Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వలసకార్మికులు..పాలకులకు పట్టనోళ్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 24,2022

వలసకార్మికులు..పాలకులకు పట్టనోళ్లు

- వచ్చుడే..ఇంటికెళ్లే దాకా ప్రాణం మీద డౌటే
- పనిప్రదేశాల్లోనే ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం
- బయటి ముఖం ఎరుగరు..ఉన్నట్టూ తెలియదు..
- కార్పొరేట్ల కోసం వలసకార్మికుల హక్కులను తాకట్టుపెట్టిన కేంద్రం
- చస్తే మాకేంటి..లాభాలే ముఖ్యమన్నట్టుగా యాజమాన్యాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
         పాలకుల అలసత్వం..యాజమాన్యం నిర్లక్ష్యం 11 మంది వలసకార్మికులను బలిగొంది. ఓవైపు ఎగిసిపడుతున్న మంటలు..ఇంకోవైపు కమ్ముకున్న పొగతో నిద్రలోనే సజీవదహనమయ్యారు. పట్టెడన్నం కోసం కానరాని రాజ్యమొచ్చి యాజమాన్యాల లాభాల కుప్పల మధ్యలో ఎటూ వెళ్లలేక ప్రాణాలు కోల్పోవటం పాలకుల విధానపర లోపాన్ని ఎత్తిచూపుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు లేకుండా పోతున్నదనే విషయాన్ని సికింద్రాబాద్‌ బోయగూడ ప్రమాద ఘటన రుజువు చేస్తున్నది. ఇదే కాదు..క్షేత్రస్థాయిలో ఏ పరిశ్రమకెళ్లినా ఇదే పరిస్థితి. ప్రమాదంతో ఇది బయటపడింది..అవి బయటపడలేదు. మిగతాదంతా సేమ్‌టూసేమ్‌. వలస కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారు? ఏ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు? కనీసం తిండీ,నివాస సౌకర్యాలున్నాయా? పరిశ్రమలు రిజిష్ట్రర్లను మెయింటెన్‌ చేస్తున్నాయా? లేవా? ఇవేవీ తమకు పట్టదన్నట్టుగా కార్మిక శాఖ వ్యవహరిస్తుండటం...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమూ వలస కార్మికుల చట్టం అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించడంతో వారి జీవనం కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. పరిశ్రమల యాజమాన్యాలతో లాలూచీ పడి ఫ్యాక్టరీ సరైన ఎత్తులో ఉందా? సరిపడ విస్తీర్ణం ఉందా? ప్రమాదం జరిగితే నష్ట నివారణకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా? తదితరాలను పట్టించుకోవాల్సిన ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్‌ నిద్రమత్తులో జోగుతున్నది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం.. వలస కార్మికులు చనిపోతే బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుకోవటం పాలకులకు షరామామూలైపోయింది. క్షేత్రస్థాయిలో పనిప్రదేశాల్లోని ఇరుకు గదుల్లో వారు పడుతున్న వ్యథలు.. ప్రాణాలు కోల్పోతున్న తీరును ప్రభుత్వం పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. దీంతో పనికి వచ్చుడే తప్ప..సొంత రాష్ట్రానికి వెళ్లేదాకా ప్రాణముండేది డౌటే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సొంతరాష్ట్రం కార్మికులైతే ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. దీంతో లాభం తగ్గుతుంది. అదే వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తే తక్కువ వేతనం..ఎక్కువ లాభం.. బెదిరించి పనిచేయించు కున్నా అడిగేటోళ్లు ఉండరు. వీటిని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలు వలస కార్మికులవైపే దృష్టిసారిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారిలో నూటికి 70 మందికిపైగా వలసకార్మికులే ఉన్నారు. వారికిచ్చే వేతనం పదివేల రూపాయల లోపే. అదీ నెలవారీగా కాకుండా రోజువారీ వేతనంగా చెల్లిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయి లో ఉంది. పూర్తిగా కాంట్రాక్టర్లు, యజ మానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. చాలా వరకు పరిశ్రమల్లోనే రేకులతో బాత్‌రూమ్‌ల సైజులో రూములు నిర్మించి వాటిలో కార్మికులను కుక్కి ఉంచుతున్నారు. అక్కడే పనిచేయడం, తినడం, పడుకోవడంతో ఆ కార్మికులకు బాహ్యప్రపంచంతో పెద్దగా సంబంధా లు ఉండట్లేదు. ఆ రూముల్లో ఎలుకలు, పంది కొక్కులు తిరిగాడుతూ పందుల దొడ్లను తలపించే ఆ రూములను సీఐటీయూ ఎత్తిచూపినా సర్కారు పట్టించుకోలేదు. కొన్ని పరిశ్రమల్లో వారిని ఎతైన గోడలు, రేకుల షెడ్ల గోడౌన్లలో బందీలుగా ఉంచు తున్నారు. దానికీ వసతి పేరుతో అద్దె తీసుకుంటు న్నారు. భోజన, నీళ్ల ఖర్చుల కింద కోతపెడుతు న్నారు. అంతా పోనూ వలస కార్మికులు ప్రతి నెలా నాలుగైదు వేలు కూడా మిగలని దుస్థితి ఉంది.
