Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జలాశయాలు ఖాళీ వేసవి తాపానికి ఆవిరవుతున్న నీరు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 19,2022

జలాశయాలు ఖాళీ వేసవి తాపానికి ఆవిరవుతున్న నీరు

- జూరాలలో 3.5 టీఎంసీలు
- శ్రీశైలంలో 30 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం
- గతేడాదితో పోల్చితే తగ్గిన నీటి నిల్వలు
- పాత గేట్లతో నీరు వృథా
- ఆరుతడి పంటలకు నీరు నిలిపివేత
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
             మార్చిలోనే ఎండలు ముదిరాయి.. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో జలాశయాలూ ఖాళీ అవుతున్నాయి. వర్షాకాలంలోనేమో.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో జిల్లాలో సాగు, తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. జూరాలతోపాటు శ్రీశైలం జలాశయాలు గతేడాదితో పోల్చితే ప్రస్తుతం నీటి నిల్వలు భారీగా తగ్గాయి. గతేడాది మార్చిలో జూరాలలో 4 టీఎంసీల నీరుండగా.. ప్రస్తుతం మూడున్నరకు చేరింది. ఈ నిల్వలు మరింత తగ్గి ఆరు తడి పంటలకే కాకుండా తాగునీటికీ ఇబ్బందికర పరిస్థితులు దాపురించే అవకాశాలున్నాయి. ఎండలకు తోడు రిజర్వాయర్లకు అమర్చిన క్రస్ట్‌ గేట్లు పాతవి కావడంతో లీకులు ఏర్పడి నీరంతా దిగువకు వెళ్తోంది. ఫలితంగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి ఇలాగే, కొనసాగితే నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదాలున్నాయని, కనీసం తాగు నీటి అవసరాలూ తీర్చలేని దుస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
             ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.04 టీఎంసీలకు పడిపోయింది. దీంతో నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమాకు నీటి
విడుదల నిలిపేశారు. తాగునీటి అవసరాల కోసం 1.690 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గతేడాది జూరాలలో ఈ సమయానికి 4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 30 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అలాగే, శ్రీశైలం జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు. అది క్రమంగా 215 టీఎంసీలకు చేరింది. అంటే వంద టీఎంసీల మందంగా బురద చేరింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అవసరానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల నీటి నిల్వలు 30 టీఎంసీల డెడ్‌ స్టోరేజీకి చేరాయి. ఈ నీరు కూడా క్రమ క్రమంగా ఆవిరి అవుతోంది. ఫలితంగా నీటి నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో కోయిల్‌సాగర్‌, సింగోటంతోపాటు వనపర్తి జిల్లా పరిధిలో సప్త సముద్రాల పేరుతో 7 రిజర్వాయర్లున్నాయి. ఇంకా గుడిపల్లి, జొన్నలబొగడ, ఎల్లూరు రిజర్వాయర్లు ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పరిధిలో నిర్మిస్తున్న రిజర్వాయర్లు ఇంకా పూర్తి కాలేదు. నీటి సమస్య కారణంగా ఈ ఏడాది రబీకి సాగునీటిని మధ్యలోనే నిలిపేశారు. ఉమ్మడి జిల్లాలో 6,536 చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో జలాశయాలు ఆవిరి రూపంలో తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల వేరుశనగ, మరో లక్ష ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా ఎండుదశకు చేరుకుంది.
ముందస్తు చర్యలు లేకనే నీటి సమస్య
             జూరాల, శ్రీశైలంలో ఇప్పటికే కనిష్ట స్థాయికి నీటి నిల్వలు పడిపోయాయి. జూరాల గేట్లు కొత్తవి అమర్చకపోవడం వల్ల ప్రతి రోజూ నీరు లీకేజీ అవుతోంది. 20 ఏండ్ల కిందట అమర్చిన గేట్లకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. జూరాలకు అమర్చిన 17, 20, 36 గేట్ల నుంచి నిరంతరం నీరు లీకవుతూనే ఉంది. వరదల సమయంలో నీటిని రిజర్వాయర్ల ద్వారా నింపుకుంటే సమస్య వచ్చేది కాదు. 40 టీంఎంసీలకుగానూ కేవలం 6 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇంకా 15 రిజర్వాయర్లను నిర్మాణం చేయాల్సి ఉంది.
మరమ్మతులు చేపట్టాలి
             ఎండీ.జబ్బార్‌- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- వనపర్తి
బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిన జూరాల విషయంలో పాలకులు వివక్ష చూపుతున్నారు. నిర్వహణ కోసం నిధులు ఏమాత్రం ఖర్చు చేయడం లేదు. గేట్ల మరమ్మతులు చేయకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. జూరాలతో పాటు మిగతా ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు పెంచి ఖర్చు చేయాలి. లేకుంటే నీటి సమస్య జఠిలంగా మారే అవకాశం ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.