Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సింగరేణి రక్షణకు కలిసికట్టుగా ముందుకెళ్దాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 12,2022

సింగరేణి రక్షణకు కలిసికట్టుగా ముందుకెళ్దాం

- సభలో ఏకగ్రీవ తీర్మానం చేయండి
- ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచండి
- గమ్ముగా ఉంటే బెల్‌, బీడీఎల్‌, హైదరాబాద్‌లోని ఇతర సంస్థలనూ అమ్మేస్తారు
- దేశసంపద కొందరివద్దే పోగుపడొద్దనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
- నేడు కొందరి చేతుల్లోనే సంపద పెట్టే పనికి బీజేపీ దిగింది :అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి
- దేశ సంపదనను అంబానీ, ఆదానీలకు అప్పగించేస్తున్నారు : శ్రీధర్‌బాబు
- నష్టాల్లోకి నెట్టి సింగరేణిని ప్రయివేటీకరించే కుట్ర : బాల్క సుమన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణ సంస్థ రక్షించుకునేందుకు కలిసికట్టుగా ముందుకెళ్దామనీ, దీనిపై సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీకి అఖిల పక్షాన్నితీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనీ, గమ్ముగా ఉంటే బెల్‌, బీడీఎల్‌, హైదరాబాద్‌లోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలనూ మోడీ సర్కారు అమ్మేస్తుందని హెచ్చరించారు. అలా చేస్తే వాటి ఆధారంగా నడుస్తున్న అనుబంధ పరిశ్రమలు మాటేంటి? వాటిపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భట్టి మాట్లాడుతూ..దేశ సంపద కొందరి వద్దనే పోగుపడొద్దనే ఉద్దేశంతోనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తొలి ప్రధాని నెహ్రూ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుదు దీనికి విరుద్ధంగా దేశ సంపదను కొందరి చేతుల్లోనే పెట్టే పనికి బీజేపీ పూనుకున్నదని విమర్శించారు. దేశ సంపదను పోగేస్తున్న ప్రభుత్వ రంగసంస్థలన్నింటిని కూడా తెగనమ్మేసి కొద్ది మంది చేతుల్లో సంపద పెట్టాలనే ఆలోచనలో భాగమే సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రయివేటీకణ అన్నారు. ఆ సంస్థ యాజమాన్యం బ్లాకులను అడుగుతున్నా..ప్రయివేటుకు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను, సింగరేణిని కాపాడుకోవాలనుకునే వాళ్లందరూ కలిసిపోరాడాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. గుజరాత్‌ రాష్ట్రం బ్లాకులు అడగ్గానే మోడీ సర్కారు వెంటనే ఇస్తుందా? తెలంగాణ రాష్ట్రం అడిగితే ఇవ్వదా? ఏంటీ వివక్ష? ఏం పాపం చేసింది తెలంగాణ? అని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఆధారంగా ఎంతో మంది జీవితాలు పెనవేసుకుని ఉన్నాయని చెప్పారు. సింగరేణిని మూసేసి ప్రయివేటీకరించే ఆలోచనను బీజేపీ చేస్తున్నదని ఆరోపించారు. ఇలాగే చూస్తూ ఉంటే అన్నింటినీ అమ్మేస్తారని హెచ్చరించారు. సింగరేణి కోల్‌ మైన్‌ వ్యవస్థనే కాదనీ, తెలంగాణ ఆత్మ అని అన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సింగరేణి దగ్గర కావాల్సినంత టెక్నాలజీ ఉన్నా.. ఎందుకు ఇవ్వరంటూ కేంద్రాన్ని నిలదీద్దామన్నారు. బ్లాకులను సింగరేణి తెచ్చుకోవడమే కాకుండా ఆపరేట్‌ చేయాలనీ, ప్రయివేటుకు ఇవ్వొద్దని కోరారు. ఒడిశాలోని నైనీ సంస్థ బ్లాకుల యాక్షన్‌ విషయంలో అవకతవకలు జరిగాయనే ప్రచారం జరుగుతున్నదనీ, అది వాస్తవమా? కాదా? సభకు చెప్పాలని అడిగారు. పేదవాని సంపదను కొల్లగొట్టాలని చూసినా, సంపదను ధనవంతుకులకు అప్పజెప్పాలని చూసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సింగరేణి రక్షణ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.
కాంగ్రెస్‌ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటూ బేచో ఇండియా నినాదంతో మోడీ సర్కారు ముందుకు పోతున్నదని విమర్శించారు. ఎల్‌ఐసీ, ఎయిర్‌ఇండియా, విశాఖ స్టీల్‌ లాంటి తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని నేడు మోడీ సర్కారు అమ్మేస్తున్నదనీ, ఆదానీ, అంబానీలకు దేశాన్ని అప్పగించే పనిలో ఉందని విమర్శించారు. రాష్ట్రానికీ వాటా ఉన్న నేపథ్యంలో బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరించకుండా లాభాల్లో ఉన్న సింగరేణికే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు బాల్క సుమన్‌ మాట్లాడుతూ..బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టడమంటే సింగరేణిపై కక్ష గట్టడమేనన్నారు. సింగరేణి ఆస్తులను అమ్మేడం అన్యాయమన్నారు. ఆ సంస్థను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇట్లాగే ఊరుకుంటే సింగరేణిలో మరో 14 బ్లాకులను ప్రయివేటీకరించే ప్రమాదముందని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఐరన్‌ఓవర్‌ మైన్‌ కావాలని అడిగితే 22సార్లు లేఖ పెట్టినా కేంద్రం కేటాయించలేదన్నారు. సింగరేణిని కూడా ఇలాగే నష్టాల్లోకి నెట్టి అమ్మేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. ఈ చర్చలో ఇతర సభ్యులు కాంగ్రెస్‌ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, దివాకర్‌రావు, కోరుకంటి చందర్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.