Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 06,2022

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయరంగం

- ప్రత్యేక చట్టం లేక కల్తీ విత్తనాలతో నష్టం
- అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం 'వ్యవసాయరంగం-సవాళ్లు' అంశంపై ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్‌లో సారంపల్లి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నేడు వ్యవసాయ రంగం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు. రాష్ట్రంలో అవసరాలకు అనుగుణంగా పంటలను వేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 11 లక్షలు టన్నుల కూరగాయలతో పాటు వంటనూనెలు, పంచదార, సుగంధ ద్రవ్యాలు కూడా దిగుమతి అవుతున్నాయన్నారు. విత్తనోత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి మంచి ఆదాయం అందుతుందని, ప్రపంచంలో చాలా దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు ప్రత్యేక చట్టం లేకపోవడంతో కల్తీ విత్తనాలు రాష్ట్ర రైతాంగాన్ని నష్ట పరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో నాణ్యతలేని విత్తనాలతో, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం 12 లక్షల 65 వేల ఎకరాల్లో నష్టం జరిగితే, ఈ ఏడాది వానాకాలంలో 8 లక్షల 75 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. తామర, గులాబీ తెగుళ్లతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని 14, 15 ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన నిధులను ఖర్చు చేయటం లేదని అన్నారు. పాసు పుస్తకాల్లో లోపాల వల్ల ఇంకా 12 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు రైతుబంధు అందడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పంటల బీమా అనేది 18 నుంచి 59 ఏండ్ల మధ్య ఉన్న వారికే ఇస్తున్నారన్నారు. కానీ, 75 ఏండ్లు దాటినా రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నారని, వాళ్లకీ బీమా వర్తింపజేయాలని కోరారు. వ్యవసాయ రుణాలు మాఫీ కాక.. రైతులకు కొత్త రుణాలు లభించడం లేదని అన్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ముఖ్యంగా కౌలు రైతును ప్రభుత్వం గుర్తించకపోవడ ంతో దారుణమన్నారు. విస్తతస్థాయి సమావేశాల ప్రారంభ సూచికగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెసర కాయల జంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, మూడ్‌ శోభన్‌, మాదినేని రమేష్‌, బండ శ్రీశైలం, నక్కల యాదవరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, నున్న నాగేశ్వరరావు, కున్సోత్‌ ధర్మా, కుమారస్వామి, బాల్‌రెడ్డి, ఎం.శ్రీనివాసులు, మంగ నరసింహా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రి శ్రీరాములు, దండ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.