Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంతో కలిసి పని చేస్తామని బోస్టన్ లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 హెల్త్ కేర్ ఎట్ ఎ గ్లాన్స్ సదస్సులో మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ అన్నారు. హైదరాబాద్, బోస్టన్ నగరాల మద్య అనేక పోలికలున్నాయని తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు పేరుగాంచినవని చెప్పారు. పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉన్నదన్నారు. తద్వారా ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ జీవశాస్త్ర రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిందని తెలిపారు. వాటికి సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.