Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రోత్సాహకం ఉత్తిమాటే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 02,2022

ప్రోత్సాహకం ఉత్తిమాటే..

- మాట తప్పిన సర్కారు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 135 పంచాయతీలు ఏకగ్రీవం
- అందాల్సిన ప్రోత్సాహక నిధులు రూ.25 కోట్లు
- నిధులపై ఆశ వద్దంటున్న పంచాయతీ అధికారులు
- ఉసూరుమంటున్న గ్రామ సర్పంచ్‌లు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌కు వెళ్లకుండా ప్రజలంతా ఐక్యతను చాటుతూ ఏకగ్రీవంగా సర్పంచ్‌ అభ్యర్థిని ఎన్నుకున్న పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తింది. ఇదే ఆంశంపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10లక్షలు ఇస్తామని మీమేమీ చెప్పలేదని మంత్రి కేటీఆర్‌ వాదించారు. ఇటీవల పంచాయతీ అధికారులకు సైతం సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహకాలాంటివీ ఏమీ లేవు.. ఇకపై అలాంటి ఆశలు పెట్టుకోవద్దని పంచాయతీ అధికారులు తెగేసి చెప్పారు. దాంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల ఆశలపై నీళ్లు చల్లినట్లైయింది. పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు వస్తాయన్న ఆశతో ఎదురుచుస్తున్న గ్రామస్తులకు విషయం తెలవడంతో ఉసూరుమంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1187 పంచాయతీలకు గాను 2019 ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 135 మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వికారాబాద్‌లో 566 పంచాయతీలకు గాను 75, రంగారెడ్డిలో 560 పంచాయతీలకు 53, మేడ్చల్‌లో 61 పంచాయతీలకు 07 మాత్రమే ఏకగ్రీవమైనట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఓటింగ్‌ ఖర్చు తగ్గుతుందన్నారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులు వస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చనే ఆశతో అనేక పంచాయతీల్లో గ్రామస్తులు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో పోటీపడి ఘర్షణ వాతావరణం తలెత్తడం లాంటివి ఎందుకని భావించిన గ్రామస్తులు మంచి వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా చేసుకుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. అంతా కలిసి ఏకగ్రీవ సర్పంచులను ఎన్నుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు అదనంగా ప్రభుత్వం రూ.10లక్షలు అందజేస్తుంది. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకం, దీనికి అదనంగా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడించారు.
రూ.25 కోట్లు ఇవ్వనట్టే
ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన 135 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రభుత్వం రూ. 10లక్షలు, మరో రూ.5 లక్షలు స్థానిక ఎమ్మెల్యేల నిధుల నుంచి ఇస్తామని ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలా జిల్లాకు రూ.25కోట్ల నిధులు రావాల్సి ఉంది. కానీ ఎన్నికలు జరిగి మూడేండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ నిధులు రాలేదు. పైగా ఇకపై ఆ నిధులపై ఆశలు పెట్టుకోవద్దని, ఇటు పంచాయతీ అధికారులు.. అటు ప్రజాప్రతినిధులు తెగేసి చెబుతుండటంతో సర్పంచ్‌లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలకిచ్చిన మాటలు ఎట్లా నిలబెట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించలేక ప్రజల్లో తిరగలేకపోతున్నామని చెబుతున్నారు. కనీసం ఎమ్మెల్యే నిధుల నుంచి ఇస్తానన్న రూ. 5 లక్షల నిధులు కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఇవ్వడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ నిధులపై ఆశలొద్దు - శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో 53 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకోవడం జరిగింది. ఈ పంచాయతీలకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆ నిధులపై సర్పంచ్‌లు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.