Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మాట మార్చిన కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 25,2022

మాట మార్చిన కేంద్రం

- కొత్త ట్రిబ్యునల్‌కు న్యాయశాఖ 'నో'
- కృష్ణాజలాల వివాదానికి అంతమెప్పుడు ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
        కేంద్ర ప్రభుత్వం మరోసారి మాట తప్పింది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచిస్తామని అటు అపెక్స్‌ కౌన్సిల్‌, ఇటు సుప్రీంకోర్టులో చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ, న్యాయశాఖ సలహా పేరుతో అడ్డుకాలేసింది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఉనిఖీలో ఉండగా మరో ట్రిబ్యునల్‌ అవసరం లేదని తేల్చేసింది. తద్వారా పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్టయింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి సాక్షాత్తు రాజ్యాంగ ధర్మాసనం ముందు, అత్యున్నత కమిటీ అయిన అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచింది. తాజా నిర్ణయంతో కృష్ణా జలాల వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడున్నరేండ్లుగా ఈ సమస్య పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జల వివాదాలపై సీఎం కేసీఆర్‌ గతంలో కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రతిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన వ్యాఖ్యలు సైతం దుమారాన్ని రేపాయి. కృష్ణాజలాల నీటి వాటా పంపిణీకి సంబంధించి గత కొన్ని నెలలుగా రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు మధ్య పలులేఖలు నడిచాయి. ఇంకా కొనసాగుతున్నాయి. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యులు సందర్శించారు. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకున్నా, కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌కు తలవంచక తప్పలేదు. 2014లో వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఆ చట్టం ప్రకారం బోర్డుతోపాటు జలవివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్‌నూ ఏర్పాటు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలను పరిష్కరించడానికి ఈ ట్రిబ్యునల్‌ తోడ్పడుతుంది. కానీ కేంద్ర ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. స్వార్థ రాజకీయాలతో మోడీ సర్కారు ట్రిబ్యునల్‌ ఏర్పాటును పెండింగ్‌లో పెట్టింది. కాగా రాజ్యాంగబద్దంగా తమ నీటి వాటాను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతున్నది. ఇందుకు అంతరాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్‌ మూడు కింద రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏదైనా ఒక రాష్ట్రం ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా ఆ సమస్యను కేంద్రం పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయాలని చట్టంలోనే స్పష్టంగా ఉంది. ఇది దేశంలో ప్రస్తుతం అమలవుతున్న చట్టం. అయితే దీనిపై ఫిర్యాదు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే సెక్షన్‌ మూడు కింద జులై 14, 2014లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్టు అప్పటి రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. దీనిపై 2021, నవంబరు వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తప్పనిపరిస్థితుల్లో 13 నెలల తర్వాత, 2015 ఆగస్టులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్టు తెలిపారు. కోర్టులో పిటిషన్‌ ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉన్నా, పట్టించుకోలేదని సాగునీటిరంగ అధికారులు, నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పిటిషన్‌ ఉపసంహరించుకుంటేనే ట్రిబ్యునల్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి ఇప్పుడు కాడేత్తేయడం గమనార్హం. ఈ మేరకు సుప్రీంకోర్టులో చెప్పాలనీ కేంద్ర జలశక్తి శాఖ ఒత్తిడి చేయడంతో బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో న్యాయమార్గం సైతం మూసుకుపోయినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహాం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత దుర్మార్గం : సారంపల్లి మల్లారెడ్డి, సాగునీటిరంగ నిపుణులు
        అత్యంత దుర్మార్గం. ఇది తెలంగాణను మోసం చేయడమే. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గతంలో రెండుసార్లు రాష్ట్రానికి న్యాయం చేయలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌కు, సుప్రీంకోర్టుకు ఒక మాట చెప్పి, మరోకటి చేయడం దారుణం. 75 శాతం జలాలకు బదులు 65 శాతమే తీసుకుంది. కర్నాటక, మహారాష్ట్రకు కేటాయించి తెలంగాణ జలాలను క్యారీఓవర్‌లో పెట్టాలే తప్ప, వాడుకోవద్దు అని చెప్పింది. కర్నాటక కరువు ప్రాంతాలను గుర్తించిన బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తెలంగాణలోని మహబూబ్‌నగర జిల్లా కరువు ప్రాంతాలను పట్టించుకోలేదు. ఇలా రెండురకాలుగా అన్యాయం చేసింది. ఆ ట్రిబ్యునల్‌ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగదు. కొత్త ట్రిబ్యునల్‌ అవసరం లేదనే కేంద్రం వాదనను ఖండిస్తున్నాం.
ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందే : సాగునీటి శాఖ ఉన్నతాధికారి
        బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ద్వారా న్యాయం జరగనందుకే కొత్త ట్రిబ్యునల్‌ అడిగాం. సెక్షన్‌ మూడు ప్రకారం కేంద్రానికి పదే పదే లేఖలు రాశాం. ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ ఇలా మోసం చేయడం సరికాదు. అపెక్స్‌ కౌన్సిల్‌లో, సుప్రీంకోర్టులో చెప్పిన మాటను కేంద్రం తప్పుతున్నది. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు. ప్రభుత్వం పరంగా గట్టిచర్యలు తీసుకుంటామని పేరు రాయడానికి ఇష్టపడి ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కేంద్రం చర్యతో రాష్ట్రానికి న్యాయమార్గం కూడా మూసుకుపోయినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో కేసు రీఓపెన్‌ చేయాలి : శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజీనిర్‌
         కేంద్రం నమ్మకద్రోహం చేస్తున్నది. ఆరోజు చెప్పింది ఒకటి, ఈరోజు చేస్తున్నది మరోకటి. అపెక్స్‌ కౌన్సిల్‌తోపాటు సుప్రీంకోర్టులో కేంద్ర జలశక్తిశాఖ చెప్పినదానికి భిన్నంగా వ్యవహారం చేస్తున్నది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు కృష్ణా జలాల వివాదాన్ని అప్పగించాలా ? లేక కొత్త ట్రిబ్యునల్‌ను వేయాలా అనే అంశంపైనే న్యాయశాఖ సలహా కోరుతామని కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. కానీ, ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్‌ అవసరమే లేదనడం సరికాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు రీపెన్‌చేయాలి. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.