Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్పు.. ముప్పు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2022

అప్పు.. ముప్పు..

- పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు
- ఆర్భాటాలే.. సహాయమేదీ !
- ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతుల వేడుకోలు
రైతే దేశానికి వెన్నుముక. రైతు లేనిదే దేశం లేదు.. రైతే రాజు.. ఇలా ఎన్ని నినాదాలు ఉన్నప్పటికీ రైతు సంతోషంగా ఉన్న రోజు లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం అప్పుల ఊబి మాత్రం బయటపడటం లేదు. రైతుల కోసం.. వ్యవసాయం కోసం ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా.. రైతు అప్పుల సుడిగుండం నుంచి బయటకు రాలేకపోతున్నారు. పెట్టుబడికి అప్పు చేయనిదే సాగు చేయలేని పరిస్థితి. పంటకు ధర లేక చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం తప్ప.. అసలు మాత్రం అలానే ఉంటుంది. ఏడాదికేడాది అప్పులు చాంతాడులా పెరిగిపోతుండటంతో విధిలేని పరిస్థితుల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

నవతెలంగాణ - మెఫిసిల్‌ యంత్రాగం

        స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం.. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెబుతూనే మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. రెండు వేల రూపాయల చొప్పున ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని.. అదే వ్యవసాయానికి పెద్ద ఊతకర్ర అన్నట్టు ప్రధాని మోడీ భ్రమింపచేస్తున్నారు. రెండు వేల రూపాయలతో రైతు ఎలా రాజు అవుతారో బీజేపీ నేతలు చెప్పాలని రైతు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుబంధుతోనే రైతు సంతోషంగా ఉన్నారంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రుణమాఫీ విషయంలో ఇప్పటివరకు పూర్తిచేయలేదు. రాష్ట్రంలో 91.7 శాతం మంది రైతులు అప్పులు చేశారు. ఇది ప్రభుత్వాలు చెప్పిన అధికారిక లెక్కలే. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో 80 శాతం పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి కోయకుండానే వదిలిపెట్టగా.. మరికొన్నిచోట్ల పత్తి, మొక్కజొన్న పైర్లు నీట మునిగి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. దానికి తోడు మార్కెట్‌ విధానం సరిగ్గా లేకపోవడంతో ధాన్యం నెలలకొద్ది మార్కెట్‌లో పెట్టడంతో రైతులపై అదనపు భారం పడింది. ఒక్కో మార్కెట్లో సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ధాన్యం రాసులు నిలువ ఉన్న పరిస్థితి. ధాన్యం రక్షణ కోసం రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రబీలో చాలాచోట్ల పంటలు వేయకుండా భూములను బీడులుగా ఉంచారు. ఒక్కో రైతు కుంటుంబం రూ.5 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో .. అటు వ్యవసాయాన్ని వదులుకోలేక.. మరో పని చేయలేక.. ఎలాగోలా కష్టపడి నెట్టుకొస్తున్నామని రైతులు చెబుతున్నారు. లక్ష్యాల మేరకు రుణాలివ్వాలని, వెంటనే రుణ ప్రణాళికలు తయారు చేసి రైతులను ఆదుకోవాలని రైతుసంఘం నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రైతులను 'నవతెలంగాణ' కదిలించగా తమ కన్నీటి గాధను వివరించారు.
        ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వరి రైతులపై రూ.2400 కోట్ల భారం
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 80 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీరుందనే ఉద్దేశంతో రైతులు వలసలు మాని పంటలను సాగు చేసుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 17 లక్షల ఎకరాలు సాగు చేస్తారు. ఇందులో వరి, పత్తి పంటలే 10 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. అయితే, రెండేండ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు 80 శాతం దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటల పెట్టుబడులు మీద పడ్డాయి. ఎకరాకు రూ.40 వేలకు పైగానే పెట్టుబడి అవుతోంది. వరి సాగు చేసిన రైతులపై రూ.2400 కోట్లు, పత్తి సాగుదారులపై రూ.1200 కోట్ల భారం పడింది. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక తిరిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. మదనాపూరం, ఊర్కోండ, బల్మూరు మండలాలతో పాటు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరు నెలల కాలంలో 10 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
రెండెకరాలు కౌలుకు తీసుకుంటే మిగిలింది రూ.400 లే
        ''రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరిల్లిలో రైతు కైరనాయక్‌ రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తే.. పంటకు వచ్చిన ఆదాయం రూ.78,400. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి రూ.50 వేలు, కౌలు ఎకరాకు రూ.8 వేల చొప్పున రెండెకరాలకు రూ.16వేలు. పంటకు వచ్చిన ఆదాయం 78,400 నుంచి రూ.66 వేలు పెట్టుబడి పోగా రైతుకు మిగిలింది రూ.12,400. ఇవి కాస్తా పంట పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ.50 వేలకు వడ్డీ కింద రూ.12వేలు పోతే.. ఆర్నెల్లు కష్టపడిన రైతుకు మిగిలింది రూ.400 మాత్రమే. కనీసం దినసరి కూలి డబ్బులు కూడా రాని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.

