Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 26,2022

సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి

- ఆన్‌లైన్‌ బహిరంగ సభలో కార్మికులకు టీఎస్‌ఆర్టీసీ జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
          ఈనెల 28,29 తేదీల్లో రెండ్రోజులపాటు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు భాగస్వాములు కావాలని 9 కార్మిక సంఘాలతో కూడిన టీఎస్‌ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బహిరంగ సభ నిర్వహించారు. జేఏసీ కమిటీ సభ్యులు పి రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి గోపాల్‌ (ఎంప్లాయీస్‌ యూనియన్‌), వైస్‌ చైర్మెన్‌ కే హన్మంతు ముదిరాజ్‌ (టీజేఎమ్‌యూ), కన్వీనర్లు వీఎస్‌ రావు (టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌-ఎస్‌డబ్ల్యూఎఫ్‌), పీ కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), ఎస్‌ సురేష్‌ (బీడబ్ల్యూయూ), బీ యాదగిరి (కార్మిక పరిషత్‌) మాట్లాడారు. ''దేశాన్ని, దేశ ప్రజల్ని రక్షించండి'' నినాదంతో ఈ సమ్మె జరుగుతున్నదని చెప్పారు. కేంద్రం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతున్నదనీ, ఆ రంగం వినాశనానికి గురయితే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. ఒకప్పుడు నష్టాలున్నాయనే సాకుతో ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటుకు అప్పగించేవారనీ, ఇప్పుడు లాభాలు వచ్చే ఎల్‌ఐసీ, రైల్వే, టెలికం, విద్యుత్‌, రక్షణ రంగాలను కూడా ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ, కార్మిక వర్గాలను తీవ్ర ఆందోళనల్లోకి నెట్టేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్తూనే, రాష్ట్రంలో అదే అణచివేత ధోరణిని అవలంబిస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధోరణిని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని హితవు పలికారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌ల రూపంలోకి మార్చి, వాటిని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నదనీ, తక్షణం వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్‌ ధరలపై క్యాప్‌ విధించి, మిగిలిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో రెండు శాతం నిధులు కావాలని కోరితే పట్టించుకోలేదన్నారు. ఓవైపు రిటైర్‌మెంటు వయోపరిమితి పెంచి, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో కార్మిక, ఉద్యోగ సంఘాలను గుర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో సంఘాలు లేవనడం లేబర్‌ కోడ్‌ల అమల్లో భాగమేనని విమర్శించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలపై కార్మిక లోకం తిరగబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ కార్మికులంతా రెండ్రోజుల సమ్మెలో సంఘాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసిఫాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ, యాజమాన్య వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన ఎమ్‌డీ గౌస్‌కు జేఏసీ ఆన్‌లైన్‌ బహిరంగ సభలో సంతాపం ప్రకటించారు. కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోయే చర్యలకు యాజమాన్యం పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు.
సమ్మెలో పాల్గొనండి-ఎమ్‌ థామస్‌రెడ్డి
          కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎమ్‌ థామస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీలోని అన్ని స్థాయిల కార్మికులు ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజా రవాణా బిల్లును ఉపసంహరించుకోవాలనీ, ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలనీ, బల్క్‌ డీజిల్‌పై గతంలో మాదిరే సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.