Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పద్దు.. ఈసారైనా హద్దుల్లో ఉంటుందా...? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 06,2022

పద్దు.. ఈసారైనా హద్దుల్లో ఉంటుందా...?

- మళ్లీ డాంబికాలకు పోతారా...?
- రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి
- మొత్తం కేటాయింపులు రూ.2.50 లక్షల కోట్లకు పైనే అంటూ ప్రచారం
- అందరి చూపు బడ్జెట్‌ వైపే

బి.వి.యన్‌.పద్మరాజు
        తెలంగాణ వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ (2014-15) రూ.1,02,172 కోట్లు. ఆ యేడాది వాస్తవ ఖర్చు రూ.62,786 కోట్లు. అప్పటి నుంచి అన్ని బడ్జెట్లదీ అదే పరిస్థితి. అంచనాలు ఘనంగా వేసుకుంటూ పోవటం, ఖర్చు మాత్రం తక్కువగా ఉండటం కేసీఆర్‌ సర్కారుకు షరా మామూలుగా మారింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో సైతం ఆదాయ అంచనాలు రూ.1,46,492 కోట్లుగా వేసుకుంటే, వాస్తవ ఆదాయం మాత్రం రూ.1,32,509 కోట్లే. ఈ రకంగా చూసినప్పుడు గత ఏడు బడ్జెట్లలో టీఆర్‌ఎస్‌ సర్కారు... నేల విడిచి సాము చేసినట్టుగా కనబడుతున్నది. ఈ క్రమంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ప్రవేశపెట్టబోయే పద్దుకు సంబంధించైనా... రాష్ట్ర ప్రభుత్వం హద్దు మీరకుండా ఉంటుందా..? లేదా తన అలవాటు ప్రకారం డాంబికాలకు పోయి బడాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందా..? అనేది చూడాలి. అయితే సర్కారు పెద్దలు ఇచ్చిన లీకుల ప్రకారం... ఈసారి కూడా బడ్జెట్‌లో గణాంకాలను ఘనంగా చూపించబోతున్నారని సమాచారం. మొత్తం పద్దు రూ.2.50 లక్షల కోట్లకు పైబడే ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. అయితే ఏయే రంగాలకు ఈసారి ప్రాధాన్యతనివ్వబోతున్నారనే దానిపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి.
        గతేడాది వివిధ రాజకీయ కారణాలు, ఉప ఎన్నికల రీత్యా ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకానికి లబ్దిదారుల ఎంపికలో అధికార పార్టీ జోక్యం పెరిగిపోవటంతో అర్హులకు న్యాయం జరగటం లేదనే వాదన వినపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయటానికి వీలుగా చాలినన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. మరోవైపు నిధుల విడుదల అనేది ఒకేచోట కేంద్రీకృతమైందన్న భావన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో పారదర్శకంగా పాలన సాగేందుకు, క్షేత్రస్థాయిలో అసలైన లబ్దిదారులకు ఫలాలు అందేందుకు వీలుగా 'ఫండ్‌ రిలీజ్‌' అనే ప్రక్రియను వికేంద్రీకరణ చేయాలనే వాదన వినబడుతున్నది. ఇదే సమయంలో హాస్టళ్ల మెస్‌ బిల్లుల నుంచి కాంట్రాక్టర్ల చెల్లింపుల వరకూ ప్రతీ చెక్కుకూ ఆర్థికశాఖ నుంచి ధృవీకరణ (అప్రూవల్‌) రావాలనే నిబంధన విధించటం సరైంది కాదని పలువురు అధికారులు సూచిస్తున్నారు. ఒక పథకం లేదా కార్యక్రమానికి ఒకసారి నిధులు మంజూరైన తర్వాత వాటి విడుదలకు అనేక కొర్రీలు వేయటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఫలితంగా పనుల్లో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటున్నదని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల మీద ఆధారపడే పేదలు, సాధారణ ప్రజలకు అమలయ్యే పథకాలకు నిధులను సకాలంలో విడుదల చేయటం ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ, కేసీఆర్‌ కిట్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వ్యవసాయ సబ్సిడీలు, విద్యుత్‌ (వృత్తిదారులు) రాయితీలు, మెస్‌ బిల్లులు తదితరాలకు ఎప్పటికప్పుడు డబ్బును విడుదల చేయటం ద్వారా ఆయా పథకాలు ఆగిపోకుండా, వాటి సేవలు నిరాకరించకుండా చూడాలి. అప్పుడే వారికి అసలైన మేలు జరుగుతుంది. వీటితోపాటు కీలకరంగాలైన విద్య, వైద్యానికి ప్రతీయేటా నిధుల కేటాయింపులు ఘనంగా ఉంటున్నా... పూర్తి స్థాయిలో వాటిని ఖర్చు చేయటం లేదు. దీంతో అనుకున్న రీతిలో ఫలితాలు రావటం లేదు. ఇలాంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించుకోవాల్సి ఉంది. మొత్తం మీద 2023 డిసెంబరులో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌... అటు ఆయన ప్రభుత్వానికి, ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీకి అత్యంత కీలకమనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం వండివార్చే పద్దు ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.