Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2022

చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం

- ప్రశ్నోత్తరాల్లో మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై అధికార పార్టీ సభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, గొంగిడి సునీత, ముఠా గోపాల్‌ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మత్స్యకారులకు గ్రూప్‌ యాక్సిడెంట్‌ బీమాను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను మరిచిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ క్రమంలో అన్ని కులాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. దీంతో ఇప్పుడు చేపల ఎగుమతిలో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. చేపలతో పాటు రొయ్యల పెంపకాన్ని కూడా చేపట్టామన్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 150 సంచార వాహనాలను మత్స్యకారులకు అందించామని మంత్రి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.
డిప్యూటీ స్పీకర్‌కు, ఎమ్మెల్యే రసమయికి వాగ్వాదం
ప్రశ్నోత్తరాలలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. రసమయి ప్రశ్న అడుగుతుండగా మైక్‌ కట్‌ చేసి.. మరో ఎమ్మెల్యే గొంగిడి సునీతకి డిప్యూటీ స్పీకర్‌ మైక్‌ ఇచ్చారు. దీంతో ప్రశ్న అడగనివ్వకుంటే ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ను రసమయి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు మాత్రమే అడగకుండా స్పీచ్‌ ఇస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ ఆక్షేపించారు. ప్రశ్నలు తొందరగా అడగాలని పద్మారావు సూచించారు. రసమయి అసంతప్తిపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకోగా.. ఆయనపై సైతం ఎమ్మెల్యే అసంతప్తి వ్యక్తం చేశారు. సభలో మాట్లాడదామంటే మాట్లాడే అవకాశాలు రావనీ, కనీసం ప్రశ్నలు కూడా అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని రసమయి అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్న అడగకుండా మధ్యలోనే రసమయి కూర్చోగా, ప్రశ్న త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు సూచించడంతో ఆయన కొనసాగించారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం:మంత్రి మల్లారెడ్డి
రాష్ట్రంలోరిజిస్ట్రేషన్‌ చేసుకున్న12.60 లక్షల మంది కార్మికుల కోసం రూ. 1845 కోట్లు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి సిహెచ్‌.మల్లారెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యులు కొరుకంటి చందర్‌, నన్నపునేని నరేందర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రమాద బీమాను సైతం అమలుచేస్తున్నామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కనీస వేతనాలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కార్మిక చట్టాలు అమలుచేయాలనీ, ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుల ఒప్పందం అమలు ఎమ్మెల్యేలు కోరగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆరు ప్రశ్నలు వాయిదా
శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మొత్తం పది ప్రశ్నలకుగాను కేవలం నాలుగు ప్రశ్నలపై చర్చించారు. మిగతా ఆరు ప్రశ్నలను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు. వాయిదా వేసిన వాటిలో రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం, భూపాలపల్లి పట్టణానికి బైపాస్‌రోడ్డు, ఒఆర్‌ఆర్‌ సమీపంలోని గ్రామాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమం, రోడ్లను వెడెల్పు చేసేపనుల్లో అవరోధాల తొలగింపు, నూతనంగా ఏర్పడిన మండలాల్లో మండల కార్యాలయాల భవన సముదాయాలు నిర్మాణం తదితర ప్రశ్నలు వాయిదాపడిన వాటిలో ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.