Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్పులు చెల్లించటానికి మళ్లీ అప్పులు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 16,2022

అప్పులు చెల్లించటానికి మళ్లీ అప్పులు..

- 75 శాతానికి పైగా రుణాలు ఇందుకోసమే...
- లక్ష్యాల పరిమితి కంటే బడ్జెటేతర రుణాలే ఎక్కువ
- ఐదేండ్లలో రూ.84,650 కోట్ల అధిక వ్యయం
- 2019-20లో కేటాయింపులు లేకుండానే రూ.2,084 కోట్లు ఖర్చు
- రూ.1,800 కోట్ల మేర పెరిగిన వడ్డీ చెల్లింపులు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన కాగ్‌
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక స్థితిగతులపై నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
               రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే అప్పులు చేస్తున్నామంటూ ప్రభుత్వాధినేతలు చెబుతుండగా... అందుకు భిన్నంగా చేసిన అప్పులను తిరిగి చెల్లించటానికే సర్కారు మళ్లీ మళ్లీ అప్పులు చేస్తోందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆక్షేపించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా గతంలోని అప్పులను తిరిగి చెల్లించటానికే వినియోగించారని తేల్చి చెప్పింది. ఆస్తుల కల్పన మీద దీని ప్రభావం స్పష్టంగా కనబడిందని తేటతెల్లం చేసింది. ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎమ్‌) చట్టం ప్రకారమే రుణాలను స్వీకరిస్తున్నా... బడ్జెటేతర (మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వగైరా కార్పొరేషన్ల పేరిట తీసుకున్నవి) అప్పులను పరిగణనలోకి తీసుకుంటే అవి లక్ష్యాల పరిమితి కంటే ఎక్కువగానే ఉంటున్నాయని విశదీకరించింది. ద్రవ్యలోటులో 97 శాతాన్ని ప్రభుత్వం మార్కెట్‌ రుణాల ద్వారానే సమకూర్చుకుంటున్నదని వివరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020 మార్చితో ముగిసింది) సంబంధించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ రూపొందించిన నివేదికను మంగళవారం శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ యేడాదిలో ఆస్తుల కల్పన మీద సర్కారు దృష్టి సారించలేదని రిపోర్టులో కాగ్‌ పేర్కొంది. సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటంలో జాప్యం వల్ల భారీ స్థాయిలో మూలధన నిధులు చిక్కుకుపోయారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, డిస్కాములతో చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విధంగా (ఉదరు పథకం కింద డిస్కాములకు చెందిన నష్టాలను స్వీకరింటానికి సంబంధించి) తాను చెల్లించాల్సిన రూ.4,063.65 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తీర్చలేదని గుర్తు చేసింది. మరోవైపు ప్రస్తుత చెల్లింపులు.. రానున్న సంవత్సరాలకు వాయిదా పడగా, ఉదరు పథకం ద్వారా ఆశించిన విధంగా డిస్కాములను ఆర్థికంగా పటిష్ట పరచలేదని పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న ప్రజారుణం అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2019-20 నాటికి 18.04 శాతానికి పెరిగిందని కాగ్‌ వివరించింది. సర్కారు చెల్లించాల్సి ఉన్న మొత్తం ప్రజా రుణంలో దాదాపు సగభాగాన్ని (46 శాతం) రానున్న ఏడేండ్లలో తీర్చాల్సి ఉంటుందని పేర్కొంది. చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వనరులను పెంచుకోవాలని సూచించింది. వార్షిక పద్దు పత్రాల్లో తగిన రీతిలో పొందుపరచకుండానే బడ్జెటేతర అప్పుల రూపంలో వివిధ సంస్థల నుంచి రూ.71,131.63 కోట్లను సర్కారు తీసుకున్నదని వివరించింది. 2020 మార్చి చివరి నాటికి ఈ గణాంకాలు నమోదయ్యాయని స్పష్టం చేసింది. ఇందులో కేవలం ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే రూ.16,077.04 కోట్ల అప్పులు తీసుకున్నారని తెలిపింది. వీటన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన్నే ఉందని వివరించింది. ఇలాంటి చర్యలు శాసనసభ పర్యవేక్షణ పాత్రను, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను పలుచన చేస్తాయని హెచ్చరించింది. తద్వారా కీలమైన ప్రభుత్వ సామాజిక, ఆర్థిక పథకాలకు నిధులు, ప్రధాన వనరుల మీద శాసనసభ నియంత్రణ లేకుండా పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గత కొన్నేండ్లుగా శాసనసభ సాధికారిక ఆమోదానికి మించి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అధిక వ్యయం చేస్తోందని కాగ్‌ ఆక్షేపించింది. ఇది అత్యంత ఆందోళనకరమని పేర్కొంది. ఈ విధంగా గత ఐదేండ్లలో రూ.84,650 కోట్ల మేర అధిక వ్యయం చేశారని వివరించింది. దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. 2019-20లో బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే రూ.2,084.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందనీ, ఇది శాసనసభ సాధికారితను తక్కువ చేసినట్టేనని అక్షింతలేసింది. దీంతోపాటు 2021 మార్చితో ముగిసిన (2020-21) ఆర్థిక సంవత్సరానికి సైతం కాగ్‌ సమర్పించిన నివేదికను శాసనసభ, మండలిలో మంగళవారం ప్రవేశపెట్టారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.