Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వార్‌ వన్‌సైడే! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 08,2022

వార్‌ వన్‌సైడే!

- ఏకపక్షంగా శాసనసభ నిర్వహణ
- గవర్నర్‌ ప్రసంగం లేదు
- కాంగ్రెస్‌ వాకౌట్‌.. బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌
- ఓయూలో అలజడి
- ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌
- సీఎం కాన్వారును అడ్డుకునేయత్నం
- పోలీసు పహారాతో అసెంబ్లీ సమావేశాలు షురూ..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
           శాసనసభ ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వం సభా నిర్వహణపై స్పష్టతనిచ్చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే, నిలదీస్తే, నిరసిస్తే సహించేదిలేదని ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికనే పంపింది. దీన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్‌ సభ్యులు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అంటూ మైక్‌ కోసం నినాదాలు చేసినా స్పీకర్‌ పట్టించుకోకపోవడంతో వారు సభ నుంచి వాకౌట్‌ చేశారు. గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్రప్రభుత్వంపై సభలో తీవ్ర విమర్శలు చేస్తుండటాన్ని నిరసిస్తూ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు, నల్లకండువాలు వేసుకొని తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేసిన రఘునందనరావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు ముగిసేవరకు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. దీనితో సభలో టీఆర్‌ఎస్‌, అనధికార మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం సభ్యులు తప్ప ఎవరూ మిగల్లేదు. ఇక శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అంతకుముందు వారిద్దరూ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం హైలెట్‌. రెండు సార్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ ఈసారి బీజేపీ సభ్యుడిగా సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి వచ్చే సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. కొందరు ఎమ్మెల్యేలు ఈటలను అలింగనం చేసుకొని 'వెల్‌కం' చెప్పారు. మరోవైపు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ తెలంగాణ ప్రజలకు బడ్జెట్‌ శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్న ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్టు ఆమె చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆశలు ఈ బడ్జెట్‌ ద్వారా నెరవేరాలని ఆకాంక్షించారు. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని అయినా రెండేండ్లుగా తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై కాంగ్రెస్‌పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్‌కే దిక్కులేకపోతే సభ్యుల సంగతి ఏంటని కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఉదయం 11 గంటల 32 నిముషాలకు ప్రవేశపెట్టారు. ఆయన మూడోసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతో కేసీఆర్‌ చేసిన పోరాటాన్ని ప్రస్తుతిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. కేంద్రప్రభుత్వంపై ముప్పేటదాడి చేశారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రాపాలకుల నుంచి వివక్షను ఎదుర్కొంటే, స్వరాష్ట్రంలో కేంద్రం నుంచి అదే వివక్షను ఎదుర్కుంటున్నామని విమర్శలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూ.2,56,958.51 కోట్లుగా ఆయన ప్రకటించారు. దానిలో రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు కాగా, క్యాపిటల్‌ వ్యయం రూ.29,728.44 కోట్లుగా చూపారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సభలో ప్రతిపాదించగా, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి దాన్ని ప్రకటించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ఎదుట బైఠాయించి, ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్టేషన్‌కు తరలించారు.
        ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తున్న సమయంలో ఆయన కాన్వారుని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత అర్జున్‌ నాయక్‌ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తక్షణం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కాన్యారుకు అడ్డంగా పరిగెడుతూ నినాదాలు చేశారు. పోలీసులు వెంట పరిగెత్తి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోనూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చలో అసెంబ్లీ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించే ప్రయత్నం చేసారు. పోలీసులు యూనివర్సిటీ గేట్లు మూసేసి, ఎక్కడివారిని అక్కడే అరెస్టులు చేశారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు రెండుగంటలపాటు సుదీర్ఘంగా బడ్జెట్‌ను చదివారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించి, మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. సస్పెండ్‌ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను కలిసి, సభా నిర్వహణపై ఫిర్యాదు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.