Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అ(వ)రి గోస.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 16,2022

అ(వ)రి గోస..

- ఉమ్మడి కరీంనగర్‌లో 2.50లక్షల ఎకరాలపైనే బీడు..
- జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా వరి సాగుకు దూరం
- ఎస్సారెస్పీ నీళ్లందక ఎండుతున్న చి'వరి' మళ్లు
- ఎల్లంపల్లి, మిడ్‌మానేరు నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు..
- బ్యాక్‌వాటర్‌పై ఆధారపడిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకం
- వరదకాల్వల నీళ్లు లేక ఆయకట్టు రైతుల అవస్థలు
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
             వరి వెతలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్నాళ్లూ సరిపడా నీళ్లు.. అత్యధికంగా సాగైన వరిమళ్లు.. ప్రతి గ్రామంలోనూ సమయానికి సాగిన సర్కారు కొనుగోళ్లతో సాగు సస్యశ్యామలంగా సాగుతూ వచ్చింది. ఒక్కసారిగా ప్రభుత్వం యాసంగి వరి వేయొద్దని చెప్పడం, ఈ యేడాది ధాన్యమే కొనబోమని ప్రకటించడం ఫలితంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏకంగా 2.53లక్షల ఎకరాల్లో సాగు తగ్గించి బీడుగా వదిలేశారు. ఇదే సమయంలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు తరలించడంతో ఆ ప్రాజెక్టుల బ్యాక్‌వాటర్‌పై ఆధారపడిన వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సారెస్పీ కాలువల్లోనూ అడపాదడపా వదులుతున్న వారబందీ నీళ్లు సరిపోక చి'వరి' ఆయకట్టుల్లో సుమారు 12వేల ఎకరాలు ఎండుముఖం పడుతోంది. కనీసం వరద కాల్వలలోనూ నీళ్లు లేక దాని ఆయకట్టూ ప్రశ్నార్థకంగా మారింది. ఐదేండ్లుగా యాసంగి వరి సాగు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. పదేండ్ల కిందట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2.5లక్షల ఎకరాల్లో సాగైన వరి ఏయేటికాయేడు పెరుగుతూ గత యాసంగిలో 11లక్షల ఎకరాల్లో సాగైంది. అంత పెద్ద మొత్తంలో వరి వైపు మొగ్గుచూపిన రైతులు.. ఈ ఏడాది 2.53లక్షల ఎకరాల్లో తగ్గించారు. అందులో జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా వరి విస్తీర్ణం తగ్గించారు. గతేడాది యాసంగిలో 2లక్షల 93వేల 823 ఎకరాల్లో
వరి సాగు చేసిన జగిత్యాల జిల్లా రైతులు ఈ ఏడాది లక్షా 65వేల 584 ఎకరాల్లో మాత్రమే వేశారు. లక్షా 28వేల 239 ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గించారు. ఇదే పరిస్థితి మిగతా జిల్ల్లాల్లోనూ ఉంది. కరీంనగర్‌ జిల్లాలో గతేడాది 2లక్షల 60వేల 172 ఎకరాల్లో వరి సాగవగా.. ఈ యాసంగిలో 2లక్షల 12వేల 443 ఎకరాల్లో తగ్గింది. అంటే సుమారు 47వేల 729 ఎకరాల్లో వరి సాగు తగ్గింది. పెద్దపల్లి జిల్లాలో గతేడాది లక్షా 91వేల 313 ఎకరాల్లో సాగవగా.. ఈ యాసంగిలో లక్షా 67వేల 239 ఎకరాల్లో సాగైంది. ఈసారి 18వేల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతేడాది లక్షా 66వేల 464 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది లక్షా 18వేల 893 ఎకరాల్లో సాగు చేశారు. ఈ జిల్లాలో 47571 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గించారు.
చి'వరి' మళ్లు ఎండుముఖం
             ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని జగిత్యాల జిల్లాలో ఈసారి 2.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఆయకట్టు కింద అత్యధికంగా సుమారు 2.45లక్షల ఎకరాల్లో వరి వేశార. అయితే, ప్రాజెక్టు నుంచి వారబందీ కింద నీళ్లు ఇస్తుండటంతో చివరి ఆయకట్టులోని సుమారు 12 వేల ఎకరాల్లో పైరు ఎండుతోంది. ప్రధానంగా కొడిమ్యాల, సారంగాపూర్‌, కథలాపూర్‌, మల్యాల, మేడిపల్లి మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌పై ఆధారపడిన ధర్మపురి నియోజకవర్గంలోని రాయపట్నం, ధర్మపురి, కోటిలింగాల, అటు మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌ సహా వరి సాగు చేస్తున్న రైతులకు సరిపడా నీళ్లు లభించడం లేదు. ఈ యాసంగిలో అటు ఎల్లంపల్లి, ఇటు మధ్యమానేరులో నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు రిలీజ్‌ చేయడంతోనే ఆ రెండు ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గి స్థానికంగా ఉన్న కొన్ని బోరుబావులు ఒట్టిపోయాయి. దీంతో పైన చెప్పిన మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పైరు ఎండుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వదర కాల్వల ద్వారా కూడా నీటిని బంద్‌ చేయడంతో ఆ కాలువను ఆధారం చేసుకుని కరీంనగర్‌ జిల్లాలో వరి సాగవుతున్న గంగాధర, బోయిన్‌పల్లి మండలాల్లోని రైతులకూ సాగు నీరు అందడం లేదు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు ఈ ఏడాది ఎల్లంపల్లి నుంచి నీటిని బంద్‌ చేయడంతో లెఫ్ట్‌ కెనాల్‌ కింద ఉన్న గంగాధర మండలంలోని బూరుగుపల్లి, చర్లపల్లి(ఆర్‌), ర్యాలపల్లి, కొండయ్యపల్లి, కాచిరెడ్డిపల్లి, కొడిమ్యాల మండలం నర్సింహులపల్లి, మల్యాల మండలం బలవంతపూర్‌ గ్రామాల్లో వరిని కాపాడుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నారు. మరికొంత ఆ సాహసమూ చేయలేక పశువుల మేతకు వదిలేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.