Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచాన్ని చైతన్యం చేసింది కమ్యూనిస్టు మ్యానిఫెస్టోనే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

ప్రపంచాన్ని చైతన్యం చేసింది కమ్యూనిస్టు మ్యానిఫెస్టోనే..

- కారల్‌మార్క్స్‌ పుస్తకాలతోనే మూడోవంతు దేశాల్లో విప్లవం
- ప్రజల జ్ఞాన సముపార్జనకు పుస్తకాలే దోహదం : బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌
- కరీంనగర్‌ పుస్తక ప్రదర్శన ప్రారంభం
- 50స్టాళ్లలో సుమారు 20వేల పుస్తకాలు
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
'కమ్యూనిస్టు మ్యానిఫెస్టోనే ప్రపంచాన్ని చైతన్యం చేసింది. కారల్‌మార్క్స్‌ రాసిన పుస్తకాలే మొత్తం భూభాగంలోని మూడోవంతు దేశాల్లో జెండాలు పాతి విప్లవాన్ని తీసుకొచ్చేలా చేశాయి. ప్రజలను ప్రభావితం చేసే అటువంటి శక్తి పుస్తకాలకు మాత్రమే ఉంటుంది' అని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రజల జ్ఞాన సముపార్జనకు పుస్తకాలే దోహదం చేస్తాయని, గొప్పగొప్ప వాళ్లు అందించిన సాహిత్యం, ఇతర రచనలే భవిష్యత్‌ తరాలకు దిక్సూచిగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే మైదానంలో వారం రోజులపాటు సాగే పుస్తక ప్రదర్శనను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ప్రముఖ కవి, రచియిత సినారే, అలిశెట్టి ప్రభాకర్‌ మొదలుకుని 14భాషల్లో సాహిత్యాన్ని ఆయా భాషాల్లోకి తర్జుమా చేసిన నలిమెల భాస్కర్‌, సంస్కత పండితుడిగా పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి వరకు ఈ జిల్లాకు చెందిన వాస్తవ్యులు కావడం గర్వకారణమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పుస్తక ప్రియుడని, ఆయన ఎన్నోవేల పుస్తకాలు చదివి అంత జ్ఞానాన్ని సమకూర్చుకున్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యత, ఈ ప్రాంతం ఎలా అన్యాయానికి గురవుతుందో ప్రస్తావిస్తూ ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాసిన పుస్తకాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి 50 స్టాళ్లలో ఏర్పాటు చేసిన 20 వేల పుస్తకాల్లో నచ్చిన పుస్తకం కొనుగోలు చేయాలని సూచించారు.
పుస్తకాలతోనే ఇంట్లో వెలుగులు
పుస్తకాలతోనే ఇంటికి వెలుగులు వస్తాయని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. పిల్లలకు పుస్తకాలు కొనిచ్చి చదవడం అలవాటు చేయాలని సూచించారు. దీనివల్ల పిల్లలు విజ్ఞానం పెంపొందించుకుంటారన్నారు. చదువుతోనే మహిళల్లో చైతన్యం పెరుగుతుందన్న విషయాలను పలు ఉదాహరణలతో వివరించారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి.కర్ణన్‌ పుస్తకప్రియుడని, ఆయన ప్రోత్సాహం వల్లే ఇక్కడ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌ అన్నారు. ఈనెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో 'మన ఊరు -మన చెట్లు' అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కలెక్టర్‌ ఆర్‌వి.కర్ణన్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో భాగంగా మహిళల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి జరిగే మహిళల కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన స్వాగత నృత్యం అలరించింది. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం 'అమ్మా నాన్న ప్రేమ'పై రాసిన పాట ఆకట్టుకుంది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, మేయర్‌ సునీల్‌ రావు, సుడా చైర్మెన్‌ జీవి రామకృష్ణరావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డీఆర్‌డీవో శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జువేరియా, జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రావు, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌, కార్పొరేటర్లు, సాహితీవేత్తలు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.