Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళలకు పనిహక్కు కల్పించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 09,2022

మహిళలకు పనిహక్కు కల్పించాలి

- సమానవేతనం చెల్లించాలి
- హింసలేని సమాజం కావాలి
- స్త్రీల రక్షణ బాధ్యత పాలకులదే
- 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయూ
- ఐద్వా,టీఎస్‌యూటీఎఫ్‌ సభలో పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
మహిళలకు పనిహక్కు కల్పించాలని ప్రభుత్వాలను శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్‌, ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి డిమాండ్‌ చేశారు. పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని కోరారు. హింసలేని సమాజం కావాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్‌
రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో 'యాక్షన్‌డే' నిర్వహించాయి. అందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని వీఎస్టీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళానిలయంలో జరిగిన సభకు అధ్యక్షవర్గంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌వీ రమ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, టీఎస్‌యూటీఎఫ్‌ మహిళా విభాగం కన్వీనర్‌ దుర్గాభవాని వ్యవహరించారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక మహిళలకు కనీసవేతనం చెల్లించాలనీ,సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ఆడపిల్లలకు చదువు కావాలనుకుం టున్నారా?,వద్దనుకుంటున్నారా?అనిపాలకులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల్లేకుంటే పాఠా లు ఎవరు చెప్తారని నిలదీశారు. 'బేటీ బచావో బేటీ పడావో'అంటున్న మోడీ ఆడపిల్లల విద్యకు నిధులు మాత్రం కేటాయించడం లేదని విమర్శించారు. అంటే మనుధర్మం ప్రకారం చదువుకోకుండా చిన్నవయస్సులో పెండ్లి చేసుకోవాలంటారా?అని మోడీని నిలదీశారు. పాలకులకు నిజాయితీ ఉంటే మహిళలకు ఉపాధి కల్పించాలనీ, కనీస వేతనం ఇవ్వాలనీ, పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని నొక్కి చెప్పారు. సమాజంలో హింసను అరికట్టాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్‌లను తెచ్చి హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను అదానీకి అప్పగించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఎల్‌ఐసీ, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తే ప్రజలే నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
బడుల్లేక అమ్మాయిలకు బాల్యవివాహాలు : సంయుక్త
సమాజంలో అసమానతలు, వివక్ష, అనారోగ్యం, రక్షణలేనితనం, అఘాయిత్యాలను చూసి మహిళా దినోత్సవ వేడుకలను చేసుకోవాలా?అని ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త ప్రశ్నించారు. పురుషునితోపాటు మహిళ సమానమని అన్నారు. ఇంటి నుంచే వివక్ష ఉందనీ, మార్పు రావాలని ఆకాంక్షించారు. కోవిడ్‌ నేపథ్యంలో బడుల్లేక, చదువుల్లేక అమ్మాయిలకు బాల్యవివాహాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు, పాప అన్న తేడాలేకుండా పిల్లలను పెంచాలని సూచించారు. సమిష్టి పోరాటాలే విజయంసాధిస్తాయనీ, హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మాట్లాడుతూ అమృత మహోత్స వాలు జరుగుతున్న ఈ దేశంలో ఇంకా మహిళ లు రక్తహీనత, పౌష్టికాహార లేమితో ఇబ్బంది పడుతున్నందుకు పాలకులు సిగ్గుపడాలన్నారు. మహిళల శ్రమను గుర్తించాలనీ, ఇంటి పనినీ గౌరవించాలని కోరారు. గోదాముల్లో ఆహారధాన్యాలున్నా సమాజంలో ఆకలి ఎందుకుందని ప్రశ్నించారు. ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశభక్తియుత సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. డాక్టర్‌ సంధ్యాదీక్షిత్‌ మాట్లాడుతూ కుటుంబం, సమాజం బాగుండాలంటే మహిళల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. యుక్త వయస్సు అమ్మాయిలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. లేదంటే వారి ఎదుగుదలతోపాటు పుట్టే బిడ్డలపైనా ప్రభావం చూపుతున్నదన్నారు.పేద, దిగువమధ్యతరగతి తోపాటు అమ్మాయిలకు విద్యను దూరం చేసేందుకే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తెచ్చిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య విమర్శించారు. కరోనా నేపథ్యంలో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు బాలకార్మికులుగా మారి విద్యకు దూరమయ్యా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి కోత విధించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తోపాటు ఆర్‌ వాణి, వినోద, శశికళ, మీనా (సీఐటీయూ), బి హైమావతి (ఐద్వా), శారద, సుగంధ, వెంకటరత్నం, వందన (టీఎస్‌యూటీఎఫ్‌) తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.