Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 11,2022

బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి

- విద్యారంగానికి నిధులను 15 శాతానికి..
- వైద్యరంగానికి ఎనిమిది శాతం ఇవ్వాలి : మండలిలో నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అనుకూలమైన అంశాలతో పాటు సవరించుకోవాల్సిన అంశాలున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ.... విద్యరంగానికి కేటాయింపులను 15 శాతానికీ, వైద్యరంగానికి ఎనిమిది శాతానికి నిధులను పెంచాలని డిమాండ్‌ చేశారు. మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలల్లోనూ ప్రారభించాలని కోరారు. మొదటి దశలో 9,123 పాఠశాలల అభివద్ధికి రూ.3,497.62 కోట్లు మార్చి 31 నాటికి జమ చేయాల్సి ఉందనీ, దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ పెట్టాలనీ, మధ్యాహ్న భోజన రేట్లను పెంచాలని కోరారు. గుడ్డు రేటును రూ.ఐదు చేయాలనీ, వంట ఏజెన్సీ పారితోషికం రూ.3,000 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌ విద్యలో 75 శాతం మంది ప్రయివేటు, కార్పొరేటు జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ తీరు మారాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. జూనియర్‌ కళాశాలలను అభివృద్ధి చేయాలని కోరారు. డిగ్రీ విద్యలో 75 శాతం మంది ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్నారనీ, ఈ పరిస్థితిని మార్చేందుకు వెంటనే మారుమూల ప్రాంత ప్రభుత్వ కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకులను నియమించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలకు బడ్జెట్‌ పెంచాలని విజ్ఞప్తి చేశారు. సెకెండరీ విద్యలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరో ఎనిమిది వేల ఖాళీలుండే అవకాశముందంటూ వాటినీ నియామకాల్లో చేర్చాలని కోరారు. వంద మందికిపైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయున్ని నియమించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసుల కోసం పాఠశాల విద్యాశాఖ ద్వారానే నియామకాలు చేపట్టాలనీ, విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలన్నారు.
పట్టణ జనాభా పెరుగుతున్నందున అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. బస్తీ దవాఖానాలు యూపీహెచ్‌సీలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. గ్రామీణ పీహెచ్‌సీలను నిరంతరాయంగా పని చేసేలా డాక్టర్లు, నర్సుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు.
పెరిగిన తలసరి ఆదాయానికి తగినట్టు గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కార్పొరేషన్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రెమ్యునరేషన్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో పని చేసే బోధనేతర సిబ్బందికి పీఆర్సీ ప్రకారం 30 శాతం రెమ్యునరేషన్‌ పెంచాలని కోరారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షలో పని చేస్తున్న సిబ్బందికి కనీస వేతనాన్ని అమలు చేయాలన్నారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లలోని టీచర్లకు గతంలో మాదిరిగానే పారిటీ స్కేళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 73 షెడ్యూలు ఎంప్లాయిమెంట్‌ పరిశ్రమలకు సంబంధించి జీవోలు సవరించి కనీస వేతనాలు అందేలా చూడాలని అలుగుబెల్లి ఆర్థిక మంత్రిని కోరారు.
ధరణి పోర్టల్‌లో లోపాలను సరి చేయాలనీ, రైతుబంధును కౌలు రైతులకు వర్తింపజేయాలనీ, గిరిజనులకు గిరిజన బంధు, వెనుకబడిన తరగతుల వారికి బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలనీ, డీఏలు విడుదల చేయాలని కోరారు. మైనార్టీ సంక్షేమానికి అదనంగా నిధులు కేటాయించాలనీ, శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గం పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా, బిడ్డ సొమ్ము తల్లిదండ్రులు కాపాడినట్టుగా ఉండాలని నర్సిరెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో చైర్మెన్‌ జాఫ్రి ముగించాలని కోరడంతో పలు సూచనలతో కూడిన పత్రాన్ని చైర్మెన్‌ ద్వారా ఆర్థిక మంత్రికి అందజేశారు.
ఎందులో కోత విధించాలి...?
విద్య, వైద్యానికి నిధులు పెంచాలని నర్సిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అడ్డు తగిలారు. పలు విభాగాల వారీగా కేటాయించిన నిధులు సరిపోవనీ, వాటిని పెంచాల్సిన అవసరముందని నర్సిరెడ్డి చెబుతుండగా, ఉన్నదాంట్లోనే సర్దుబాటు చేయాలిగా...?మరి ఎందులో కోత విధించాలో చెప్పాలంటూ హరీశ్‌ రావు ప్రశ్నించారు. అలుగుబెల్లి స్పందిస్తూ....ఎందులో కోత విధించాలో కూడా చెబుతాననీ, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తే ఆ విషయాన్ని వివరిస్తానని జవాబిచ్చారు..

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.