Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాళ్ళు రోడ్లు బంద్‌ చేస్తే...మేం కరెంటు,నీళ్లు కట్‌ చేస్తాం... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2022

వాళ్ళు రోడ్లు బంద్‌ చేస్తే...మేం కరెంటు,నీళ్లు కట్‌ చేస్తాం...

- ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం
- కంటోన్మెంట్‌లో ఇష్టారాజ్యం కుదరదు
- ఆర్మీ అధికారులకు కేటీఆర్‌ హెచ్చరిక
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ
- హైదరాబాద్‌కు కేంద్ర పెద్దలు అర పైసా కూడా సాయం చేయలేదని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్‌ అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వారు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్‌ చేస్తే.. తాము కరెంట్‌, నీళ్లు బంద్‌ చేస్తామని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో శనివారం డిప్యూటీ స్పీకర్‌ టి. పద్మారావు అధ్యక్షతన ప్రారంభమైన ప్రశ్నోత్తరాల్లో కార్వాన్‌ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్‌, టీఆర్‌ఎస్‌ సభ్యులు కాలేరు వెంకటేశ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, దానం నాగేందర్‌, మాధవారం కృష్ణారావు, కె.పి.వివేకానంద్‌ తదితరు హైదరాబాద్‌లోని నాలాలు, వాటి అభివృద్ధి గురించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పారు. ఒక వైపు కంటోన్మెంట్‌లో చెక్‌ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతున్నది. శాతం తల చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్‌ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్‌ఐ అనుమతి ఇవ్వడం లేదు. ఒకవైపు కంటోన్మెంట్‌, మరోవైపు ఏఎస్‌ఐ అడ్డు పడుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వేరే దేశం అన్నట్టుగా కేంద్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నది. హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్‌ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇష్టమొచ్చినట్టు రోడ్లు బంద్‌ చేస్తాం..నాలాల మీద చెక్‌ డ్యాంలు కడతామంటే మేం కూడా ఊరుకోం అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. అవసరమైతే మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరారా? అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దనీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను ఈవిషయం సభలో చెబుతున్నానని అన్నారు. పైసా సాయం చేయరు కానీ, పని చేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కలిగించడం కలిగిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లో రూ. 985 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ పనులు : మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివద్ధి(ఎస్‌ఎన్‌డీపీ) కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ కింద రూ. 985.45 కోట్ల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని గుర్తు చేశారు. మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లో మూడు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించాం. ఎంసీహెచ్‌లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు లేవు. శివారు ప్రాంతాలకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ చేయాలని నిర్ణయించాం. మొత్త మూడు దశలకు రూ. 11 వేల కోట్లతో హైదరాబాద్‌ సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ చేసినట్టు చెప్పారు. వరద నీటి కాల్వలు, మురికి నీటి కాల్వలు కలిసిపోయాయి. నాలాల మీద అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఎస్‌ఎన్‌డీపీ ద్వారా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఏరియాలో రూ. 735 కోట్లతో, జీహెచ్‌ఎంసీ వెలుపల రూ. 250 కోట్లతో 60 పనులను చేపట్టామని చెప్పారు. ఈ పనులపై ప్రతి వారం తానే సమీక్షిస్తున్నానని తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి ఈ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ఎస్‌ఎన్‌డీపీ పనుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు తిరిగి, ఫోటోలకు ఫోజులిచ్చారు.. కానీ నిధులు మాత్రం ఇవ్వలేదు. గుజరాత్‌కు మాత్రం రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకపోవడం అనేది నిజంగా సిగ్గు పడాల్సిన విషయమన్నారు. హైదరాబాద్‌కు కేంద్ర పెద్దలు అర పైసా కూడా సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కలుషిత నీటిని తాగి భోలక్‌పూర్‌లో 11 మంది మతి చెందారని కేటీఆర్‌ గుర్తు చేశారు.
కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం: మంత్రి కేటీఆర్‌
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కు వరద సహాయం చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రికి కూడా మనసు రావడంలేదన్నారు. కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదష్టమన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.