Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం:కేటీఆర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 11,2022

మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం:కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని గురువారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. ఎంఐఎం మినహా ఎక్కువ ప్రశ్నలు అదికార పార్టీ సభ్యుల నుంచే వచ్చాయి. దాదాపు 20 మంది సభ్యులు ప్రజాసమస్యలు, ప్రభుత్వ పథకాలు, వాటి అమలుతీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిలోని రోడ్లు, మూసీనది పరిశాహక ప్రాంత అభివృద్ధి గురించి చర్చ జరగడం గమనార్హం. పర్యాటక ప్రాంతాలు, రోడ్లు, పాడిపరిశ్రమ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల గురించి కూడా సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. మూసీ నది అభివద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివద్ధి పథకం కింద చేపట్టిన పనులపై ఎంఐఎం సభ్యుడు మోజం ఖాన్‌, టీఆర్‌ఎస్‌ సభ్యుడు దానం నాగేందర్‌, వివేకానందగౌడ్‌, అరికెపూడి గాంధీ, కాలేరు వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 2014, 2015 సంవత్సరాల్లో రెండు మూడు సందర్భాల్లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ హాఫీజ్‌ కాంట్రాక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో బాల్య వివాహాలకు చెక్‌ : మంత్రి గంగుల కమలాకర్‌
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలు చేయడంతో రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా పథకాలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు అజ్మీరారేఖా నాయక్‌, దుర్గం చిన్నయ్య, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ రెండు పథకాల కింద 10 లక్షల 26 వేల 396 మంది లబ్ధి పొందారు. బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజన శాఖ ద్వారా 1,21,639 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676, ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది లబ్ధి పొందారు. ఈ రెండు పథకాలకు మొత్తంగా రూ. 8,673.67 కోట్ల ఖర్చు చేశామని తెలిపారు. కులాంతర వివాహాలకు కూడా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అమలు చేసి, చెక్‌లు అందిస్తున్నామని అన్నారు. భార్య బీసీ, భర్త ఓసీ అయినప్పటికీ చెక్‌లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఒక వేళ ఎక్కడైనా సమస్య ఎదురైతే తమ దష్టికి తీసుకురావాలని సభ్యులకు మంత్రి సూచించారు.
విజయ డెయిరీ టర్నోవర్‌ రూ. 750 కోట్లు : మంత్రి తలసాని
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారా కులవత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. విజయ డెయిరీ టర్నోవర్‌ రూ. 750 కోట్లకు చేరిందన్నారు. రూ. నాలుగు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల పాల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివద్ధిపై టీఆర్‌ఎస్‌ సభ్యులు అంజయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గొంగిడి సునీత తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు.
ఇతర దేశాలతో పోటీ పడేలా పర్యాటకాభివృద్ధి :శ్రీనివాస్‌ గౌడ్‌
సరళా సాగర్‌, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వద్ద పర్యాటక రంగాన్ని అభివద్ధి చేస్తామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలంటూ అధికార పార్టీ సభ్యుడు ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ కోయిల్‌ సాగర్‌ ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రూ. 8.30 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇదే రకంగా సరళా సాగర్‌ను కూడా అభివృద్ధి పరుస్తామని చెప్పారు.
హైదరాబాద్‌ అభివద్ధికి బహుముఖ వ్యూహం : కేటీఆర్‌
హైదరాబాద్‌ నగర అభివద్ధికి బహుముఖ వ్యూహాంతో ముందుకెళ్తుతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివద్ధి ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ. 37 వేల కోట్లతో 70 పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2497 కోట్లతో 27 పనులు పూర్తయ్యాయి.
హైవేలను అభివృద్ధి చేస్తాం: మంత్రి వేముల
రాష్ట్రంలో హైదరాబాద్‌-కల్వకుర్తి జాతీయ రహదారిని మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ సభ్యుడు జైపాల్‌యాదవ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... యాక్సిడెంట్లను నివారించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
దివంగత ఎమ్మెల్యేలకు సభ సంతాపం
జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, శాయంపేట మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల శాసనసభ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పీకర్‌ పోచారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారి మరణానికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.