Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రయివేట్‌ ఆస్పత్రుల కోసమే ...ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 14,2022

ప్రయివేట్‌ ఆస్పత్రుల కోసమే ...ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ

- విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
- ప్రజారోగ్య పరిరక్షణ ఉద్యమంలో వెన్నంటి ఉంటా...
- సీఎంతో సహా ప్రజా ప్రతినిధులందరూ ప్రభుత్వాస్పత్రికే వెళ్లాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమని చెబుతున్న ఆరోగ్యశ్రీ పథకాలు రెండూ ప్రయివేటుకు లాభం చేకూర్చేందుకే ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీ పథకం ... నా పథకం అనేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కేంద్రం వైద్యానికి గ్రాంటు రాష్ట్రానికి గ్రాంటు ఇవ్వాలని సూచించారు. విద్య, వైద్యాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తేనే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రయివేటు ఆస్పత్రులు సేవలందించేందుకు నిరాకరిస్తే ప్రజల ప్రాణాలను కాపాడింది ప్రభుత్వాస్పత్రులేనని గుర్తుచేశారు. ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లు కరోనా నుంచే కాక కరోనా భయం నుంచి ప్రాణాలను కాపాడారనీ, లేకుంటే ఇంకా అనేక మంది ప్రజల చనిపోయే వారని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్యసంఘాలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ డిమాండ్ల సాధన కోసం శాసనమండలిలో, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన వంతుగా ప్రయత్నిస్తాననీ హామీ ఇచ్చారు.
             ఆదివారం హెల్త్‌ రిఫార్స్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ డాక్టర్స్‌ ఫోరం, కాంట్రాక్ట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, టీఇఏ - డాక్టర్స్‌ ఫోరం, తెలంగాణ స్టేట్‌ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, ప్రొగ్రెసివ్‌ డాక్టర్స్‌ ఫోరం, నర్సింగ్‌ అసోసియేషన్‌, పారామెడికల్‌ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రజారోగ్య పరిరక్షణ సభ జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ప్రజా ప్రతినిధులందరు ప్రభుత్వాస్పత్రులోనే చికిత్స తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో విద్య, వైద్యం అత్యధికంగా ప్రయివేటు రంగంలో ఉన్నది తెలంగాణలోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల తాను క్షేత్రస్థాయిలో పర్యటించాననీ, అనేక చోట్ల డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. బస్తీ దవాఖానాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పెరిగిన జనాభాకు తగినట్టు యూపీహెచ్‌సీల సంఖ్య పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను కనీసం 1,100కు పెంచాలనీ, ఒక్కో కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఆరు నుంచి ఏడు మంది నర్సులు, ఇతర సిబ్బందితో నడిపించాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని వెంటనే నిర్మించాలన్నారు. వైద్యారోగ్యశాఖ నిధులను బడ్జెట్‌లో ఎనిమిది శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు.
             రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన డాక్టర్లను మెడికల్‌ కాలేజీల్లో వాడుకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మెడికల్‌ కాలేజీలకు ప్రొఫెసర్లు దొరికే పరిస్థితి లేదనీ, నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలను కాపాడిన తాత్కాలిక, ఇతర సిబ్బందిని యధావిథిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. తనకు అవకాశమొస్తే డాక్టర్ల వేతనాలను పెంచుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రయివేటు ఆస్పత్రుల పాత్రను గణనీయంగా తగ్గించి ప్రభుత్వాస్పత్రులను పెంచాలని డిమాండ్‌ చేశారు. డీఎంఇ, డీహెచ్‌ స్థానాల్లో ఇన్‌ఛార్జీలను కొనసాగించడం సరికాదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు.
             బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ తదితర పథకాలకు నిదులిచ్చిన వాడుకోలేని స్థితిలో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారుందని విమర్శించారు. లొసుగులు బయటపెట్టకూడదనే డీఎంఇగా డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డిని కొనసాగిస్తున్నారనీ, అదే విధంగా అవినీతి ఆరోపణలో విజిలెన్స్‌ రిపోర్ట్‌ ఇచ్చినప్పటికీ డీహెచ్‌గా డాక్టర్‌ జి.శ్రీనివాసరావును కొనసాగిస్తున్నారని విమర్శించారు.
హైకోర్టు అడ్వకేట్‌ మహ్మద్‌ సాధిక్‌ అలీ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అవసరమైతే దీనిపై పిటీషన్‌ వేస్తానని హెచ్చరించారు. మెడికల్‌ జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ బి.రమేశ్‌ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ మాట్లాడుతూ, ప్రపంచంలోనే వైద్యానికి అతి తక్కువగా ఖర్చు పెడుతున్న దేశం భారతదేశమని విమర్శించారు. అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందేలా తక్కువ ఖర్చుతో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ పీ.ఎల్‌.విశ్వేశ్వర్‌ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ బాబురావు, నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌, హెచ్‌ఆర్‌డీఏ అధ్యలు డాక్టర్‌ కె.మహేష్‌, తెలంగామ జుడా అధ్యక్షులు డాక్టర్‌ సాగర్‌, నాయకులు డాక్టర్‌ రాజీవ్‌, డాక్టర్‌ వంశీ, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ సంపత్‌ రావు, నాయకులు డాక్టర్‌ అశోక్‌ రెడ్డి, డాక్టర్‌ దీన్‌ దయాళ్‌ సింగ్‌, తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ డాక్టర్స్‌ ఫోరం నాయకులు డాక్టర్‌ పురుషోత్తం పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.