Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ఉత్సాహపర్చేది : బీవీ రాఘవులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 20,2022

స్వరాజ్యం పోరాట స్ఫూర్తి ఉత్సాహపర్చేది : బీవీ రాఘవులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
          మల్లు స్వరాజ్యం మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సంతాపం తెలిపారు. తాను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన దగ్గర నుంచి ఆమె పోరాట స్పూర్తి మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపర్చేదని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లు స్వరాజ్యం విప్లవనారి : తమ్మినేని వీరభద్రం
          మల్లు స్వరాజ్యం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పసితనంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి చివరి శ్వాస వరకు పార్టీలో, ప్రజా పోరాటాల్లో కొనసాగిన విప్లవనారి అని కొనియాడారు. పిల్లలను వదిలేసి ఆయుధాలు చేతబట్టుకుని నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన గొప్పవీరనారి అని గుర్తుచేశారు. తమ పార్టీలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగిన మొదటి మహిళ అని పేర్కొన్నారు. మహిళా ఉద్యమ నిర్మాణంలో, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో ఆమె ముందుండి ఉద్యమాన్ని నిర్మించారని గుర్తుచేశారు. మరణానంతరం కూడా విద్యార్థుల పరిశోధన నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తన మృతదేహాన్ని ఇవ్వాలని చెప్పిన గొప్ప మనిషి స్వరాజ్యం అని తెలిపారు.
స్వరాజ్యం మరణం పేదలకు తీరని లోటు : రేవంత్‌రెడ్డి
          తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం అనీ, ఆమె మరణం పేదలకు తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేర్‌ ఆస్పత్రిలో మల్లుస్వరాజ్యం పార్ధీవదేహాన్ని సందర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వరాజ్యం మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
తుపాకి పట్టి భూస్వాములను ఎదిరించిన ధీశాలి : సురవరం, చాడ వెంకట్‌రెడ్డి
          సాయుధ పోరాటంలో తుపాకి పట్టి భూస్వాములను ఎదిరించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అనీ, ఆమె మరణం వామపక్షపార్టీలకు తీరని లోటు అని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లు స్వరాజ్యం మృతికి విప్లవ జోహార్లు : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
          తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విప్లవజోహార్లు అర్పించారు. ఆమె మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధీరోదాత్త వనిత : పాటూరు రామయ్య, సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే
          మల్లుస్వరాజ్యం గొప్ప పోరాటయోధురాలనీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ధీరోదాత్త వనిత అని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.మహిళా ఉద్యమాల్లో మార్గదర్శకంగా ఉన్నారని తెలిపారు.శాసనసభలోనూ తన ప్రతిభను చాటార ని గుర్తుచేశారు.చాలా కాలం ఆమెతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమె విశిష్టమైన కమ్యూని స్టు, ఈ సందర్భంలో అనేక జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. ఆమెకు నివాళులు అర్పిస్తున్నాననీ, కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు.
సిద్ధాంతాలు వేరైనా..పేదల పక్షాన ఆమె పోరాటాలు చిరస్మరణీయం : బండి సంజయ్
          తమ సిద్ధాంతం వేరైనా..పేదల పక్షాన మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి స్వరాజ్యం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
          చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మల్లు స్వరాజ్యం అనీ, ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సంతాపాలు
          రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర్‌రావు, ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తదితరులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజా, ఉద్యోగ సంఘాల నివాళి
          తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం మృతికి ప్రజాసంఘాలు నివాళి అర్పించాయి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకట్రాములు, కేంద్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్‌, మహిలా కూలీల రాష్ట్ర కన్వీనర్‌ బి.పద్మ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి, ఐద్వా సీనియర్‌ నేత హైమావతి, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె.ఆనందాచారి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రమణ, మైసశ్రీనివాసులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వామపక్ష నాయకుల నివాళి
          సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వర్‌రావు, ఐద్వానేత అరుణ, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తదితరులు మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.
నవతెలంగాణ కుటుంబం నివాళి
          మల్లు స్వరాజ్యం మృతికి నవతెలంగాణ కుటుంబం శ్రద్దాంజలి ఘటించింది. నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌ సుధాభాస్కర్‌, సీజీఎమ్‌ ప్రభాకర్‌, ఎడిటోరియల్‌ బోర్డు మెంబర్స్‌, జనరల్‌ మేనేజర్లు, నవతెలంగాణ కుటుంబం సంతాపం ప్రకటించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.