Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కవిత్వం గొప్ప ఊహ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 07,2022

కవిత్వం గొప్ప ఊహ

- కవితా వస్తువుతో ఘర్షించాల్సిందే
- సాహిత్య పాఠకులు తగ్గడం ఆందోళనకరం
- విచ్ఛిన్నభూతం(సెల్‌ఫోన్‌)తో ఎక్కువకాలం గడుపుతున్న పరిస్థితి
- జీవనయాత్ర పుస్తకావిష్కరణలో మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కవిత్వం గొప్ప ఊహ అని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌, కవి ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. కవి తన భుజకీర్తిలు, హోదాలు, భేషజాలు వదిలి భాషాజ్ఞానంతో ఊహల్లో వస్తువుతో ఘర్షించే కొద్దీ అద్భుతమైన కవిత్వం పురుడుపోసుకుంటుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో 'జీవనయాత్ర' కవితల సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బెంగాల్‌లో కవి శరత్‌చంద్ర చటోపాధ్యాయ రచించిన అనేక రచనలు తెలుగులోకి అనువదించబడ్డాయనీ, దేవదాసు, పార్వతిల ప్రేమను మన మనస్సుల మీద చెరగని ముద్ర వేసేలా చేసిన ఘనత ఆయనదని కొనియాడారు. గొప్ప అధ్యయనశీలత, సాహిత్య స్పృహ ఉన్న తరం 30-40 ఏండ్ల కింద ఉండేదన్నారు. నేటి కాలంలో సాహిత్య పాఠకుల సంఖ్య తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి టీవీనే కారణమనే ఆలోచన నుంచి మనం బయటపడాలన్నారు. ఇప్పుడు విచ్ఛిన్నభూతం(సెల్‌ఫోన్‌)తో ప్రతిఒక్కరూ గంటల తరబడి గడుపుతున్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మనకున్న భావాలు, అభిప్రాయాలు వ్యక్తీకరించే విధానం వల్ల అవి ముందు తరానికి పోతాయి తప్ప ఒక మాధ్యమాన్ని నమ్ముకునే తీసుకుపోలేమని నొక్కి చెప్పారు. ఒక వస్తువు స్వభావాన్ని మార్చగలిగే శక్తిమంతుడైన కవి రాసే కవిత చిరకాలం నిలిచిపోతుందన్నారు. శరత్‌ తన కవిత్వంలో 'కరోనా' అనే ఏక వస్తువులో భిన్నత్వాన్ని చూపి అద్భుతంగా కవిత్వాన్ని రాశారని ప్రశంసించారు. తన కవిత్వంలో మూఢత్వాన్ని వ్యతిరేకిస్తూ సైన్స్‌ ప్రాధాన్యతను చెప్పిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ప్రయివేటు టీచర్లు పడ్డ యాతన, వలసజీవుల గోడు, ఇలా సమాజాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడం వల్లనే వాటిని కవితా వస్తువుగా మలచగలిగాడనేది అక్షరసత్యమని చెప్పారు. పేదల పక్షపాతం వహించే ధోరణి శరత్‌ సుదర్శి కవిత్వంలో కనిపించిందనీ, మార్క్సిజం పట్ల అవగాహన, అధ్యయనం ఉన్న వ్యక్తుల్లోనే అది ఉంటుందని ప్రశంసించారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు పుస్తకాలు చదవడం, కొత్త వ్యక్తులను కలవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం లాంటి పనులు నిత్యం చేయాలని సూచించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవతెలంగాణ దినపత్రిక ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు కె.ఆనందాచారి మాట్లాడుతూ..కరోనాకాలంలో సేవా కార్యక్రమాలు చేసే క్రమంలో సామాన్యుల ఇక్కట్లను కండ్లార చూసిన తర్వాత శరత్‌లో దాగిఉన్న కవిహృదయం బయటపడిందనీ, అందులో నుంచి పుట్టుకొచ్చిందే జీవనయాత్ర పుస్తకం అని కొనియాడారు. మనిషి తనకు తాను కాకుండా ఇతరులు, సమాజం బాగోగులు గురించి ఆలోచించాలన్నారు. దీనిని మార్క్స్‌ ఏనాడో చెప్పాడన్నారు. రాయాలనే కోరిక చాలా బలమైనదనీ, ఎలా భావవ్యక్తీకరణ చేయాలనేది తర్వాత కాలక్రమంలో నేర్చుకోవచ్చునని చెప్పారు. ఒకే వస్తువు..ఒకే కాలం అయినప్పటికీ వ్యక్తి చూసే కోణంలో తేడా ఉంటుందన్నారు. శ్రమతో చేసిన ప్రతి వస్తువూ ఆదరణకు నోచుకుంటుందన్నారు. మేధోపరమైన శ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యేది కవిత్వమన్నారు. మోదుగుపూలు ఎడిటర్‌ భూపతి వెంకటేశ్వర్లు 'జీవనయాత్ర' పుస్తక పరిచయాన్ని చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్‌ మాట్లాడుతూ..కరోనా కాలంలో శరత్‌లోని మానసిక సంఘర్షణ నుంచి మంచి కవిత్వం వచ్చిందన్నారు. ఒకే వస్తువుతో ప్రతి అంశాన్నీ సృజిస్తూ 40 కవితలు రాయడం మామూలు విషయం కాదన్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్‌కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తితో పాటు శాంతారావు, నస్రీన్‌ఖాన్‌, మహేష్‌దుర్గే, సలీమ, బురాన్‌, జి.నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.