Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మళ్లీ రాజోలి రగడ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 25,2022

మళ్లీ రాజోలి రగడ

- కొత్త పథకాలకు ఏపీ శ్రీకారం
- సర్కారు గరంగరం
- మూడు దశాబ్దాలుగా పెండింగ్‌
         రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) వివాదం మరోసారి రాజుకుంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గురు రాఘవేంద్ర సాగునీటి ప్రాజెక్టుతోపాటు మరో 13 చిన్న తరహా ఎత్తిపోతల పథకాలతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
         తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. తుంగభద్ర నది నుంచి అక్రమంగా 5.373 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖతోపాటు సాగునీటి రంగ నిపుణులు విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల కృష్ణానదీజలాల నిర్వహణ బోర్డు(కేఆర్‌ఎంబీ)కి ప్రభుత్వం లేఖ రాసింది. అసలు వివాదం ఏంటీ, గతంలో సూచించిన పరిష్కారాలు ఏంటి ? అమలైన తీరు తదితర వివరాల్లోకి వెళితే...
రాజోలిబండ డైవర్షన్‌..బ్యారేజీ
         1946లో ప్రారంభించిన ఈ పథకం 1958లో పూర్తిశారు. తుంగభద్ర నదిపై ఎడమవైపు కర్నాటక, కుడివైపున ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ఉన్నచోట ఈ ఈప్రాజెక్టును నిర్మించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 79 గ్రామాలు, గద్వాల తాలూకాలోని ఎనిమిది గ్రామాలకు 143వ కిలోమీటర్‌ కాలువకు నీటిని సరఫరా చేస్తున్నారు. 80 వేల ఎకరాలకు సాగునీటి లక్ష్యంతో 15.90 టీఎంసీలను కేటాయించారు. ఇందులో 6.51 టీఎంసీలు తుంగ భద్ర డ్యాం నుంచి, మిగిలిన 9.39 టీఎంసీలు తుంగభద్ర డ్యాం దిగువ క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి నికరజలాలను అప్పట్లో కేటాయించారు. కానీ ఏనాడూ 15.90 టీఎంసీలు రాలేదు. చివరకు రాజోలిబండకు లోకలైజ్‌ చేసిన 30 వేల ఎకరాల ఆయకట్టును జురాలకు అనుబంధం చేశారు. అస్సలు జురాలకే కేటాయించిన 17.84 టీఎంసీలు మాత్రం వినియోగం కావడం లేదు. చివరకు జురాల నుంచి రామన్‌పాడ్‌కు లింకుపెట్టడం ద్వారా మహబూబ్‌నగర్‌, వనపర్తి, కొల్లాపూర్‌, జడ్చర్ల పట్టణాలకు తాగునీటిని అందిస్తున్నారు. న్యాయంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు రావాల్సిన నీటిని విడుదల చేయకుండా అన్యాయం చేశారు.
వివాదాలు ఉమ్మడి రాష్ట్రంలోని కర్నూలు-మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఆర్డీఎస్‌పై ఘర్షణకు దిగాయి. ఒకవైపు కర్నాటకతో వివాదం నడుస్తుండగా, మరోవైపు తెలంగాణ, ఆంధ్ర తగాదాలు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వ ఉదాసీనవైఖరే ఇందుకు మూలం. ఈ ఘర్షణలతో కర్నాటక లబ్ధిపొందుతున్నదనే అభిప్రాయమూ ఉంది. 1.2 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సిన కర్నాటక, ఐదు నుంచి ఆరు టీఎంసీల వరకు వాడుకుంటున్నది. దీంతో రాష్ట్ర వాటా తగ్గింది. సుంకేశుల ఆనకట్టకు ఎగువన తుంగభద్ర నదిపైన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా రాజోలిబండ వద్ద 1947-58 మధ్య మరో ఆనకట్టని నిర్మించి, ఆర్డీఎస్‌ పేర కర్నాటకకు 5879 ఎకరాలకు, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు 87,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ ఆనకట్ట నిర్మించిన చోట తుంగభద్ర నది ఎడమవైపు కర్నాటక, కుడివైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలున్నా, ఆర్డీఎస్‌ కాలువ మాత్రం ఎడమవైపు 850 క్యూసెక్కుల ప్రవాహశక్తితో 143 కిలోమీటర్లు వెళ్లాలి. 1973, 1976లో కృష్ణాజలాల వివాదంలో జస్టిస్‌ బచావత్‌ తుంగభద్ర నీటి పంపిణీని కూడా చేర్చి కర్నాటక-తెలంగాణ నీరు ఎంతెంత వాడుకోవాలో తీర్పుచెప్పారు. ఆ తీర్పులో తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌(కర్నాటక) 0.49 టీఎంసీలు, తెలంగాణకు 6.51 టీఎంసీలు, కేసీ కెనాల్‌ 10.00 టీఎంసీలు కేటాయించారు. అలాగే తుంగభద్ర డ్యాం దిగువన క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి కర్నాటక 0.71 టీఎంసీలు, తెలంగాణకు 9.39 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 29.90 టీఎంసీలు వాడుకోవచ్చని ఆ తీర్పులో పేర్కొన్నారు.