కెమికల్‌, ఫార్మా, స్క్రాప్‌, టింబర్‌ డిపోలు, ఐరన్‌, స్టీల్‌, బ్యాటరీ, లెడ్‌, తదితర పరిశ్రమల్లో కనీస జాగ్రత్తలు పాటించకుండానే యాజమా న్యాలు కార్మికులతో పనిచేయిస్తున్నాయనే విషయాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర ఎత్తిచూపిన విషయం విదితమే. 'ఇక్కడ కార్మికుడు చనిపోయినా యజమానులు పట్టించు కోరు. ప్రశ్నించొద్దు. ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందే. లేకుంటే పనిలో నుంచి తీసేస్తరు. కేసులు పెట్టి వేధిస్తారు. మాదేమో సొంత రాష్ట్రం కాదు. మూసుకుని పనిచేయాల్సిందే' పాదయాత్ర సందర్భంగా ఓ కార్మికుడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిందే. ఒకరిద్దరు చనిపోతే అతను చెప్పినట్టే యాజమాన్యాలు బయటకు పొక్కనివ్వడం లేదు. బోయిగూడ లాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే చావుల సంఖ్య చెబుతున్నారుగానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ కప్పి ఉంచుతున్న పరిస్థితి.
         కోవిడ్‌-19 వలస కార్మికుల జీవితాలను మరింత తలక్రిందులు చేసింది. అంతరాష్ట్ర్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్‌ఎండబ్ల్యు)-1979 ప్రకారం వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ (స్వరాష్ట్రంలో, పనిచేస్తున్న రాష్ట్రంలో కార్మిక శాఖ వద్ద), వారు పనిచేస్తున్న పరిశ్రమల రిజిస్ట్రేషన్‌ వారిని కాంట్రాక్ట్‌ కార్మికులుగా తరలిస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సింగ్‌ మొదలైన బాధ్యతలను ప్రభుత్వం, యాజమాన్యాలు నిర్వర్తించాలి. దీనివల్ల వలస కార్మికులకు కొంతైనా భద్రత ఉండేది. ఈ చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వలస కార్మికుల విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు ఆడిందే ఆట..పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. సీఐటీయూతో పాటు కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐఎన్‌ఎండబ్ల్యు చట్టాన్ని (వలస కార్మికుల చట్టం) పునరుద్ధరించి, పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు కూడా వారిని పనిలో పెట్టుకుంటున్న యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలని, కాంట్రాక్టర్లకు లైసెన్సులు జారీ చేయాలని నొక్కి చెప్పింది. అంతేకాక కాంట్రాక్టర్లందరూ వలస కార్మిక చట్టాన్ననుసరించి వారి వివరాలను నమోదు చేయాలని, సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అలాగే చట్టంలో పేర్కొన్న అన్ని బాధ్యతలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు.
         బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి : సీఐటీయూ
సికింద్రాబాద్‌లోని బోయగూడలోని గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటనలో పేర్కొనారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. యాజమా న్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. వలస కార్మికుల చట్టాలు అమలయ్యేలా చూడాలని విన్నవించారు. భవిష్యత్‌లో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్రంలో అనుమతులు లేని వాటిని మూసివేయాలని సూచించారు. కార్మికులకు రక్షణ చర్యలులేని పని స్థలాల్లో పని చేయించకుండా కార్మిక శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలిచ్చే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ విధానాన్ని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.