Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బలవంతపు భూసేకరణ ఆపాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 24,2022

బలవంతపు భూసేకరణ ఆపాలి

- వరంగల్‌ జిల్లాలో రైతుల ఆందోళన, ముందస్తు అరెస్ట్‌
- అసిస్టెంట్‌ కలెక్టర్‌ను అడ్డుకున్న అన్నదాతలు
- రైతుల పక్షాన నిలిచిన టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం
- పోలీసు బందోబస్తులో ప్రజాభిప్రాయ సేకరణ
నవతెలంగాణ-శాయంపేట
       నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి తమకు అన్నం పెట్టే పంట పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని ఎనిమిది గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలోకెళ్తే.. గట్లకానిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ రహదారి నిర్మాణానికి పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రారంభానికి ముందే కుసుంభ రాంచందర్రావు, రాజగోపాల్‌ ఇద్దరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో మిగిలిన రైతులు పాఠశాల ప్రాంగణం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకలను నొక్కి కార్పొరేట్‌ శక్తులకు పోలీస్‌, రెవెన్యూ అధికారులు దాసోహమై రైతులను అరెస్టు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది తీరు మార్చుకోవాలని నినదించారు. సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణిని రైతులు అడ్డుకున్నారు. చివరికి పోలీసు బందోబస్తు నడుమ ఆమెను సమావేశానికి తీసుకెళ్లారు. రైతులు లేకుండానే అధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమావేశానికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి పేరుతో సాగు భూములను లాక్కొని రైతులకు అన్యాయం చేయవద్దని అధికారులకు సూచించారు.
ఏలైన్మెంట్‌లో అధికారులకు రాజకీయ పరిస్థితులు దోహద పడుతున్నాయని, బడా నాయకులు ఉన్నచోట దారి పక్కకు జరిపామని నేషనల్‌ హైవే అధికారులే చెబుతున్నారనీ, కానీ సాధారణ ప్రజలైన రైతుల భూములను మాత్రం వదిలి పెట్టడం లేదని ఆరోపించారు. జాతీయ రహదారి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు కాదని, ఎకరాకు రూ.2 కోట్ల విలువ ఉందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అధికారులు కూడా రైతులందరి అభిప్రాయాలు సేకరించి అలైన్మెంట్‌ మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ భూముల్ని నమ్ముకునే ఇక్కడ రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తగా స్థిరపడినట్లు తెలిపారు. ఈ భూముల్లో ఏడాదికి మూడు పంటలు సాగవుతున్నాయని, అధికారులు మాత్రం ఒకే పంట సాగు అవుతున్నట్టు నివేది కలు ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా బలవంతపు భూ సేకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు.
భూసేకరణ ఆవశ్యకతను గుర్తించాలి
       సంధ్యారాణి, అదనపు కలెక్టర్‌ కొంత మంది రైతుల త్యాగాల వల్లనే నేడు సునాయాసంగా నేషనల్‌ హైవే రోడ్లపై ప్రయాణం చేస్తున్నామని, భూసేకరణ ఆవశ్యకతను రైతులు గుర్తించాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి రైతులకు సూచించారు. మంచిర్యాల కారిడార్లో 10 గ్రామాల్లో భూసేకరణ చేపట్టామని, వరంగల్‌, ఖమ్మం ప్రాజెక్టులో 180 కిలోమీటర్ల భూసేకరణ చేపడుతున్నట్టు తెలిపారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు కొంత మంది రైతులు భూమి కోల్పోవడం వల్లనే అభివృద్ధి జరిగినట్టు తెలిపారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కోసం వందల గ్రామాల రైతులు తమ భూములను కోల్పోయారని గుర్తు చేశారు. రహదారి నిర్మాణం వల్ల పొల్యూషన్‌, దుమ్ము ధూళి, వాతావరణ కాలుష్యం అవుతుందని, ఈ ప్రాజెక్టు వల్ల ముందస్తు చర్యలు చేపట్టడానికి పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతు న్నట్టు తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని సూచించారు. అనంతరం ఎనిమిది గ్రామాల రైతుల అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ వెంకట నర్సు, ఆర్డీవో వాసుచంద్ర, పరకాల ఏసీపీజే శివరామయ్య, శాయంపేట, పరకాల, దామెర, ఆత్మకూర్‌ మండలాల తహసీల్దార్లు, పోలీస్‌ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.