Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ ప్రశ్నలకు సమాధానంతోనే సమతారాజ్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 17,2022

ఆ ప్రశ్నలకు సమాధానంతోనే సమతారాజ్యం

 ఎల్లలు లేకుండా కొనసాగుతున్న పురుషాధిపత్యం
- పుస్తకమంటే మనిషుల జీవితం ఉండాలి
- మట్టి, చెమట, నెత్తురుతో తడవాలి
- కవిత్వమంటే యూనికోడ్‌లో అభిప్రాయాలు చెప్పడం కాదు
- : జవాబుకావాలి పుస్తకావిష్కరణలో జూలూరి గౌరీశంకర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            'తప్పకుండా జవాబు కావాలి. ఇది సమాజానికి సలీమ వేస్తున్న ప్రశ్న. సామాజికమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే సమసమాజం, సమతారాజ్యం వస్తుంది. సమతారాజ్యంలో ఆకాశంలో సగభాగం ఉన్న వారు సరైన పాత్ర పోషించినప్పుడే మనం సమ భావనవైపు వెళ్లగలుగుతాం.'అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌ అన్నారు. సలీమ కవిత్వం 'జవాబుకావాలి' పుస్తకాన్ని ఆమె తల్లి ఐద్వా రంగారెడ్డి జిల్లా నాయకులు ఎస్‌కె మస్తాన్‌బి బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో రోజూ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతుంటాయని చెప్పారు. మనుషుల జీవితం ఉన్న పుస్తకాలు మట్టి, మట్టి తడి, చెమట, నెత్తురుతో తడిసిన పుస్తకాలు అరుదుగా వస్తాయన్నారు. అవన్నీ కలిసినప్పుడే కొడవళ్లకు పదున్లొస్తాయనీ, అవి కంకికొడవలి, సుత్తి కొడవలి అవుతాయని వివరించారు. అలాంటి పుస్తకాలు ఊరికే రావని అన్నారు. పుస్తకం రచించడమంటే సెల్‌ఫోన్‌లో యూనికోడ్‌లో కొట్టడం, అభిప్రాయాలు చెప్పినంత సులభం కాదన్నారు. కవిత్వం రాయడమంటే జీవితానికి సంబంధించిన అక్షరాలుండాలని సూచించారు. ఆ అక్షరం తన్నుకు రావాలంటే తపస్సు ఉండాలని చెప్పారు. అస్తిత్వం సున్నితమైన అంశమనీ, అన్నీ తెలిసి నేరం చేస్తుంటామని అన్నారు. దేశం, ప్రాంతం, జెండర్‌, కులం, మతం వంటి తేడాలేకుండా పురుషాధిపత్యం ఎల్లలు లేకుండా కొనసాగుతుందని వివరించారు. తెలుగు సాహిత్యానికి అస్తిత్వాలన్ని కలిసి సుసంపన్నంగా తయారైందని చెప్పారు. తెలంగాణ సాహిత్యం గొప్ప కవిత్వాన్ని ఇచ్చిన నేల ఇది అని అన్నారు. 'గోర్కీ అమ్మ నాకు ఆదర్శమైతే, నువ్వు నాకు ఆధారమయ్యావ్‌ అంటూ రచయిత తన తల్లి గురించి రాయడమే గొప్ప విషయం'అని ఆయన చెప్పారు. గోర్కీ అమ్మను, తనను కన్నతల్లిని పోల్చి రాయడంలో ఈ పుస్తకం గొప్పతనం, తన జీవిత మూలాలను ఈ పుస్తకంలో చేర్చారని వివరించారు. ప్రముఖ కవి శిలాలోలిత మాట్లాడుతూ ప్రశ్నలేనిదే జ్ఞానం ఉదయించదని అన్నారు. తప్పులోనుంచే ఒప్పును తెలుసుకుంటామని చెప్పారు. 'నేను రాయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం, నేనే రాయగలను అనుకోవడం అహంకారం'అని ఆమె అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి మాట్లాడుతూ కవిత్వం రాయడం వరకే కాకుండా సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు. సలీమ రాసిన పుస్తకంలో ఆ పరిష్కారం ఉందన్నారు. ఒత్తిడి, హింస, వివక్ష, అసమానతలు పెరుగుతున్నందుకు అమ్మాయిలు ఎక్కువగా కవితలు రాస్తున్నారని వివరించారు. ఎక్కడైతే అణచివేత, ఒత్తిడి ఉంటుందో అక్కడే తిరుగుబాటు వస్తుందన్నారు.
            ఇది స్త్రీల సమస్య కాదనీ, పురుషులూ అందరూ కలిసి పోరాడాలని అన్నారు. ప్రముఖ కవి జరీనాబేగం మాట్లాడుతూ స్త్రీలు ఏదైనా సాధించాలంటే కుటుంబం నుంచి ముఖ్యంగా భర్త ప్రోత్సాహం ఉండాలన్నారు. రచయిత సలీమ మాట్లాడుతూ ముస్లిం అమ్మాయిలు బయటికి రావాలంటే కొన్ని ప్రత్యేకతలుంటాయనీ, దాని కోసం పోరాటం చేయాలని అన్నారు. ఐద్వా, సీపీఐ(ఎం)లో తన అమ్మ పనిచేయడం వల్ల తనకు కొంత స్వేచ్ఛ దొరికిందనీ, ఈ స్థాయికి వచ్చానని వివరించారు. ఈ పుస్తకం తేవడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అరసం రాష్ట్ర కార్యదర్శి కెవిఎల్‌, కవి యాకూబ్‌, సాహితీవేత్త పవన్‌, తెలుగు విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ అయినంపూడి శ్రీలక్ష్మి, సలీమ భర్త మహేష్‌ దుర్గే ప్రసంగించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నస్రీన్‌ఖాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత ఎం విప్లవ్‌కుమార్‌ ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్‌ సుధాభాస్కర్‌, రచయిత దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. జి నరేష్‌ ఆహ్వానం పలుకగా, తెలంగాణ సాహితి నాయకులు అనంతోజు మోహన్‌కృష్ణ వందన సమర్పణ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.