Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆసరాపై ఆశలేనా..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2022

ఆసరాపై ఆశలేనా..!

- కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడో..?
- బడ్జెట్‌లో గతేడాది కంటే పైసా పెంచని సర్కార్‌
- ఈ యేడాది అవే నిధులు.. కొత్త పింఛన్లు ఇచ్చేదెట్టా?
- 57ఏండ్ల దరఖాస్తుదారుల లెక్కలు చూపని ప్రభుత్వం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
''సర్కారు ఇచ్చే ఆసరా పింఛన్‌ వస్తే మందు గోలీలకు ఆసరవుతుందని ఆశ పడ్డా.. కానీ దరఖాస్తు చేసుకుని ఏండ్లు గడుస్తున్నా పింఛన్‌ రావడం లేదు. ప్రతి ఏడాదీ అసెంబ్లీలో ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అని ఆశపెడుతుందే తప్ప ఒక కొత్త పింఛన్‌ మంజూరు చేసింది లేదు. అధికారుల దగ్గరికి పోతే.. కొత్త పింఛన్లు ఇప్పట్లో ఇచ్చేది లేదు. సర్కారు నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని ముఖంమీదే చెబుతున్నారు. వచ్చే నెల పక్కాగా పింఛన్‌ వస్తదని మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఎన్నో చెప్పిండ్రు. మంత్రి సారు ఈ మాటనైన నిలబెట్టుకుంటాడో లేదో'' అని.. నార్సింగ్‌ మున్సిపాలిటీకి చెందిన వికలాంగుడు వడ్డెనాల మల్లేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎవరిని కదిలించినా నిరాశతో మాట్లాడుతున్నారు. మాకు ఆసరా పింఛన్‌ అందుతుందన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లుతుందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 35 వేల ఆసరా పింఛన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 20,251 దరఖాస్తుల్లో వృద్ధులు 4919, వితంతువులు 10911, వికలాంగులు 3087, కల్లు గీత కార్మికులు 504, చేనేత కార్మికులు, 129, ఒంటరి మహిళలు 682, పైలేరియా 19 మంది దరఖాస్తులు చేసుకుని ఏండ్లు గడుస్తోంది. ప్రతి ఏడాదీ బడ్జెట్‌లో ఆసరా పథకానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 2019-20 బడ్జెట్‌ రూ.9,402 కోట్లు కేటాయించగా.. 2020-21 రూ.11,728 కోట్లు, 2022-23 బడ్జెట్‌లో రూ.11,728 కేటాయించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ ఆసరా పథకానికి నిధులు కేటాయించారు. కానీ, ఈసారి కొత్త పింఛన్లు ఇస్తే.. గతేడాది కంటే ఈ ఏడాది అర్హులైన వారి సంఖ్య పెరగనుంది. బడ్జెట్‌లో నిధులు మాత్రం రూపాయి కూడా పెరగలేదు. దీనిని బట్టి చూస్తే ఆసరాకు దరఖాస్తు చేసుకున్న వారికి మళ్లీ నిరాశే ఎదురవనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒంటిలో సత్తువ లేక కూలినాలి చేయలేని వృద్ధులకు.. వికలాంగులకు, వితంతువులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆసరా పింఛన్‌ కొంత చేయూతనిస్తుంది. వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు ప్రభుత్వం తగ్గించింది. చేనేత, గీత, బీడీ కార్మికులకు 50ఏండ్లు, వితంతువులకు (18ఏండ్లు పైబడి భర్త చనిపోయి ఉంటే), ఒంటరి మహిళలకు 35 ఏండ్లుగా అర్హత వయసు ఉన్నది. వికలాంగులు, పైలేరియా, ఎయిడ్స్‌ బాధితులకు ఎటువంటి అర్హత వయసు లేదు. ఆసరా పింఛన్‌తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వయస్సును నిర్ధారించుకునేందుకు ఆధార్‌ను పరిశీలన చేశారు. అలాగే, ఏజ్‌ ప్రూఫ్‌కు ఇతర ఆధారాలు కూడా తీసుకున్నారు. కానీ 57 ఏండ్ల వయస్సు వారి దరఖాస్తులను కనీసం లెక్కలోకి తీసుకున్నట్టు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సంఖ్య లేదు. ఆసరా పథకానికి కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.
ఆరేండ్లుగా ఎదురుచూపే..
భర్త చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యత నాపై పడింది. కూలినాలి చేసిన డబ్బులతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఆసరా పింఛన్‌ వస్తే కొంత చేదోడువాదోడుగా ఉంటుందని ఆశ పడ్డా. ప్రభుత్వం మా ఆశల మీద నీళ్లు చల్లింది. పింఛన్‌ కోసం ఎక్కనిమెట్టు లేదు. మొక్కని కాలు లేదు. ఎవరూ కరణించేవారు లేరు. అధికారులను అడిగితే మా చేతిలో ఏమీ లేదంటూ దాటవేస్తున్నారు. ఇగ ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఇప్పటికైనా సర్కారు మా గోస చూసి పింఛన్‌ మంజూరు చేయాలి.
- గాండ్ల శారద- నార్సింగ్‌ మున్సిపాలిటీ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.