భూమి యజమానులు సైతం తమ భూముల్లో బోర్లు ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు. పాత, కొత్త లబ్దిదారులందరి నోట్లో మట్టికొట్టేవిధంగా సర్కారు స్కీం మొత్తం ఎత్తేసింది. ఇక మంజూరయ్యి పెండింగ్‌లో ఉన్న 20 బోర్‌వెల్స్‌ కార్యరూపం దాల్చడం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.