Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీకి విరుగుడు లౌకిక భావజాల వ్యాప్తే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 20,2022

బీజేపీకి విరుగుడు లౌకిక భావజాల వ్యాప్తే

- 28, 29 తేదీల్లోని సమ్మెకి రాజకీయ ప్రాధాన్యత
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- ప్రజలందర్నీ వీధుల్లోకి రప్పించేలా ప్రచారముండాలి : చాడ
- మోడీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి:ముఠాగోపాల్‌
- అబద్ధాల ప్రచారంతోనే అధికారంలో బీజేపీ : బెల్లయ్యనాయక్‌
- సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
        బీజేపీకి విరుగుడు లౌకిక భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కార్మిక సంఘాలు 28,29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సమ్మెకు రాజకీయ ప్రాధాన్యత నెలకొన్నదనీ, మతోన్మాదానికి అడ్డుకట్ట వేసేందుకు అది ఒక సాధనం అని అన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సార్వత్రిక సమ్మె జయప్రదాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నేతలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ..ఎన్ని చేసినా బీజేపీని అడ్డుకోలేకపోతున్నామనే చర్చ నడుస్తున్నదనీ, ఆ భావాన్ని మెదళ్ల నుంచి తీసివేయాలని సూచించారు. రాజకీయంగా ఓట్లు సాధించలేకపోవచ్చునేమోగానీ ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయొద్దన్నారు. మతోన్మాద భావజాలం వేగంగా విస్తరిస్తున్నదనీ, దాన్ని తిప్పికొట్టేందుకు మన శక్తిని కూడగట్టుకోవాలని చెప్పారు. ఓటములను విజయానికి మార్గంగా మలుచుకుని చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోరాటాల వల్లనే 8 గంటల పనిదినం, కార్మిక హక్కులు సిద్ధించాయన్నారు. వాటిని నిర్వీర్యం చేసే పనికి మోడీ సర్కారు నేడు పూనుకున్నదని విమర్శించారు. సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందనీ, ప్రతి ఒక్కరూ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ సర్కారు ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేస్తూ మరోవైపు కార్మికవర్గంపై ముప్పేట దాడి చేస్తున్నదని విమర్శించారు. సమ్మెలో మహిళా, విద్యార్థి, యువజన సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. వంద శాతం ప్రజలు తమ నిరసనను తెలిపేలా ప్రచారం ఉండాలన్నారు. ప్రజా ఉద్యమాలకు మించినవేవీ లేవని నొక్కి చెప్పారు. వాటిని విజయవంతం చేస్తేనే పాలకుల్లో వణుకు పుట్టి తాము అనుసరించాలకున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి వెనక్కి తగ్గుతారన్నారు. కార్మిక సంఘాల ఆందోళనకు తమ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కమిటీలకు ఈ సమాచారం అందజేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ.. సింగరేణిలో నాలుగు బ్లాకుల ప్రయివేటీకరణకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. దేశానికి ఆర్థికంగా ఇతోధికంగా ఉపయోగపడుతున్న ఎల్‌ఐసీ, బ్యాంకులు, రైల్వే సంస్థలను కూడా ప్రయివేటీకరించడం దారుణమన్నారు. అంబానీ, ఆదానీ సేవలో మోడీ ప్రభుత్వం మునిగితేలు తున్నదన్నారు. పెట్రోల్‌బంకులు, సినిమాహాళ్లు కూడా బంద్‌ పెడితే బాగుంటుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలతో ముందు కెళ్తున్న మోడీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్‌ మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలన్నింటి విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ఎన్ని అబద్దాలాడైనా, అసత్య ప్రచారాలు చేసైనా సరే అధికారం దక్కించుకోవడమే అమిత్‌షాకు తెలుసని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాఉద్యమాలతోనే మోడీ సర్కారు మెడలు వంచటం సాధ్యమవుతుందన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరావు, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి మురహరి, ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమ, సీపీఐ(ఎంఎల్‌) నేత భూతం వీరయ్య, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ నేత జెవి చలపతిరావు మాట్లాడుతూ..సంఘటితంగా ముందుకెళ్తేనే మోడీ విధానాలను తిప్పికొట్టవచ్చని తెలిపారు. మహిళలను పెద్ద ఎత్తున సమ్మెలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా టీఆర్‌ఎస్‌ తమ గుర్తింపు సంఘాలకు అనుమతి నివ్వాలని కోరారు. అవకాశవాదం ఎక్కువ కాలం నిలవదనీ, నిజంమీద నిలబడేవారు, కార్మికులు, ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టులు కలకాలం ఉంటారని చెప్పారు.
        ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, ఏఐయుటీయూసీ నాయకులు భరత్‌, కొలిపాక కిషన్‌, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న. పి.శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.