Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేసవి భత్యం లేనట్లే..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 20,2022

వేసవి భత్యం లేనట్లే..!

- ఉపాధి కూలీలకు గిట్టని కూలి
- ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో భృతి ఎత్తివేత
- ఎండలు ముదిరి.. గట్టి బారిన నేలలు
- చేతులు బొబ్బలొచ్చేలా పనిచేసినా రూ.150 దాటని కూలి
- వేసవి భత్యం ఇవ్వాలని కూలీల డిమాండ్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
        'ఎండలు భగ్గుమంటున్నాయి.. మట్టి పని చేయడం కష్టంగా ఉంది. పొద్దంతా కష్టపడినా కూలి గిట్టడం లేదు. మా ఊరులో వరద కట్టల పని పెట్టిండ్రు.. నాలుగు వారాల నుంచి చేస్తున్నాం. ఎండలకు నేలలు గట్టిబారి రోజంతా తొవ్వినా గజం జరుగుతలేదు. చేతులు బొబ్బలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వం ఎండాకాలం భత్యం ఇచ్చేది. ఈ ఏడాది ఇప్పటికీ బోనస్‌ ఇవ్వడం లేదు. కొత్త సిస్టమ్‌ వచ్చింది. ఇక బోనస్‌ రాదంటుండ్రు.. ఎండాకాలం మొత్తం ఎంత కష్టం చేసినా కూలి రూ.100 దాటేట్టు లేదు. బతికేదెట్టో అర్థం కావడం లేదు' అని దండుమైలారం గ్రామానికి చెందిన ఉపాధి కార్మికురాలు నిర్మల 'నవ తెలంగాణ'తో తమ గోడు వెళ్లబోసుకుంది. ఇది ఒక నిర్మల ఆవేదనే కాదు జిల్లాలోని ప్రతి కూలీని పలకరించినా ఇదే బాధను చెబుతున్నారు.
రంగారెడ్డి జిలాల్లో లక్ష 65వేల 352 జాబ్‌ కార్డులు ఉన్నాయి. 2లక్షల 90వేల 298 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది ఉపాధి పనులకు వెళ్లిన వారు లక్షా 30వేల 294 మంది. జిల్లాలో వ్యవసాయ పనులు లేని సమయంలో రోజు కూలీకి వెళ్లే వారి సంఖ్య లక్షకు పైమాటే. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఇవాల్సిన బోనస్‌ ఇవ్వకపోవడంతో కూలీలు ఈ ఏడాది సుమారు రూ.100 కోట్లు నష్టపోనున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతంలో కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలీల ఖాతాల్లో జమా చేసేది. కానీ ప్రస్తుతం ఉపాధి కూలీల డబ్బుల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో భూమి బాగా గట్టిపడి పనులు చేసేందుకు అనువుగా ఉండదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు ఎక్కువ సమయం పని చేయడం సాధ్యం కాదు. వేసవిలో పని చేసేందుకు కూలీలు ఆసక్తి చూపే వారు కాదు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలలో 30 శాతం, జూన్‌ నెలలో 20 శాతం వేసవి భృతి ఇచ్చేది. దీంతో ఉపాధి కూలీలకు కూలితోపాటు అదనంగా రోజుకు రూ.40 నుంచి రూ.60 వచ్చేవి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తూ చెల్లింపులు నేరుగా చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భృతి కల్పించేందుకు ఆప్షన్‌ లేదు. దీంతో వేసవిలో పని చేసినా పూర్తిస్థాయిలో డబ్బులు వచ్చే పరిస్థితి ఉండదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
పనిదినాలు తగ్గింపు..
        ఉపాధి హామీలో ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పించాలి. గతంలోని సాఫ్ట్‌వేర్‌ కనీస వేతనం ఒక్క పని దినంగా లెక్క వేసేది. దీని వల్ల ఒక రోజు వేతనం తగ్గినా మరుసటి రోజు పని చేసుకునే అవకాశం ఉండేది. కొత్తగా వచ్చిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి కూలీ పనికి వచ్చిన రోజును మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో రోజులో కనీస వేతనం రాకపోయినా పని దినం పూర్తయినట్లే. దీంతో ఉపాధి కూలీ 100 రోజులకు మించి పని చేసే అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించి వేసవి భృతి, ఇతర అలవెన్స్‌లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
వేసవి అలవెన్స్‌లు ఇవ్వాలి
        ఉపాధి కూలీలకు ప్రతి ఏడాదీ ఎండాకాలం ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఇచ్చే అలవెన్స్‌లను ఇవ్వాలి. కొత్త సాఫ్ట్‌వేర్‌తో పని రోజులు తగ్గే అవకాశం ఉంది. తక్షణమే సాఫ్ట్‌వేరుల్లో ఉన్న సాంకేతిక లోపాలను సవరించాలి. ప్రతి కూలీకి 100 రోజులు పని దినాలు కల్పించాలి
- పి.జగన్‌- వ్యవసాయ కార్మిక సంఘం, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.