Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెద్దల సభ ఔన్నత్యాన్ని పెంచుతా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 15,2022

పెద్దల సభ ఔన్నత్యాన్ని పెంచుతా

- అందరికీ మాట్లాడే అవకాశమిస్తా:మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
- మంత్రులు, ఎమ్మెల్సీల అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
               శాసనమండలి చైర్మెన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం చైర్మెన్‌ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ ప్రకటించారు. తొమ్మిది సెట్ల నామినేషన్లు ఆయన ఒక్కరే దాఖలు చేశారని వివరించారు. సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి తోడ్కొని వెళ్లి చైర్మెన్‌ స్థానంలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రోత్సహించిన మంత్రులు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు చెప్పారు. పెద్దల సభ ఔన్నత్యాన్ని పెంచుతానని చెప్పారు. ప్రజాసమస్యలపై అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తానని అన్నారు. చట్టసభలు దేశానికే తలమానికమన్నారు. మొదటిసారి చైర్మెన్‌గా 21 నెలలు పనిచేశానని వివరించారు. అందరి సహకారంతో సభ హుందాతనాన్ని పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీనియర్ల సహకారంతో జూనియర్లు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా, అర్థవంతమైన చర్చలు జరిపి శాసనమండలి ప్రతిష్టను మరింత పెంచుకోవాలని అన్నారు. అనంతరం మంగళవారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేశారు. అంతకుముందు రెండోసారి చైర్మెన్‌గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందిస్తూ మాట్లాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ముగ్గురూ రైతుబిడ్డలే : కేటీఆర్‌
               సీఎం కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముగ్గురూ రైతుబిడ్డలే కావడం అందరికీ గర్వకారణమని మంత్రి కేటీ రామారావు చెప్పారు. గుత్తా 1981లో వార్డుమెంబర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారని అన్నారు. కేసీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కృష్ణా జలాలు ఇంటింటికీ అందించినప్పుడే ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారమని సుఖేందర్‌రెడ్డి గతంలోనే ప్రకటించారని వివరించారు. అందులో భాగంగానే మిషన్‌ భగీరథ పైలాన్‌ను చౌటుప్పల్‌లో ఆవిష్కరించామని గుర్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ సమస్య లేదంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించారని అన్నారు. ఆయన రైతు సమన్వయ సమితి మొదటి చైర్మెన్‌గా వ్యవహరించారని చెప్పారు. ప్రతిపక్షాలు, అధికారపక్షం అన్న తేడా లేకుండా ప్రజాస్వామికంగా పనిచేయాలని సూచించారు. దామాషా ప్రకారం సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతిరాథోడ్‌, టి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం అందరికీ ఎంతో ఆదర్శమని చెప్పారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో ఉన్నారని అన్నారు. సభను హుందాగా నడపాలని కోరారు. 'మీ మనసులో ఒకటుంది. అది కావాలని కోరుకుంటున్నారు. కానీ దాని కంటే ఉన్నతమైన పదవిలో సీఎం కేసీఆర్‌ మిమ్మల్ని కూర్చోబెట్టారు.'అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ హౌజ్‌ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సూచనలి స్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు.
ప్రతిపక్షాలకు ఎక్కువ సమయమివ్వాలి : నర్సిరెడ్డి
               ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రజాసమస్యలు ఎక్కువగా చర్చకు వస్తాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పెద్దల సభ నడుస్తున్నదని అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి మండలిని మార్చాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గంగాధర్‌గౌడ్‌ సూచించారు. ఎమ్మెల్సీలకు శిక్షణా కార్య క్రమాలు నిర్వహించాలనీ, ఇతర రాష్ట్రాల్లో చట్టసభల పనితీరును పరిశీలించేం దుకు సభ్యులను తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని వార్డు సభ్యులంతా స్ఫూర్తి పొందేలా సుఖేందర్‌రెడ్డి రాజకీయ అను భవం ఉందన్నారు. ఆయన రెండోసారి చైర్మెన్‌ కావడం అభినందనీయమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండ ప్రకాశ్‌, ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎల్‌ రమణ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.