Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇప్పుడు కావాల్సింది కశ్మీర్‌ ఫైల్స్‌ కాదు.. కిసాన్‌ ఫైల్స్‌... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 22,2022

ఇప్పుడు కావాల్సింది కశ్మీర్‌ ఫైల్స్‌ కాదు.. కిసాన్‌ ఫైల్స్‌...

 'ఒకే దేశం- ఒకే సేకరణ..' విధానముండాలి.పంజాబ్‌ తరహాలో మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే .ఇదే అంశంపై ఢిల్లీకి మంత్రులు, ఎంపీలు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదంటూ స్పష్టీకరణ ప్రశాంత్‌ కిశోర్‌
తనకు ఎనిమిదేండ్ల నుంచి పరిచయం. ఆయన మాతో కలిసి పని చేస్తే తప్పేంటీ.
- సీఎం కేసీఆర్‌
- టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
         దేశవ్యాప్తంగా ఇప్పుడు కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై చర్చ కొనసాగుతున్నదనీ, వాస్తవానికి ఇప్పుడు మనం చర్చించాల్సింది కిసాన్‌ ఫైల్స్‌ (రైతు సమస్యలు)పై అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అన్నదాతల సమస్యలను పక్కదారి పట్టించేందుకే 'కాశ్మీర్‌ ఫైల్స్‌...'ను విస్తృతంగా ప్రచారంలో పెట్టారని ఆయన విమర్శించారు. కాశ్మీర్‌ పండిట్లపై దాడులు జరిగినప్పుడు బీజేపీ అధికారంలో లేదా..? అని ప్రశ్నించారు. పంజాబ్‌లో సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో తీర్మానించామని వెల్లడించారు. ఇదే అంశంపై మంత్రులు, తమ పార్టీ ఎంపీలు ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారని తెలిపారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని చెప్పారు. రైతు పోరు పేరిట ఈనెల 25 నుంచి గ్రామస్థాయి నుంచి ఆందోళనలు నిర్వహించాలని సీఎం సూచించారు. వాటిని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంట కొనుగోళ్లకు సంబంధించి 'ఒకే దేశం - ఒకే సేకరణ...' అనే విధంగా కేంద్రం విధానముండాలని అభిప్రాయపడ్డారు.
         సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మెన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు హాజరయ్యారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మూడు లక్షల ఎకరాల్లోని పంటను విత్తనాల కోసం రైతులు వాడుకుంటారు. మరో రెండు లక్షల ఎకరాలు సొంత అవసరాలకు వాడుకుంటారని చెప్పారు. ఇదే సమయంలో పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాల మేర వరి పంట తగ్గిందని వివరించారు. అతివృష్టితోపాటు ప్రకృతి వైపరీత్యాలు వస్తే దేశంలో ఆహార కొరత రాకూడదని భావించి తీసుకొచ్చిందే ఆహార భద్రత చట్టమని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఆ చట్టం నిర్వహణ బాధ్యతను రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని వివరించారు. ఈ క్రమంలో కేంద్రమే ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడని చెప్పారు. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులను సృష్టించిందని వివరించారు. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలనీ, కనీస మద్దతు ధర బియ్యానికి కాదు.. ధాన్యానికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ ధర ప్రకారమే పంజాబ్‌లో ధాన్యాన్ని సేకరిస్తున్నారని గుర్తు చేశారు. అదే విధంగా తెలంగాణలోనూ ధాన్యాన్ని సేకరించాలని కోరారు. బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఇవ్వాలని కేంద్రం చెబుతోందనీ, ధాన్యాన్ని ఇస్తే ముడి బియ్యం చేస్తారా? బాయిల్డ్‌ రైస్‌ చేస్తారా? అనే దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో ధాన్యం సేకరణ విషయంలో దాని వైఖరి సరిగ్గా ఉంటే స్వాగతిస్తామన్నారు. లేదంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలంటూ రైతులకు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామనీ, తెలంగాణ ఉద్యమ స్థాయిలో రైతుల కోసం పోరాడతామని కేంద్రాన్ని సీఎం హెచ్చరించారు. 'దేశంలో ఇప్పటివరకు అందరికీ రాజ్యాంగ పరమైన రక్షణ ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం ఆ విధమైన రక్షణ లేదు. రాజ్యంగ పరంగా రైతుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున మేం డిమాండ్‌ చేస్తున్నాం. రైతులను కాపాడాలన్నా.. వారి గౌరవం పెరగాలన్నా.. వారు స్వయం సమృద్ధిని సాధించాలన్నా.. వారికి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలి. తద్వారా కేంద్రం తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకోవాలి. ముందుకొచ్చి రైతులను చట్ట పరిధిలోకి తీసుకురండి. వారికి రక్షణ కల్పించండి. ఆ రకంగా రాజ్యాంగ సవరణ చేయండి. చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టండి. మా పార్టీ తప్పకుండా మద్దతు తెలుపుతుంది...' అని కేసీఆర్‌
మోడీ సర్కారుకు సూచించారు. 'ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ బలం తగ్గుతోందని గతంలోనే చెప్పాను. యూపీలో గతంలో ఆ పార్టీకి 312 సీట్లు వస్తే.. ఈ ఎన్నికల్లో 255 స్థానాలకు పరిమితమైంది. సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. ఆ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. బీజేపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదు. దేశం బాగుండాలంటే ఆ పార్టీని గద్దె దించాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారు. యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు మోడీకి అధికారం ఇచ్చారు. అయితే బీజేపీ పాలన మరింత అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వరంగ సంస్థలను మోడీ తన తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారు...' అని విమర్శించారు.
         ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళామన్నారు. ఈసారి తమ పార్టీ 95 నుంచి 105 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయన్నారు. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందంటూ నివేదికలు వచ్చాయని వివరించారు. వాటి ఆధారంగా మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 4 స్థానాలనే కోల్పోతామని తెలుస్తున్నదని వివరించారు. మరో 25 రోజుల్లో నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తాను నిర్ణయం తీసుకున్నానని కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలో తన ఆహ్వానం మేరకు ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చి తమతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పారు. డబ్బుల కోసమే ఆయన పని చేయబోరని వ్యాఖ్యానించారు. దేశం పట్ల పీకేకు ఉన్న నిబద్ధత ఏమిటో అందరికీ తెలిసిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆందోళన ఉండాల్సిన అవసరం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే వాటి విడుదలకు సమయం పడుతుందని సీఎం వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.