Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రుణం తీర్చలేఈము | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 12,2022

రుణం తీర్చలేఈము

- ఒక్కొక్కరికి రూ.30 లక్షలకు పైగా నష్టం
- పరిశ్రమ మూతబడినా వెంటాడుతున్న రుణాలు
- ఆర్థికభారంతో ఆత్మహత్యలు, అనారోగ్యం పాలు
- రాష్ట్రవ్యాప్తంగా 118 మంది రైతుల దీనావస్థలు
- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు, ఆదాయ వనరులపై దృష్టి సారించాలని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈము రైతుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.లక్షలు, కోట్లు వెచ్చించి స్థాపించిన ఈము పరిశ్రమ దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. తద్వారా సంబంధిత రైతులు ఆర్థికంగా చితికిపోయి బ్యాంకు రుణాలు తీర్చలేక అనారోగ్యం, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

            2004 నుంచి ఈము యూనిట్ల స్థాపన మొదలైనా 2008 నుంచి ఊపందుకుంది. 25% నాబార్డు, బ్యాంకుల సబ్సిడీతో స్థాపించిన ఈము పరిశ్రమ మార్కెటింగ్‌, ఎగుమతి సౌకర్యం లేకపోవడంతో మూడునాలుగేండ్లలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.లక్షలు, కోట్ల పెట్టుబడి పెట్టి స్థాపించిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు వారంతా బ్యాంకు రుణాలు రద్దు చేయాలని పశుసంవర్థక, ఆర్థిక మంత్రిత్వశాఖల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం 50%, బ్యాంకులు 25% రుణాలను మాఫీ చేయగా రైతువాటాగా 25% చెల్లించిన విషయాన్ని ఉదాహరిస్తున్నారు.
వెంటాడుతున్న బ్యాంకు రుణాలు...
           2004-2009 మధ్య కాలంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌' ద్వారా రైతులను ఈము పక్షుల పెంపకం దిశగా ప్రోత్సహించింది. ఒళ్లంతా ఔషధ గుణాలతో కూడిన ఈము మాంసం, గుడ్లు, ఈకలు, గోర్లు ప్రతి ఒక్కటీ ఎంతో లాభసాటి అని రైతులను ప్రేరేపించడంతో సుమారు 500 మంది వరకు పెంపకం చేపట్టారు. తెలంగాణ నుంచి సుమారు 200 మంది ఈము ఫామ్‌లను ఏర్పాటు చేస్తే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 70 మంది వరకు యూనిట్లు నెలకొల్పారు. ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండల్లో అధిక యూనిట్లు స్థాపించారు. వీరికి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ కూడా ఇచ్చారు. 50 ఆడ, 50 మగ చొప్పున వంద పక్షులకో యూనిట్‌ నెలకొల్పారు. ఒక్కో యూనిట్‌ స్థాపనకు రూ.30 లక్షల వరకు వెచ్చించారు. నాబార్డు, ప్రభుత్వ సబ్సిడీ 25% (రూ.7.5 లక్షలు)తో రైతులు ఆస్తులు, ఇండ్లు బ్యాంకులకు మార్టిగేజ్‌ చేసి ఈ యూనిట్లు స్థాపించారు. ఈము పక్షుల మాంసం తింటే షుగర్‌ కంట్రోల్‌ అవుతుందని నిపుణులు సూచించడంతో అప్పట్లోనే పావుకిలో మాంసం రూ.400 చొప్పున ధర పలికింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలోని ఈము పెంపకం దారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఖమ్మం జిల్లాలో చింతకాని, కొణిజర్ల, బోనకల్‌, ఖమ్మం అర్బన్‌, తల్లాడ, సత్తుపల్లి, కూసుమంచి, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, భద్రాచలం, దమ్మపేట, బూర్గంపాడు తదితర మండలాల రైతులు, నిరుద్యోగ యువత ఈము ఫామ్స్‌ నెలకొల్పి తీరని నష్టాలను చవిచూశారు. బ్యాంకు రుణాలు వెంటాడుతుండటంతో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆర్థికభారంతో ఈము ఫామ్‌ల మూత...
           అనేక ఒడిదొడుకుల మధ్య కూడా ఆరేడేండ్ల కిందట వరకు ఈము పక్షుల పెంపకాన్ని కొనసాగించిన రైతులు ఆర్థిక ఇబ్బందులతో పరిశ్రమకు మూతవేశారు. ఏటా ఫామ్‌లలో పెరిగిపోతున్న సంతతి, వాటిని మేపేందుకు ఆర్థికస్తోమత లేక నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈము పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి రైతులను ఆదుకుంది. అలాగే తమనూ ఆదుకోవాలని రాష్ట్రంలోని ఈము రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. వ్యవసాయం, పశుసంవర్థకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2018లో ఓ కమిటీని వేశారు. మొత్తం 13 బ్యాంకుల నుంచి తెలంగాణలోని 118 మంది రైతులు తీసుకున్న రుణం రూ.27 కోట్లుగా నిర్ధారించారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈము పరిశ్రమ నిర్వాహకులు ఆర్థికశాఖ, పశుసంవర్థకశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. కొందరు రైతులు బ్యాంకులతో వన్‌టైం సెటిల్మెంట్‌ సైతం చేసుకున్నారు. తనఖా పెట్టిన ఆస్తులు, తీసుకున్న రుణం ఆధారంగా ఈ సెటిల్మెంట్‌ ద్వారా నిర్ధారించిన లోన్‌ను చెల్లించారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో పలువురు రైతులు అనారోగ్యం పాలయ్యారు.
ఆర్థికబాధలతో ఒకరిద్దరు మరణించారు
           ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ ఈము రైతుల సంఘం కన్వీనర్‌ బల్లేపల్లి హరిబాబు 2017లో కాజీపేటలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మరోముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒకరిద్దరు రైతుల గుండెపోటుతో మరణించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ ఈము రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయమై జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వేణుమనోహర్‌ను వివరణ కోరగా దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.
ఈము రైతుల ఆదుకోవాలి...
           ఈము రైతుల ఆదుకో వాలని ఇప్పటికే గవర్నర్‌, చీఫ్‌ సెక్రటరీ, ఆర్థికమంత్రి, పశుసంవర్థకశాఖ మంత్రిని కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది రైతులు ఇలా ఇబ్బంది పడ్డారు. 42 మంది సెటిల్మెంట్‌ చేసుకోగా 118 మంది మిగిలి ఉన్నారు. స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి ఈ విషయాన్ని రిఫర్‌ చేశాం. 25శాతం భరిస్తామని హామీ ఇచ్చింది. మిగిలిన 50% విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందనలేదు.
- డాక్టర్‌ పెంచాల శ్రీనివాస్‌,
తెలంగాణ ఈము రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌

రూ.40 లక్షలు నష్టపోయా...
రూ.27 లక్షలు వెచ్చించి వంద పక్షులతో 2010-11లో ఈము ఫారమ్‌ ఏర్పాటు చేశాను. మొదట్లో రూ.6లక్షల వరకు తిరిగి చెల్లించాను. ఐదేండ్ల పాటు వాయిదాలు చెల్లించాక 25% నాబార్డు సబ్సిడీ లభిస్తుందన్నారు. కానీ ఆ సబ్సిడీ రాలేదు. ఈలోగా ఫారమ్‌ మూతబడింది. మొత్తంగా రూ.40లక్షల వరకు నష్టపోయాను. ప్రిన్సిఫుల్‌ అమౌంట్‌తో సహా ప్రభుత్వం మొత్తం రుణాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
-బల్లి వీరయ్య, తిర్మలాపురం, చింతకాని మండలం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.