Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్త్రీలను కాదంటే ఉద్యమమే లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 20,2022

స్త్రీలను కాదంటే ఉద్యమమే లేదు

మల్లు స్వరాజ్యం...అతి చిన్న వయసులోనే దేశం కోసం పోరాడారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తుపాకి పట్టారు. స్వతంత్ర భారతదేశానికి డెభ్బై ఏండ్లు గడిచిన సందర్భంగా ఆ వీరనారి అనుభవాలు ...
         ఉప్పుసత్యాగ్రహం జరుగుతున్న కాలంలో నేను పుట్టాను.మా మేనత్త కొడకు ఆ ఉద్యమంలో పాల్గొని వచ్చి అక్కడ జరిగిన స్వరాజ్‌ ఉద్యమం గురించి మా అమ్మకు చెప్పాడు. దాంతో మా అమ్మ ఆడపిల్లలు స్వేచ్ఛగా చదువుకోవాలి, స్వేచ్ఛగా బతకాలి అని కోరుకుంది. అందుకే నాకు స్వరాజ్యం అనిపేరుపెట్టింది. ముఖ్యంగా ఆనాడు స్త్రీలను పరదాల చాటున ఉంచుతున్నారనే ఉద్దేశంతో స్త్రీలకు స్వేచ్ఛకావాలని కోరుకుంది.
సంస్కరణోద్యమాల ప్రభావంతో...
         మార్క్సిజం, మాక్సిమ్‌ గోర్కి ''అమ్మ'' నవల చదివి 13 ఏండ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చాను. అప్పట్లో స్త్రీలకు స్వేచ్ఛలేదు, చదువులేదు. అందుకే మహిళలకు చదువు కావాలి, అభివృద్ధి కావాలని కోరుకున్నాను. బాల్యవివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. తర్వాత దీన్నే కమ్యూనిస్టులు వారసత్వాన్ని ఎత్తుకున్నారు. అలాగే అప్పట్లో సోవియట్‌ రష్యా ప్రభావం కూడా మాపై పడింది. దీని ఫలితంగానే నాలాంటి ఎందరో మహిళలు ఉద్యమాల్లోకి వచ్చారు. ఉదాహరణకు సూర్యావతి, కాటూరి రాజేశ్వరమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి వీళ్ళంతా స్వాతంత్య్రం కోసం పోరాడారు.
నాటి నుంచి నేటి వరకు
         ఆనాటి వివాహ వ్యవస్థకు, స్త్రీలను నాలుగ్గోడల మధ్య ఉంచడానికి వ్యతిరేకంగా, స్త్రీలకు స్వేచ్ఛ కావాలని గాంధీ ఇచ్చిన పిలుపును అందుకొని మహిళలు జైళ్ళకు వెళ్ళారు. ఆనాటి మహిళలు ప్రదర్శించిన ధైర్య సాహసాల ఫలితంగానే ఏ దేశంలో స్త్రీలకు ఓటు హక్కు రాకముందే మన దగ్గర వచ్చింది. సాయుధ తెలంగాణ పోరాటంలో మగవాళ్ళను పట్టుకెళితే స్త్రీలే భూమిని దున్ని పండించారు. అలాంటి మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి స్త్రీలను పక్కన పెడితే పోరాటమే లేదు. స్త్రీలను కాదంటే ఉద్యమమే లేదు. ఐలమ్మ భూ పోరాటమే దీనికి నిదర్శనం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటు వేసే హక్కు మాత్రమే స్త్రీలకు మిగిలింది. అసలైన స్వేచ్ఛ కోసం తన్నులాడతానే ఉన్నాం. 70 ఏండ్ల స్వాతంత్య్ర ఫలితాలు స్త్రీలకు సంపూర్ణంగా దక్కలేదన్నది నిజం.
స్త్రీలకు స్వేచ్ఛ రాకుంటే...
         స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరాచకపు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. స్త్రీలు కోరుకున్న సమాజం రాలేదు. అది రావాలంటే మహిళలు ఒంటరిగా కాదు, అందరినీ కలుపుకొని పోరాడాలి. అప్పట్లో మహిళలను రాజకీయాల్లోకి తెచ్చింది కమ్యూనిస్టులు. మహిళలను ఎన్నికల్లో పోటీ చేయించింది కమ్యూనిస్టులే. నేనూ అలా వచ్చిన దాన్నే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంబేద్కర్‌ రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరినా పాలకులు మహిళలకు దక్కాల్సిన హక్కులను దక్కనీయ లేదు.లాభాల కోసం పాకులాడే ఈపెట్టుబడి దారీ వ్యవస్థను రూపుమాపకుండా మహిళలకు స్వేచ్ఛ రాదన్నది నిజం. నా ఉద్దేశంలో స్త్రీలకు, దళితులకు స్వేచ్ఛరాకుండా దేశానికి స్వతంత్రం రానట్టే.
సామూహికంగా పోరాడాలి
         ప్రస్తుతం అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మహిళలు చేయని పనంటూ లేదు. అయితే కొందరు కేవలం సొంత లాభం, సొంత కెరీర్‌ అంతా తమ సొంతం కోసమే ఆలోచిస్తున్నారు. ఇతరుల గురించి, సమాజం గురించి ఆలోచించ లేకపోతున్నారు. ఈ వ్యవస్థ కూడా వారిని అలాగే తయారు చేస్తుంది. అయితే మహిళలు సమాజం గురించి ఆలోచించకుండా, రాజకీయాల్లోకి, పాలనలోకి దూరకుండా స్వేచ్ఛ లభించదు. దేశంలో ఉన్న ఇంత మంది జనంలో 30 శాతం మంది ఇలా సమాజం కోసం ఆలోచించినా మార్పు కచ్చితంగా వస్తుంది. ఇది నా అనుభవంతో చెబుతున్న మాట. ఆనాడు వీరతెలంగాణ పోరాటంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడి నిరూపించాం. కొంతమంది పోరాటాలు చేస్తున్నారు. వ్యక్తిగత పోరాటాల వల్ల సమాజం మారదు. సమాజంలో సగభాగమైన స్త్రీలు సాధికారతను సాధించాలంటే వ్యక్తిగతంగా కాదు సామూహికంగా పోరాడాలి. భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లకు చదువు, పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకున్న హక్కు రావాలి. ఇది సాధించాలంటే రాజకీయ, ఆర్థిక పోరాటాలే శరణ్యం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.