Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర

- చంపితే 15 కోట్లు ఇస్తామని ఆఫర్‌
- ఛేదించిన పోలీసులు..
- ఎనిమిది మంది అరెస్టు : సైబరాబాద్‌ సీపీ
స్టీఫెన్‌ రవీంద్ర
- లోతైన విచారణ జరిపి హత్య వెనుక ఎవరున్నారో తేలుస్తాం
- మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాత్రపైనా విచారిస్తున్నామని వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్‌(గచ్చిబౌలి)
తెలంగాణ రాష్ట్ర ఎక్సయిజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌ను సుఫారి గ్యాంగ్‌తో హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం రాత్రి సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. 'ఫిబ్రవరి 23న ఫరూక్‌, హైదర్‌ అలీ సుచిత్ర వద్ద ఒక లాడ్జిలో ఉన్నారు. 25న ఇద్దరు బయటకు టీ తాగేందుకు వెళ్లినప్పుడు నాగరాజు, కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని వెంబడించి చంపడానికి ప్రయత్నించారు. తర్వాత ఫరూక్‌, హైదర్‌ అలీ తప్పించుకున్నారు. 5 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్‌బషీర్‌బాద్‌ పోలీసులు సెక్షన్‌ 307, 120బీ, 115 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 25 ఏబీ ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేశాం. ఈ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ అనే ముగ్గురు మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చి కొంపల్లి ఏరియాలోని సుచిత్రలో వీరిని వెంబడించి దాడికి చేసేందుకు యత్నించారు. ఇద్దరు తప్పించుకున్న తర్వాత ముగ్గురు అదే ప్రాంతంలో కొన్ని లాడ్జీల్లో వెతికారు. వీరిని 26న అరెస్ట్‌ చేశాం. 27న జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచాం. నాగరాజు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో కొన్ని విషయాలు చెప్పాడు. రాఘవేంద్ర రాజు, కొందరితో కలిసి హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. ఆ తర్వాత విచారణ జరుపగా రాఘవేందర్‌ రాజు, మున్నూర్‌ రవి, మధుసూదన్‌ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసింది.
అయితే, వీరికి గురించి సమాచారం లేదని.. వారి సెల్‌ఫోన్‌ సిగల్స్‌ ఆధారంగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్‌లో ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. ఈ సందర్భంగా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. రాఘవేందర్‌ రాజు, రవి, మధుసూదన్‌, అమరేందర్‌ కలిసి మహబూబ్‌నగర్‌ నుంచి వైజాగ్‌ వెళ్లి.. అక్కడి ఢిల్లీకి వెళ్లి షెల్టర్‌ తీసుకున్నారు. వీరికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌, పీఏ రాజు ఇచ్చారని విచారణలో తేలింది. వీళ్లందరిని సర్వెంట్‌ క్వార్టర్స్‌లో నోటీసులు ఇచ్చి.. అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. వారిని ప్రశ్నించగా.. కుట్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలను రికవరీ చేశాం. రాఘవేందర్‌ రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్‌.. దుండిగల్‌ ఫారెస్ట్‌ ఏరియాలో 6 రౌండ్స్‌ రివాల్వర్‌ రాజు నుంచి రికవరీ చేసి.. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించాం.'
రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా.. రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్టు తేలింది. కేసు వివరాల్లోకి వెళితే.. రాఘవేందర్‌ రాజు మొదటి ఫరూక్‌ను కలిశాడు. ఫరూక్‌ కూడా నేర చరిత్ర ఉన్నది. మంత్రిని హత్య చేయాలని.. నువ్వు చేసినా సరే.. వేరే ఎవరినా కలిపిస్తే వారితో చేయిస్తామని ప్రణాళిక వేశారు. హత్య కోసం రూ.15కోట్ల వరకు సుపారీ ఇవ్వచూపారు. హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశాం. కుట్రలో రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, అమరేందర్‌ రాజు, మధుసూదన్‌, షెల్టర్‌ ఇచ్చిన వ్యక్తితో మరో ముగ్గురు భాగస్వాములైనట్టు విచారణలో తెలిసింది. హత్య కేసుకు ప్రధాన సూత్రధారులు మధుసూదన్‌, అమరేందర్‌రాజు అని, హత్య కోసం రూ.15కోట్లు సుపారీ ఇవ్వజూపారు. నిందితులను రిమాండ్‌కు తరలించాం. పోలీసు కస్టడీలోకి నిందితులను తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం' అని వివరించారు.
కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జితేందర్‌రెడ్డి.. పీఏ రాజు, డ్రైవర్‌ థాప, సౌత్‌ అవెన్యూలోనే షెల్టర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. ఆయుధాలను రాజు యూపీ నుంచి కొనుగోలు చేసినట్ల్టుతెలిసిందని, పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై.. నాగరాజు అరెస్టయిన తర్వాత హత్య కేసు, నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.