Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంత్రులకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల సెగ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 14,2022

మంత్రులకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల సెగ

- వైరాలో అర్ధాంతరంగా ముగిసిన సభ
- పనిలో చేర్చుకోవాలని డిమాండ్‌
- పోలీసులకు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మధ్య తోపులాట
నవతెలంగాణ-వైరా
                  ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో ఘనంగా నిర్వహించాలని అనుకున్న సభకు ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆగ్రహం బ్రేక్‌ వేసింది. మంత్రులు తమ ఉపన్యాసాన్ని కొనసాగించలేనంతగా ఆందోళన చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఇండోర్‌ స్టేడియం, స్పీడ్‌ బోట్ల ప్రారంభానికి హాజరైన మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, పువ్వాడ అజరు కుమార్‌ను 'ఉపాధి హామీ చట్టం' ఫీల్డ్‌ అసిస్టెంట్లు అడ్డుకొని తీవ్ర నిరసన తెలిపారు. ఇండోర్‌ స్టేడియం ప్రారంభం అనంతరం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అధ్యక్షతన జరుగుతున్న సభలో ప్రసంగించేందుకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ లేవగానే, జిల్లా వాప్త్తంగా తరలివచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులను పైకి లేపి నినాదాలు చేశారు. తమను పనిలో చేర్చుకోవాలని, తమను రోజ్‌ గార్‌ సేవక్‌గా పరిగణించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి ప్లకార్డులను లాక్కొని చింపి వేశారు. దాంతో పోలీసులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మధ్య తోపులాట జరిగింది. దాంతో మంత్రి చెప్పిన నాలుగు మాటలూ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ అర్ధాంతరంగా ఉపన్యాసం ఆపేసి వెళ్ళిపోయారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆందోళనను అదుపు చేసేందుకు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టేడియం ఖాళీ అయ్యేంత వరకూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అక్కడే ఉండటం వారిలో ఉన్న ఆవేదనకు అద్ధం పడుతోంది.
వైరా ఏసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో వైరా సీఐ తాటి పాముల సురేష్‌ వైరా, తల్లాడ, కొణిజర్ల ఎస్‌ఐలు సిబ్బందితో బందో బస్త్‌ ఏర్పాటు చేసినా ఫీల్డ్‌ అసిస్టెంట్లు వ్యూహాత్మంగా సభలో ప్రవేశించి సభను రద్దు చేసుకుని వెళ్ళే స్థాయిలో నిరసనలు తెలపటం కూడా నాయకుల ఆగ్రహానికి కారణంగా భావిస్తున్నారు.
స్థానిక నాయకులపై ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం
                  మంత్రుల సభ అర్ధాంతరంగా ముగియటం, మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ను హోలీ పండుగ మామూళ్ల కోసం లంబాడీ గిరిజన మహిళలు చుట్టుముట్టడం, వేదికపై చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా రసాభాస కావటంతో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌ స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి ఎవరోస్తున్నారు.. ఎందుకు వస్తున్నారో చూసుకోవద్దా.. తామంతా పార్టీ కోసం రేయంబవళ్ళు కష్టపడుతుంటే మీరేం చేస్తున్నారని పరుష పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు.సభలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, పువ్వాడ అజరు కుమార్‌, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మెన్‌ కొండ బాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మెన్‌ కూరాకుల నాగభూషణం, మార్క్‌ ఫెడ్‌ వైస్‌ చైర్మెన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ సూతకాని జైపాల్‌, జిల్లా కలెక్టర్‌ విపి గౌతమ్‌, ఎంపీడీఓ ఎన్‌.వెంకటపతి రాజు, తహసీల్దార్‌ అరుణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.