Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాలకులను ప్రతి పౌరుడూ ప్రశ్నించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 07,2022

పాలకులను ప్రతి పౌరుడూ ప్రశ్నించాలి

- వీఆర్‌ఏలు తెలంగాణ బిడ్డలుకారా? పేస్కేలు అమలు చేయరా?
- వారికిచ్చే నెల జీతం.. మంత్రుల గంట ఖర్చు
- పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలిచ్చేదాకా పోరాటం : జూలకంటి
- ఈ నెల 9 నుంచి నిరసన దీక్షలు : వంగూరు రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ పెద్ద దొర.. కేసీఆర్‌ చిన్నదొర.. వారిద్దరూ ప్రజలను మోసం చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ భారాలను మోపుతున్నా రనీ, వారిద్దరినీ ప్రతి పౌరుడూ ప్రశ్నించాలని వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపుని చ్చారు. వీఆర్‌ఏలు తెలంగాణ బిడ్డలు కారా? మనుషులు కారా? ఎందుకు పర్మినెంట్‌ చేయరు? అని ప్రశ్నించారు. వారికిచ్చే నెల జీతం మంత్రుల గంట ఖర్చు కాదని తెలిపారు. వీఆర్‌ఏలకు పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీఆర్‌ఏలకు జీతాలు పెరగడంలో, సమస్యలను పరిష్కంచడంలో పాలకుల మెడలు వంచి విజయం సాధించడంలో నర్రారాఘవరెడ్డి కృషి మరువలేనిదన్నారు. క్షేత్రస్థాయిలో సమాచారణ సేకరణ, పథకాల అమలులో వీఆర్‌ఏలది కీలక పాత్ర అన్నారు. తక్కువ జీతమిస్తూ వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న పరిస్థితి నేడు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి కంటే ఎక్కువ పనిగంటలు పనిచేసేవాళ్లు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే తక్కువ పనిచేసేవాళ్లు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని చెప్పారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలే కారణమని వివరించారు. విచ్చలవిడిగా అప్పులు చేయడం, ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం, విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం, మతంపేర ప్రజలను చీల్చడమనే నాలుగు లక్ష్యాలతో మోడీ సర్కారు ముందుకు పోతున్నదని విమర్శించారు. 2014కు ముందు మన దేశ అప్పు రూ.50 లక్షల కోట్లు ఉంటే మోడీ వచ్చాక రూ.1.35 లక్షల కోట్లకు చేరుకున్నదని వివరించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లడబ్బు వెలికితీసి పేదల ఖాతాల్లో జమచేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజాస్వామ్యయుత పాలనకు పాతరేసి నిరంకుశత్వంతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. గతంలో ప్రజా సమస్యలపై వారానికో రెండు,మూడు సార్లు సీఎంను కలిసే అవకాశం ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నేతలకు ఉండేదనీ, కేసీఆర్‌ సీఎం అయ్యాక అపాయింట్‌మెంట్లే కరువయ్యాయని తెలిపారు. పాలకులు గుర్తించకపోయినా ప్రజల్లోకి తమ సమస్యలను తీసుకెళ్లేలా వీఆర్‌ఏలు తమ హక్కుల కోసం పోరాడాలనీ, పాలకుల లోపాలను ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడే ఎర్రజెండా వీఆర్‌ఏలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ..ఈ బడ్జెట్‌లోనే వీఆర్‌ఏలను పర్మినెంట్‌ చేస్తూ నిధులు కేటాయించాలనీ, పేస్కేలు అమలు చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలనీ, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు. తామేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదనీ, వీఆర్‌ఏలకు పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ హామీలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 774 జీవో తీసుకొచ్చిన సందర్భంలో వీఆర్‌ఏలు చేసిన పోరాటం చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి ఒక కారణమైందనీ, నేడు కేసీఆర్‌ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ మాట్లాడుతూ..వీఆర్‌ఏల పోరాటం న్యాయసమ్మతమైనదన్నారు. వారికి అండగా సీఐటీయూ ఉంటుందని హామీనిచ్చారు. ఐక్యపోరాటాలతో పాలకులపై కొట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయని నొక్కిచెప్పారు. వీఆర్‌ఏల సంఘం వ్యవస్థాపకులు మోసంగి అంజయ్య, వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలనర్సయ్య, ఎల్‌.నర్సింహ్మ, ఎస్‌కే దాదేమియా, అమీరుద్దీన్‌, సీహెచ్‌ రాజయ్య, బాలరాజు, రమేశ్‌, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.