Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొనుగోళ్లు ఎప్పుడో? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 01,2022

కొనుగోళ్లు ఎప్పుడో?

- కోతలు పూర్తయిన శనగ పంట
- మార్కెట్‌లో ఎదురుచూపులు
- గతేడాది ఆలస్యంతోనే నష్టపోయిన అన్నదాతలు
- త్వరగా ప్రారంభించాలని రైతు సంఘం నేతల వినతి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రబీ సీజన్‌లో పండించిన శనగ పైరు కోతలు పూర్తవుతున్నాయి. దాదాపు 30శాతం పంట అన్నదాతల ఇంటికొచ్చింది. ఈ నేపథ్యంలో పంటను విక్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. కానీ, మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. గతేదాడి కూడా ఇలాగే కొనుగోళ్లు ఆలస్యమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత్యంతరం లేక తక్కువ ధరకే ప్రయివేటులో విక్రయించారు. అలాంటి పరిస్థితి ఈ ఏడాదీ పునరావృతం కాకుండా మార్కెట్‌లో కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు. ఇప్పటికే పత్తి, సోయా తదితర పంటల దిగుబడులు భారీగా తగ్గిపోవడంతో రైతులు కుదేలయ్యారు. కనీసం రబీలో పండించిన శనగ పంటైనా కొంత చేదోడుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల ప్రతినిధులు మార్కెట్‌లో శనగ కొనుగోళ్లు ప్రారంభించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందించారు.
   ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ రబీ సీజన్‌లో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో శనగ పండించారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 85 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 6.25 లక్షల క్వింటాళ్ల శనగ పంట దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే సుమారు 30 శాతం పంట కోతలు పూర్తికావడంతో రైతులు ఇండ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వారం రోజుల్లో కోతలు పూర్తవుతాయి. కొందరు రైతులు ఇండ్లలో స్థలం లేక.. మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో పంటను పొలాల్లోనే పెట్టి రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం శనగకు క్వింటాల్‌కు రూ.5,230 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోళ్లు ప్రారంభించారు. పత్తి, సోయా వంటి పంటల దిగుబడులు చాలా వరకు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్‌లో పత్తికి మంచి ధర పలికినా ఆశించిన మేర పంట దిగుబడి రాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను రబీలో వేసిన శనగ పంటైనా గట్టెక్కిస్తుందనే ఆశతో ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్దతు ధరకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
గతేడాది ఆలస్యంతో నష్టం!
   గతేడాది రబీ సీజన్‌లో శనగ పంటను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఆలస్యంగా కొనుగోలు చేసింది. జిల్లాలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5100గా నిర్ణయించింది. కానీ మార్కెట్‌లో దాదాపు నెల రోజులు కొనుగోళ్ల జాప్యం కారణంగా చాలా మంది ప్రయివేటు వ్యాపారులకు చాలా తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది. మధ్య దళారులకు విక్రయించడంతో ధర నష్టంతో పాటు తరుగు, తేమ పేరిట కోతలు విధించారు. మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అప్పట్లో రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. రైతులు రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఈ ఏడాదీ అలాంటి పరిస్థితి రాకూడదని రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు.
త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలి
   రబీ సీజన్‌లో పండించిన శనగ పంటను ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలి. ఇప్పటికే చాలా వరకు కోతలు పూర్తయి పంట రైతుల ఇండ్లకు చేరింది. మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. గతేడాది కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తక్కువ ధరకు ప్రయివేటులో విక్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రానీయకుండా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోళ్లను ప్రారంభించాలి.
బండి దత్తాత్రి రైతు సంఘం నాయకుడు
వారం రోజుల్లో ప్రారంభిస్తాం
   శనగ పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గతేడాది తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది సైతం వాటి ద్వారానే కొనుగోలు చేయాలని భావిస్తున్నాం. ఇంకా శనగ పంట కోతలు పూర్తి కాలేదు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
మార్క్‌ఫెడ్‌ జీఎం పుల్లయ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.