Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గత వైఫల్యాల వల్లే విదేశాలకు వైద్య విద్యార్థులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 15,2022

గత వైఫల్యాల వల్లే విదేశాలకు వైద్య విద్యార్థులు

- ఆరోగ్య రాజధానిగా తెలంగాణ
- కొత్తగా 33 మెడికల్‌ కాలేజీలు
- నిమ్స్‌లో మరో రెండువేల బెడ్స్‌ ఏర్పాటు
- 20వేల ఖాళీలు భర్తీ చేస్తాం :అసెంబ్లీలో ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గత ప్రభుత్వాలకు ముందుచూపు లేనందువల్లే మెడిసిన్‌ చదివే విద్యార్థులు చైనా, ఉక్రెయిన్‌, రష్యా వంటి దేశాలకు వలసలు వెళ్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయనీ, స్వరాష్ట్రంలో వాటి సంఖ్యను 33కు పెంచుతున్నామని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వరంగంలోనే ఏర్పాటవుతాయని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 700 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు వాటి సంఖ్య 2,850కి పెరుగుతుందని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే 8 కొత్త మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, మర్రి జనార్థన్‌రెడ్డి, ఎం సంజరు, బానోతు శంకర్‌ నాయక్‌, గాదరి కిషోర్‌కుమార్‌ ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం 171 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేసిందనీ, రాష్ట్రానికి కూడా ఇవ్వాలని ప్రతిపాదనలు పంపితే, వాటిని తిరస్కరించి అన్యాయం చేశారని అన్నారు. ఒక్కో మెడికల్‌ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తుందనీ, ఆ నిధుల వస్తాయని ఆశించి, భంగపడ్డామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పల్లె, బస్తీ దవాఖానాల ఏర్పాటుతో ఐదంచెల ఆరోగ్య వ్యవస్థను నిర్మించామన్నారు. నిమ్స్‌ అస్పత్రిలో ప్రస్తుతం 1,450 పడకలు ఉన్నాయనీ, వాటికి అదనంగా మరో రెండువేల బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంద పడకలు మరో వారంరోజుల్లో అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వైద్యారోగ్య శాఖలో 20వేల ఖాళీలను గుర్తించామనీ, త్వరలో వాటిని భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశంపార్టీలకు ముందుచూపు లేనందువల్లే రాష్ట్ర విద్యార్థులు చైనా, ఉక్రెయిన్‌ వంటి విదేశాల్లో డాక్టర్‌ విద్యను అభ్యసించేందుకు వెళ్తున్నారని చెప్పారు. పీజీ సీట్ల సంఖ్యను 530 నుంచి 938కి పెంచామన్నారు. మెడికల్‌ కళాశాలల్లో విద్యార్థుల ప్రయోగాలకు మృతదేహాల కొరత ఉన్నదనీ, హౌంశాఖ చట్ట సవరణతో ఆ ఆవరోధాన్ని అధిగమించవచ్చనీ, త్వరలో దాన్ని చేపడతామని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో బస్తీ దవాఖానాల ఏర్పాటుపై సభ్యులు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, బీగాల గణేష్‌, ఆరూరి రమేష్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు కూడా మంత్రి సమాధానాలు చెప్పారు. గ్రేటర్‌ పరిధి, ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపలి ప్రాంతాల్లో మొత్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామనీ, దానిలో 259 ఏర్పాటయ్యాయని తెలిపారు. మరో 92 త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ, పల్లె దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. ఒక్కో బస్తీ దవాఖానాపై ప్రభుత్వం రూ.75వేలు ఖర్చు చేస్తున్నదనీ, ఒక డాక్టర్‌, స్టాఫ్‌ నర్స్‌, హెల్పర్‌ అక్కడ ఉంటారనీ, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు బస్తీ దవాఖానాల ద్వారా 81 లక్షల మందికి సేవలు అందించామనీ, వాటికే టెలీమెడిసిన్‌, కన్సల్టేషన్‌ సేవల్ని అనుసంధానిస్తూ, టీ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.