Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటి పన్నులోవడ్డింపు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2022

ఇంటి పన్నులోవడ్డింపు

- ఖమ్మం నగరపాలక సంస్థలో సైలెంట్‌గా దోపిడీ
- సకాలంలో చెల్లించినా ప్రస్తుత మొత్తంపై వడ్డీ
- నోటీసులు, మెసేజ్‌లు లేకుండా వసూళ్ల పర్వం
- ఒక్కో ఇంటికి రూ.100కు పైన కాజేస్తున్న వైనం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ముస్తఫానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రతి ఏడాదీ కచ్చితంగా మార్చి నెలలో సకాలంలో ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఇంటి పన్ను వసూళ్లకు ముందు ఎంత పన్ను చెల్లించాలో నోటీసు లేదా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చేది. ఈ సంవత్సరం అలాంటివేవీ లేకపోవడంతో డివిజన్‌లో హడావుడి చూసి ఇంటి పన్ను గురించి తెలుసుకుని సమీపంలోని పన్ను చెల్లింపు కేంద్రం వద్దకు వెళ్లారు. ఇంటి నంబర్‌, సెల్‌ఫోన్‌ నంబర్‌ చెప్పగానే రశీదు తీసి ఇచ్చారు. ఆయన బిల్లుపై వివరాలేవీ పరిశీలించకుండా రూ.1785 ఇంటి పన్ను చెల్లించాడు. ఆ తర్వాత బిల్లు పరిశీలించగా బకాయి సున్నా అని ఉంది. ప్రస్తుత మొత్తం రూ.1684, దానిపై వడ్డీ రూ.101 అని ఉంది. సకాలంలో చెల్లించినప్పుడు వడ్డీ ఎందుకు వేశారని ప్రశ్నిస్తే.. అదంతే అని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దాంతో ఆయన చేసేదేమీ లేక వెళ్లిపోయాడు. శ్రీనివాసనగర్‌లో మరొకరికి ఇంటి పన్ను రూ.2,200 వస్తే ప్రస్తుత మొత్తంపై వడ్డీ రూ.300 అని సూచించారు. ఆయనకు కూడా బకాయిలు లేవు. బకాయి లేనప్పుడు వడ్డీ ఎందుకు వేశారని సిబ్బందిని ఇతను నిలదీశారు. 'మిషన్‌లో ఎలా ఫీడ్‌ అయ్యి ఉంటే ఆ బిల్లు ఇవ్వడమే మా పని' అని సమాధానం ఇచ్చారు. ఎలాంటి బకాయి లేనప్పటికీ రూ.100 మొదలు రూ.1000కి పైగా మొత్తం పన్నుపై వడ్డీ పేరుతో కార్పొరేషన్‌లో తెలియని దోపిడీ చేస్తున్నట్టు వినియోగదారులు వాపోతున్నారు.
రూ.కోట్లలో 'వడ్డి'ంపు
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో 20 కేంద్రాల ద్వారా 70,263 నిర్మాణాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. వీటిలో 242 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలున్నాయి. ఇవి మినహా నివాస గృహాలు 63,138, కమర్షియల్‌ బిల్డింగ్‌లు 3,266, పాక్షిక నివాస/ నివాసేతర గృహాలు 3,580. మొత్తం 69,984 వరకూ ఉన్నాయి. ఈ నిర్మాణాల యజమానులు 70% మందికి పైగా ప్రతియేటా సకాలంలో పన్నులు చెల్లిస్తున్నారు. వీరిలో కొందరిని మినహాయించి మరికొందరికి బకాయి లేనప్పటికీ ప్రస్తుత మొత్తంపై వడ్డీ వేశారు. వీరిలో వడ్డీ వేయని వారు 20వేల వరకు ఉన్నా.. మిగిలిన 50వేల మందికి ఒక్కో నిర్మాణానికి సగటున రూ.300 చొప్పున వడ్డీ వసూలు చేసినా దాదాపు రూ.కోటికి పైగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే పన్ను భారంతో అవస్థ పడుతున్న నగర వాసుల నుంచి అడ్డదారిలో సైలెంట్‌గా చేస్తున్న దోపిడీపై కౌంటర్ల వద్ద ప్రజలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
సమాచారం లేకుండా ట్యాక్స్‌ వసూళ్లు
బకాయి ఉన్న వారికి మాత్రమే నోటీసులు, సెల్‌ఫోన్‌ మెసేజ్‌లు చేసిన కార్పొరేషన్‌ సిబ్బంది.. బకాయి లేని వారికి మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం డివిజన్లలో మైకుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటి యజమానులు గమనించి పన్ను చెల్లిస్తే సరి. లేదంటే బకాయి పేరుతో వడ్డీ వాయించే కుటిల యత్నాలు కార్పొరేషన్‌ నుంచి సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. నోటీసులు, మెసేజ్‌ వంటివేవీ పంపకపోవడంపై కార్పొరేషన్‌ అధికారులను ప్రశ్నిస్తే.. కరోనా కారణంగా నోటీసులు పంపలేదంటున్నారు. ఈ విషయమై కమిషనర్‌, మేయర్‌లను 'నవతెలంగాణ' నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు. ఫోన్‌లో సంప్రదించగా మీటింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.

వడ్డీ వేయడాన్ని ఖండిస్తున్నాం

ఇప్పటికే ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్‌ బిల్లుల భారంతో ప్రజలు సతమతమవుతుంటే.. అది చాలదన్నట్టు ఇంటి పన్ను బకాయి లేకున్నా ప్రస్తుత మొత్తంపై వడ్డీ పేరుతో ప్రజలను పీడించడం సరికాదు. అక్రమ పద్ధతిలో దోపిడీకి పాల్పడితే ఊరుకునేది లేదు. ఈ అడ్డదారి వసూళ్లను ఆపకపోతే ఆందోళనలు నిర్వహిస్తాం.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం)
ఖమ్మం జిల్లా కార్యదర్శి

సకాలంలో చెల్లించినా వడ్డీ వేయడం సరికాదు
మాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. ఇంటి పన్ను కట్టించుకుంటున్నారని తెలిసి వచ్చి కడుతున్నాం. ఇంతకుముందు నోటీసులు, మెసేజ్‌లు పంపించే వారు. ఇప్పుడు అవేవీ లేవు. సకాలంలో చెల్లించినా ప్రస్తుత మొత్తంపై వడ్డీ అని రూ.1684కి రూ.1785 కట్టించుకున్నారు. సకాలంలో పన్ను చెల్లించినా వడ్డీ వేయడం సరికాదు. పైగా నల్లా కనెక్షన్‌ ఇవ్వకుండానే పన్ను వసూలు చేస్తున్నారు.
- మన్మథబాబు, ముస్తఫానగర్‌- 22వ డివిజన్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.