రాజోలిబండ-కేసీ కెనాల్‌కు తుంగభద్ర జలాల వినియోగం
         తుంగభద్ర జలాల నుంచి రాజోలిబండ మళ్లింపు పథకానికి 17.10 టీఎంసీలు, కేసీ కెనాల్‌(కర్నూలు-కడప కాలువ)కు 39.90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ బచావత్‌ తీర్పు చెప్పింది. తీర్పుకు భిన్నంగా నీటి వినియోగమ వుతున్నది. కర్నాటక మాత్రం మించి వాడుకుంది. ఈ జల పంపిణీని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు రావాల్సిన 15.90 టీఎంసీల వాటా మాత్రం రాలేదు. నీటి వినియోగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం. అందుకే మహబూబ్‌నగర్‌కు అవకాశాలుండి కరువు జిల్లాకు మారింది. కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జురాల నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాకు 17.84 టీఎంసీలు కేటాయించారు. 1.02 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి జురాల-రాజోలిబండ లింక్‌ కెనాల్‌ తవ్వి జురాల నీటిని రాజోలిబండ ఆయకట్టు 30వేల ఎకరాలకు మళ్లిస్తున్నారు. కాగా జురాల ఆయకట్టుకు మాత్రం నీరందడంలేదు. గత సంవత్సరం వరకు 12 టీఎంసీలకు మించి వాడకపోవడం తెలిసిందే.
రాజోలిబండ సాగు లక్ష్యం
         ఆర్డీఎస్‌ నుంచి 850 క్యూసెక్కుల నీరు ప్రవహించి కర్నాటకలోని రాయచూరు జిల్లాకు, తెలంగాణలోని మమహబూబ్‌నగర్‌ జిల్లాకు బచావత్‌ తీర్పు ప్రకారం సాగునీరివ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. కర్నాటక తన వాటా 1.2 టీఎంసీలకు మించి 4.5 టీఎంసీల నుంచి 5.60 టీఎంసీల వరకు అధికంగా వాడుకుంటున్నది. గత 18 ఏండ్లుగా 470 శాతం నీటిని వాడుతూ తన 5879 ఎకరాలకు మించి సాగునీటి సౌకర్యం కల్పించుకుంది. 15.90 టీఎంసీలు వాడుకుని 87,500 ఎకరాల సాగుకావాల్సిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు మాత్రం అన్యాయమే జరుగుతున్నది. 1976 నుంచి 1987 వరకు సగటున 50,624 ఎకరాలకు 12 టీఎంసీలే వినియోగమయ్యాయి. 1988 నుంచి 2002-03 వరకు 37,990 ఎకరాలకు 6.65 టీఎంసీల నీరే వినియోగించినట్టు రాష్ట్ర సాగునీటిశాఖ చెబుతున్నది. ఆర్డీఎస్‌కు మొదట 850 క్యూసెక్కులు విడుదల చేస్తే, తెలంగాణకు చేరేవరకు 771 క్యూసెక్కులే వస్తుంది. ఆ వచ్చిన నీటిని సక్రమంగా వాడుకోవడానికి కాలువలు అందుకు తగినట్టుగా లేవు. కాలువ వెడెల్పు, ఎత్తు, గేట్ల నిర్మాణంలో జరిగిన తగ్గింపు మూలంగా మహబూబ్‌నగర్‌ 15.90 టీఎంసీల తన వాటాను ఎప్పుడూ నష్టపోతూనే ఉంది.
ఇప్పటికైనా...
         దశాబ్ధాల తరబడి తుంగభద్ర నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉమ్మడిరాష్ట్రంతోపాటు తెలంగాణ ఆవిర్భావం తర్వాతా ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. కేఆర్‌ఎంబీతో విస్త్రృత సంప్రదింపులు చేయాలని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ కోసం తుంగభద్ర బోర్డు ఏర్పాటైంది. నీటిని పర్యవేక్షించడం దీని పని. కానీ, ఇంతవరకూ అది జరగలేదు. మహబూబ్‌నగర్‌కు నీళ్లే రాలేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తన రాజకీయ పలుకుబడితో మహబూబ్‌నగర్‌కు నీళ్లు రాకుండా చేశారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇంతకాలం నుంచి జరుగుతున్న అన్యాయాన్నీ ఇప్పటికైనా గట్టిగా ప్రశ్నించాలి. కేసీ కెనాల్‌కు వెళ్లే నీళ్లను నిరోధించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలనే డిమాండ ముందుకు వస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.