Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 09,2022

గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు

- స్వార్థం కోసం దేశాన్ని ఆగం పట్టించే కుట్ర
- మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి
- బీజేపీ ఆట కట్టించేందుకు జాతీయ రాజకీయాల్లోకి..
- నిరుద్యోగుల కోసం నేడు కీలక ప్రకటన:
- వనపర్తి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
'దేశంలో గోల్‌ మాల్‌ గోవిందం గాళ్లు మోపు అయ్యారు.. ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ తన స్వార్థం కోసం దేశాన్ని చీల్చే కుట్రలకు పాల్పడుతోంది.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. కాషాయమూకలు, నరేంద్రమోడీ .. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. లౌకికతత్వాన్ని మంట కలుపుతున్నారు. ఇలాంటి మత పిచ్చిగాళ్లను బంగాళఖాతంలో విసిరేస్తే పీడ విరుగడవుతుంది. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్‌ మనకు రాకుండా చూసుకోవాలి.. చైతన్యం ఉన్న గడ్డగా.. తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణలో రానివ్వను. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలి' అని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాల మైదానంలో మంగళవారం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొడుతూ దేశమేలుతున్న బీజేపీ పాలకులు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలంతా మతతత్వ పార్టీని ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేసినట్టుగానే దేశాభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానన్నారు.
వాల్మీకి గిరిజనుల రిజర్వేషన్స్‌ పెంచాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసినా మోడీ కావాలనే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం రాకముందు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఉండేది కాదని, ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ఐదు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో సంపూర్ణ మార్పు తీసుకొచ్చి బంగారు దేశంగా మార్చుతామని దీమా వ్యక్తం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అర్ధాంతరంగా ఆగిందని, త్వరలోనే అవాంతరాలను అధిగమించి పూర్తి చేసి 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకు 11 జిల్లాల నుంచి వలస వస్తున్నారన్నారు.
హైదరాబాద్‌ నుంచి గద్వాల దాకా ధాన్యపు రాసులు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, ఎంపీలు పోతుగంటి రాములు, మన్యం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, రాజేందర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మెన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌ రెడ్డి, సాయిచందు, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు - మన బడికి శ్రీకారం
అంతకుముందు వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు -మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.మన ఊరు - మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్‌,మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి ఆవిష్కరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
నేడు నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో ప్రకటన
నిరుద్యోగ యువ సోదరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. నిరుద్యోగ సోదరులంతా మంగళవారం పొద్దున 10 గంటలకు టీవీలు చూడండి. ఏం ప్రకటన చేయబోతున్నామో చూడండి.. అని సీఎం తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.