రుణ ప్రణాళికతో రైతులకు భరోసా కల్పించాలి

        రైతుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రెండేండ్లుగా దిగుబడులు తగ్గి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణ ప్రణాళికను తయారు చేయాలి. ఇప్పటికే రైతులు అభద్రతాభావంలో ఉన్నారు. వీరికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్‌

ప్రభుత్వమే ఆదుకోవాలి.. వర్షాలతో కుసుమ పంటకు నష్టం
రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటగా కుసుమను 14 ఎకరాల్లో సాగు చేశాను. ఎకరానికి 20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి పెట్టి పంటను కంటికి రెప్పలా చూసుకున్నాను. పంట చేతికొచ్చే చివరి దశలో (గత జనవరి చివరి వారంలో) తుఫాన్‌ వచ్చి పూర్తిగా దెబ్బతిన్నది.
- బాసం నరసింహారెడ్డి- రాయపోల్‌(సిద్దిపేట)

ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఆర్థిక పరిస్థితులు భారమై.. అప్పుల బాధ తాళలేక రెండేండ్ల కిందట నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయాలి.
- బోయిని రామమ్మ, పైతర(మెదక్‌ జిల్లా)

పెట్టుబడులు పెరుగుతున్నాయి
నాకు రెండెకరాల పొలం ఉన్నది. గత వానాకాలంలో దొడ్డు రకం వరి పండించాను. అప్పుడు పెట్టుబడి రూ.45వేలు అయింది. అదే పొలంలో ఇప్పుడు సన్నరకం, దొడ్డు రకం పండిస్తున్నాను. ప్రస్తుతం ఎరువుల ధరలు, కలుపు ఖర్చులు పెరగడంతో ఇప్పటికే రూ.53వేల పెట్టుబడి అయింది. పంట చేతికొచ్చే సరికి ఇంకెంత అవుతుందో.. దిగుబడి మాత్రం అనుకున్నంత రావట్లేదు.
- చాకలి రాజు, అనంతసాగర్‌(మెదక్‌)

సాగు చేయాలంటే భయమేస్తుంది
పంట పెట్టుబడులకు అధిక ఖర్చు కావడం వల్ల వ్యవసాయం చేయాలంటే చాలా భయంగా ఉంది. ఎకరం పొలం చదును చేయాలంటే తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కామారెడ్డికి సమీపంలో ఉండటంతో నాటు వేయడానికి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఖర్చవుతుంది. మందులు, పంట చేతికొచ్చే వరకు సుమారుగా ఎకరానికి 45వేల రూపాయలు ఖర్చవు తుంది. ఈసారి ప్రభుత్వాలు వడ్లు కొనబోమని చెప్పడంతో రెండెకరాల్లో జొన్న వేశాను. అది మొలక రాకపోవడంతో, మళ్లీ గోధుమలు వేశాను.
- రైతు ప్రశాంత్‌, నరసన్నపల్లి, కామారెడ్డి

ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టమే
నాలుగెకరాల వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకు న్నాను. కానీ అప్పులే పెరిగాయి. ఈ ఏడాది అధిక వర్షాల కు పంటలు దెబ్బతిన్నాయి. ఐదెకరాలు సాగు చేస్తే 3 లక్షల అప్పు అయింది. రెండెకరాలు కోయకుండానే వదిలి పెట్టాను. ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం చేయకపోతే బతకడం కష్టమే.
- వెంకటేష్‌ గుంతకోడూరు- నాగర్‌ కర్నూల్‌ జిల్లా

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.