Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దెప్పుడు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 24,2022

రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దెప్పుడు?

- రాజస్థాన్‌, చత్తీస్‌గడ్‌లో ఓపీఎస్‌ అమలుకు నిర్ణయం
- ఆ దిశగా ప్రయత్నాలట
- పంజాబ్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ హామీ
- రద్దు బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం స్పష్టత
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగుల ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
         కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగుల సామాజిక భద్రతకు విఘాతంగా ఉన్నది. దీంతో సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు 2004 నుంచి దాన్ని రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లో ఇటీవల సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పాత పింఛన్‌ విధానం (ఓపీఎస్‌) అమలుకు నిర్ణయం తీసుకున్నాయి. వామపక్షాలు అధికారంలో ఉన్నపుడు పశ్చిమబెంగాల్‌, కేరళ, త్రిపురలో సీపీఎస్‌ను అమలు చేయకుండా ఓపీఎస్‌ను కొనసాగించాయి. త్రిపురలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఓపీఎస్‌ను రద్దు చేసి, సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చాయి. పశ్చిమబెంగాల్‌లో ఓపీఎస్‌ కొనసాగుతున్నది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ సైతం సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోపాటు మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో
ఆప్‌ సర్కారు భగవంత్‌మాన్‌ నేతృత్వంలో కొలువుదీరింది. అక్కడా త్వరలోనే ఓపీఎస్‌ అమలుకు చర్యలు చేపట్టే అవకాశమున్నది. ఆంధ్రప్రదేశ్‌లోనూ సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వచ్చేనెల నాలుగున ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ఆయన ఆదేశించారు. ఇలా ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతుండడంతో తెలంగాణలోని ఆ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో 'సీపీఎస్‌' రద్దెప్పుడు? అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్నది. సీపీఎస్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం 1.72 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర సర్కారు దాటవేత
         సీపీఎస్‌ విధానం దేశంలో 2004, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, సెప్టెంబర్‌ 1 నుంచి అమలైంది. 2014, ఆగస్టు 23న న్యూ పింఛన్‌ స్కీం (ఎన్‌పీఎస్‌) ట్రస్టుతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని జీవో నెంబర్‌ 28ని విడుదల చేసింది. సీపీఎస్‌ విధానం అమలు వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోయింది. దీంతో సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచే సీపీఎస్‌ను ఉద్యోగులు వ్యతిరేకించారు. అప్పటి ప్రభుత్వాలు దాటవేత ధోరణిని అవలంభించాయి. తెలంగాణ వచ్చాక ఈ అంశం తమ పరిధిలో లేదనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాంటూ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. కానీ, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర్ర ప్రభుత్వాలదేనంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. సీపీఎస్‌ రద్దు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కాలం ఉద్యోగులను మోసం చేసిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఒత్తిడి పెంచనున్నారు.
షేర్‌ మార్కెట్‌ను బట్టి సీపీఎస్‌ ఉద్యోగి పింఛన్‌
         ఓపీఎస్‌ కింద ఉన్న ఉద్యోగులకు రిటైరయ్యాక ప్రతి నెలా సర్వీస్‌ పింఛన్‌ అందుతున్నది. అంటే.. ఉద్యోగి రిటైరైన చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతాన్ని సర్వీస్‌ పింఛన్‌ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఒకవేళ పింఛనర్‌ చనిపోతే.. అతని భార్యకు, ఆ తర్వాత వారిపై ఆధారపడే దివ్యాంగులైన, పెళ్లికాని పిల్లలకు పింఛన్‌ సొమ్ము అందుతున్నది. చివరి నెలలో రూ.50 వేల వేతనం ఉంటే నెలకు రూ.25 వేల వరకు పింఛన్‌ వస్తున్నది. ఇది కుటుంబ పోషణకు, జీవితం చివరి దశలో పింఛనర్లకు బాసటగా ఉంటున్నది. కానీ, సీపీఎస్‌లో ఈ సౌకర్యం లేదు. సీపీఎస్‌ అనేది ఉద్యోగి చందా ఆధారిత స్కీమ్‌. ఈ స్కీమ్‌ కింద ఉద్యోగుల మూలవేతనం, డీఏ (కరువు భత్యం)ల నుంచి ప్రతినెలా 10 శాతం చొప్పున కట్‌ చేస్తారు. ప్రభుత్వమూ మరో 10 శాతం చందాను కలుపుతుంది. ఈ మొత్తాన్ని ఎన్‌పీఎస్‌-ఎన్‌ఎస్‌డీఎల్‌కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగి 'పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (ప్రాన్‌)'లో జమ చేస్తారు. దీనిని ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్యాంకులకు బదిలీ చేసి, అక్కడి నుంచి షేర్‌ మార్కెట్‌లో ఆ సొమ్మును పెడతారు. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత అప్పటివరకు ప్రాన్‌లో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి ఉద్యోగికి 60 శాతం చెల్లించేస్తారు. మరో 40 శాతం సొమ్మును షేర్‌ మార్కెట్‌లోనే కొనసాగిస్తూ వచ్చే లాభ నష్టాలతో కలిపి ఎంతో కొంత ప్రతి నెలా పింఛన్‌ రూపంలో చెల్లిస్తారు. దీని ద్వారా ఉద్యోగులకు ఒక్కోసారి రూ.రెండు వేలు, రూ.వెయ్యి, రూ.1500 పింఛన్‌ వచ్చిన సందర్భాలున్నాయి.
సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి : చావ రవి
         సీపీఎస్‌ విధానం బీజేపీ అధికారంలో ఉన్నపుడు తెచ్చిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కుటుంబాల సామాజిక భద్రతకు ఇది శాపంగా ఉందన్నారు. దీన్ని రద్దు చేయడం విజ్ఞత కలిగిన ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నపుడు పశ్చిమబెంగాల్‌, కేరళ, త్రిపురలో సీపీఎస్‌ను అమలు చేయలేదనీ, ఓపీఎస్‌ను కొనసాగించాయని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో వైఎస్‌ ఏకపక్షంగా సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.
కార్పొరేట్లకు మేలు చేసే సీపీఎస్‌ను రద్దు చేయాలి : స్థితప్రజ్ఞ
         కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాసే పార్టీలు ప్రవేశ పెట్టిన ఈ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పక్షపాతి అని నిరూపించునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వాలు పాతపింఛన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు. అదే తర హాలో రాష్ట్రంలోనూ ఓపీఎస్‌ను పునరుద్ధరించి దేశా నికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.