Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేసీఆర్‌ సారూ దండంపెడ్తాం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 01,2022

కేసీఆర్‌ సారూ దండంపెడ్తాం..

- పింఛన్లు వచ్చేలా చూడండి
- 3, 4 ఏండ్లయినా ఇస్తలేరు.. చచ్చినంక ఇస్తరా?
- ప్రజావేదికలో పింఛన్‌ బాధితుల ఆక్రందన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'నాకు 71 ఏండ్లు బిడ్డ. నాకంటే ఏజ్‌బార్‌ తక్కువున్నోళ్లకు పింఛనొస్తుందిగానీ నాకైతే వస్తలేదు. పెద్దపెద్ద మీటింగ్‌లల్ల సార్లను అడిగిన. ఇగొస్తలేదు..అగొస్తలేదు..నేను సచ్చినంక ఇస్తరా? ఇంత పింఛన్‌ వస్తే కడుపునిండ తింట. చారుబొట్టు తాగుత. కేసీఆర్‌ సారుకు జెప్పి జర పింఛన్‌ ఇప్పియండి' అంటూ జనగామ జిల్లాకు చెందిన బండి మల్లయ్య వేడుకోలు
   'నాకు బోదకాలు వ్యాధి ఉంది సార్‌. అవస్త పడుకుంట ఇంటికాడ్నే ఉంటున్న. అప్లికేషన్‌ ఇచ్చొచ్చి రెండేండ్లకుపైనే అయితాంది. రిసీప్టయితే ఇయ్యలే. ఇప్పటిదాకా పింఛనొస్తలేదు. గదొస్తే ఎంతో కొంత 'ఆసరా'అయితదిగదా సార్‌. జర వచ్చేటట్టు చూడండి' - బోదకాలు వ్యాధిగ్రస్తుడు రాజయ్య
   'అందర్కీ నమస్కారం. తాగితాగి లీవర్‌ కరాబై మూడేండ్ల కింద చచ్చిపోయిండు మా ఆయన. గుంట భూమిగిట్ట లేదు. కూలికెళ్తేగానీ గడవదు. మా అత్తనూ నేనే సాదాలి. కార్యదర్శికి దరఖాస్తు పెట్టుకున్నా పింఛన్‌ వస్తలేదు. ఎవర్ని అడిగినా వస్తది..వస్తదంటున్నరుగానీ వస్తలేదు. ఎప్పుడొస్తదో ఏమో?' నల్లగొండ జిల్లాకు చెందిన లలిత ఆవేదన
   'మా ఆయనతో డైవర్స్‌ అయ్యి 11 ఏండ్లవుతున్నది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పింఛన్‌ ఇయ్యట్లేదు. పిల్లలను పట్టుకుని ఇన్నేండ్లు నెట్టుకొంటూ వచ్చిన. నా వేదన ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థంకాక ఈడ్కి వచ్చిన. మా అసోంటి ఒంటరి మహిళలు ఎట్ల బతకాలిసార్‌? నా అసోంటోళ్లు మా ఊర్ల 80 మంది దాకా ఉన్నరు. వాళ్లకీ పింఛన్లు వస్తలేవు. ఇప్పుడైనా కనికరం చూపి పింఛన్‌ ఇయ్యండి కేసీఆర్‌ సారూ' ఇదీ జనగామ జిల్లాకు చెందిన వంగ ప్రేమలత కడుపులోని బాధ.
   హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఆసరా పింఛన్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్‌ ఇయరింగ్‌లో బాధితుల వేడుకోలు..ఆవేదనలు..బాధలు..విన్నపాలు. పెండ్లయి రెండేండ్లు కాకుండానే చనిపోయిన భర్త.. ఓవైపు..చేతిలో ఓ బిడ్డ..అత్తింటి ఆదరణ లేక అర్థంకాని పరిస్థితిలో 21 ఏండ్ల ఒంటరి మహిళ తన గోడును చెబుతుంటే అక్కడున్నోళ్లంతా కంట కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కరేంటి..ఇద్దరేంటి..30 మందికిపైగా తమ గోసలను చెబుతుంటే అయ్యో? ఏమిటీ అన్యాయం అనాల్సిందే. అంతటి బాధలోనూ కేసీఆర్‌ సారూ పింఛన్‌ ఇవ్వండి అడిగినోళ్లేగానీ..తిట్టిపోసినోళ్లతే లేరు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర సర్కారు ఎందుకిలా చేస్తుందో అర్థంకాని పరిస్థితి. 21 సంఘాలతో ఏర్పడిన ఆసరా పింఛన్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పబ్లిక్‌ ఇయరింగ్‌లో 350 మందికిపైగా బాధితులు పాల్గొన్నారు. వారిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, ఎయిడ్స్‌ రోగులు, బోదకాలు బాధితులు, థర్డ్‌ జెండర్స్‌ పింఛన్లకు నోచుకోక తామ పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా రిటైర్డ్‌ ఐఏఏస్‌ అధికారి టి.గోపాల్‌రావు, మానవ హక్కుల వేదిక జాతీయ కన్వీనర్‌ జీవన్‌కుమార్‌, సామాజిక వేత్త ఖలీదా ఫర్వీస్‌, ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పద్మజా షా, మహిళా హక్కుల కార్యకర్త బి.గిరిజ వ్యవహరించారు. పింఛన్ల బాధితులు చెబుతున్న వివరాలను నోట్‌ చేసుకున్నారు. జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యవస్థ, పరిపాలనా విధానం ఎలాగుందో బాధితులు చెబుతున్న మాటల్లోనే అర్థం అవుతున్నదన్నారు. జీవించే హక్కును హరిస్తున్న రాష్ట్ర సర్కారుపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. అధికారులు రాజకీయ నాయకులకు వంత పాడకుండా ప్రజలకు సేవ చేయాలని కోరారు. గోపాల్‌రావు మాట్లాడుతూ..వీళ్లందరి బాధలు విటుంటే ఇలా సమాజంలో ఎందుకున్నాంరయ్యా? అని సిగ్గుతో తల దించుకోవాలని అనిపిస్తోందన్నారు. దరఖాస్తు చేసుకుని నాలుగేండ్లయినా పింఛన్లు మంజూరు కాకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 12 లక్షల పింఛన్లను రాష్ట్ర సర్కారు తగ్గించిందని విమర్శించారు. ఉప ఎన్నికలుంటే పింఛన్లు మంజూరు చేస్తరా? ఇదేం అన్యాయం? ఎన్నికలు వచ్చేదాకా ఎదురుచూడాలా? అని ప్రశ్నించారు.
   ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్యవేదిక కార్యదర్శి కన్నెగంటి రవి, నాయకులు విస్సాకిరణ్‌, కొండల్‌రెడ్డి, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, అంబటి నాగయ్య(తెలంగాణ విద్యావంతుల వేదిక), వ్యవసాయ కార్మిక సంఘం నేత బి.పద్మ, ఆయా సంఘాల నేతలు మంజూల, వెంకటయ్య, ఆశాలత, రేమిన్‌, వసంతలక్ష్మి, మీరా, ప్రవీణ్‌, వివిరావు, దీప్తి, శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.