Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేటాయింపులే.. ఖర్చులేదు.. : తప్పు పట్టిన కాగ్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 17,2022

కేటాయింపులే.. ఖర్చులేదు.. : తప్పు పట్టిన కాగ్‌

- పథకాలు ఏవైనా నిధుల దారి మళ్లింపు పక్కా
- కాంగ్రెస్‌ హయాంలో హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు
- టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు బంధు, రుణ మాఫీకి!
- క్యారీ ఫార్వర్డ్‌ కాని నిధులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
               దళితుల అభివృద్ధి, వారి సంక్షేమం గురించి రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ జరుగుతున్నది. శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే చెప్పారు. అందుకు కేటాయింపులు కూడా చేశారు. అయితే కేటాయించిన నిధులు ఆచరణలో ఖర్చు కాకపోవటం వల్ల దళితులు ఆశించిన ఫలితం పొందలేకపోతున్నారు. దళిత నిధి సరే.. వాటిని ఖర్చు పెట్టేందుకు చిత్తశుద్ధిని ప్రభుత్వం ప్రదర్శించటం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16శాతం ఉన్నారు. జనాభా ప్రాతిపదికన వీరికోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నారు. అయితే సబ్‌ప్లాన్‌ ప్రకారం ఆ ఏడాదిలో ఖర్చు చేయలేకపోతే తర్వాత ఏడాదికి నిధులను క్యారీ ఫార్వర్డు చేయాలి. కానీ.. గడిచిన ఏడేండ్లలో ఒక్క సంవత్సరం కూడా ఈ నిధులు మిగిలిన దాఖలాల్లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. క్యారీ ఫార్వర్డు చేయాల్సి వస్తుందన్న కారణంతో నూటికి నూరు శాతం ఖర్చు చూపిస్తున్నది. ఈ సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే..అన్ని రంగాలతో పాటు సాంఘీక సంక్షేమ గ్రాంట్లలో కూడా పెద్ద మొత్తంలో రూ.6,124 కోట్లు ఖర్చు కాకుండా ఉన్నాయని కాగ్‌ తేల్చింది. మరో పక్క వివిధ శాఖల్లో దళితులకు రావాల్సిన వాటా ఉంటుంది. కానీ.. ఆ శాఖల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోవటంతో ఆ మేరకు దళితుల వాటాలోనూ నష్టం జరుగుతున్నదని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
లెక్కలపై స్పష్టత లేదు..
               'ఎస్‌డీఎఫ్‌'చట్టం ప్రకారం.. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. వాటిని 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేస్తారు. శాఖల వారీగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖలుంటాయి. వీటిని నిర్దేశించిన వార్షిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఏవైనా కారణాలతో నిధులు మిగిలితే తర్వాతి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్‌ చేయాలి.
ప్రత్యేక నిధి ఇలా..
               ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక..! రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి..! ఇలా పథకాలు ఎన్ని వస్తున్నా పేర్లు మారుతున్నాయే తప్ప దళిత, గిరిజన వాడలు, పల్లెలు, ప్రజల పరిస్థితులు మెరుగవడంలేదు. నిధుల దారి మళ్లింపు సాధారణమైపోయింది.
               కాంగ్రెస్‌ హయాంలో 2007-08 నుంచి 2012-13 మధ్య ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.39,330.6 కోట్లను కేటాయిస్తే ఖర్చుచేసింది మాత్రం రూ.20,516.15 కోట్లే (52.16శాతం). టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఏడేండ్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్‌ కింద ప్రభుత్వం రూ.86,684 కోట్లు కేటాయించి, రూ.55,438.89 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఖర్చు చేయకుండా ఉన్నవి రూ.31,246కోట్లు. వీటిని తర్వాతి బడ్జెట్లలో క్యారీ ఫార్వర్డ్‌ చేయటం లేదన్న విమర్శ తీవ్రంగా ఉంది. ఇదిలా
ఉంటే.. ఖర్చు చేసిన నిధుల్లోనూ సగం నిధులు సార్వజనీన పథకాలకు వ్యయం చేయడంపై సామాజిక సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ పాలనా కాలంలోలాగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా దళితుల డబ్బులను హుసేన్‌సాగర్‌ అభివృద్ధికి, పార్కుల సుందరీకరణకు,హుడా అభివృద్ధికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ పథకాలకు ఈవీఎంలను భద్రపరిచేందుకు రోడ్లు భవనాల శాఖకు దారిమళ్లిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో అసలు ఉద్దేశం నెరవేరడం లేదు.
అందులోనూ దళితులున్నారు కదా?..
               ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక నిధిని ఆయా తరగతులకే నిర్దేశించిన పథకాలకు ఖర్చుకు కూడా చేయాలనే నిబంధన ఉంది. కానీ.. అందరికీ అమలవుతున్న సాధారణ పథకాలను చూపి అందులో ఎస్సీ, ఎస్టీల వాటా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం లక్కలేస్తున్నది. ''రైతు బంధు, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్లు..ఇలా అన్నింటా దళిత, గిరిజన లబ్దిదారులున్నారు కదా..! అందుకే వాళ్ల కోటా నుంచి ఖర్చు చేస్తున్నాం'' అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి ఏడాది ఎస్సీ, ఎస్టీ ఫండ్‌ మానిటరింగ్‌ కమిటీ మీటింగుల్లో చెబుతున్న విషయం తెలిసిందే.
కాగితాలపైనే లెక్కలు..
               2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఏడేండ్ల కాలంలో ఎస్సీల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బులు కేటాయించినట్టు లెక్కల చెబుతున్నప్పటికీ..క్షేత్ర స్థాయిలో దళితుల అభివద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. సబ్‌ప్లాన్‌ చట్టంలో ఉన్న చిన్న లొసుగును(సెక్షన్‌-డి) అడ్డం పెట్టుకుని ఆ చట్టం స్ఫూర్తికే విఘాతం కలిగించే చర్యలకు సర్కారు పూనుకుంటుందన్న చర్చ జరగుతున్నది. ఈ పక్షపాతి ధోరణి మారాలని సామాజిక వెత్తలు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.