Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అధికారుల్లేకుండానే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2022

అధికారుల్లేకుండానే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌!

- ఎగ్జామినర్లతో నిర్వహించేందుకు సన్నాహాలు
- బోర్డు నిబంధనలకు యధేచ్చగా తిలోదకాలు
- కార్పొరేట్‌ కాలేజీలకు అనుకూలంగా అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
              రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఇంటర్‌ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహించేందుకు సన్నద్ధమవు తున్నారు. డిపార్ట్‌మెంటల్‌ అధికారుల్లే కుండానే ఈ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం ఎగ్జామినర్లతోనే పరీక్షలను పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ప్రాక్టికల్‌ జరిగే పరీక్షా కేంద్రంలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఎగ్జామినర్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్‌ బోర్డు ప్రతినిధిగా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఎగ్జామినర్‌ ప్రయివేటు లేదా ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులను నియమిస్తారు. ఈసారి ఇంటర్‌ బోర్డు ప్రతినిధి డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ లేకుండానే కేవలం ఎగ్జామినర్‌తో ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అధికారులు ఇంటర్‌ బోర్డు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. వారి తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీలకు అనుకూలంగా ఇంటర్‌ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కైన అధికారులు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు లేకుండా నిర్ణయం తీసుకున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. గతంలో డిపార్ట్‌మెంటల్‌ అధికారుల నియామకంలోనూ అవకతవకలు జరిగినట్టు విమర్శలొచ్చాయి. సీనియర్లను కాకుండా జూనియర్లకు, అనుభవం లేని వారికి ఆ అవకాశం ఇచ్చినట్టు అధికారుల తీరుపై పలువురు అధ్యాపకులు ఆరోపించారు. ఇప్పుడు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ లేకుండానే నిర్ణయం తీసుకోవడాన్ని అధ్యాపక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌లో నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నా ఆచరణలో అమలు కావడం లేదు.
23 నుంచి ప్రాక్టికల్స్‌ ప్రారంభం
              రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఈనెల 23 నుంచి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను అధికారులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలు, ప్రశ్నాపత్రం తయారీ వంటి పనులపై అధికారులు నిమగమయ్యారు. ఈ పరీక్షలకు మూడు లక్షల మంది విద్యార్థులకుపైగా హాజరయ్యే అవకాశమున్నది. కరోనా నేపథ్యంలో గతేడాది ప్రాక్టిల్‌ పరీక్షలను నిర్వహించలేదు. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అయితే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేకపోవడం వల్ల విద్యార్థులకు కొంత ఉపశమనం లభించింది. అందులోనూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మేలు కలిగింది. ఇంకోవైపు ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో ల్యాబోరేటరీలు ఉంటాయంటే అతిశయోక్తి అవుతుంది. అవి కేవలం నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ కోచింగ్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. విద్యార్థులు ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. అందుకే ప్రాక్టికల్స్‌ కోసం ల్యాబ్‌లు ఉండే అవకాశం లేదు. మరోవైపు ల్యాబ్‌ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న అంశం. అందుకే కార్పొరేట్‌ కాలేజీలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.మూడు వేల వరకు ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఫీజు వసూలు చేస్తాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం వచ్చే వారికి 'మామూళ్లు' ఇస్తాయన్న ఆరోపణలున్నాయి. అందుకే కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే ఒక్కో విద్యార్థికి ప్రాక్టికల్‌ పరీక్షల మార్కులు 30కి 30 వస్తాయి. అదే ప్రభుత్వ కాలేజీల్లో ఎంత బాగా చదివిన విద్యార్థికైనా 30లోపు మార్కులే వస్తుండడం గమనార్హం.
డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించాలి : రామృష్ణగౌడ్‌, టిప్స్‌ కన్వీనర్‌
              ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు ప్రయివేటు కాలేజీల్లో బోర్డు ప్రతినిధిగా డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించాలని తెలంగాణ ఇంటర్‌ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్‌) రాష్ట్ర కన్వీనర్‌, టిగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ను గురువారం హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ కచ్చితంగా ఉంటారనీ, అపోహలను నమ్మొద్దంటూ కార్యదర్శి హామీ ఇచ్చారని తెలిపారు.
డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు అవసరం లేదు : గౌరి సతీశ్‌, టీపీజేఎంఏ అధ్యక్షులు
              ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు అవసరం లేదని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్‌ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణలో వారికి ఎలాంటి పాత్ర ఉండబోదని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఫీజు వసూలు చేసే కాలేజీలపైనా, ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించని కాలేజీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పకడ్బందీగా ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించాలని కోరారు. డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు థియరీ పరీక్షల వరకే పరిమితం చేయాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.